కార్యకర్తల కృషితోనే తెలంగాణలో అధికారం : మల్లికార్జున ఖర్గే

Publish Date:Jul 4, 2025

Advertisement

 

గతంలో అమెరికా బెదిరించినా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భయపడలేదని, కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయగానే పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘కాంగ్రెస్‌ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో మాట్లాడుతు ఆపరేషన్ సింధూర్‌కు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్‌తో యుద్ధాన్ని మధ్యలోనే నిలిపివేశారని ఆయన అన్నారు. 

దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి ఒక్కరైనా దేశం కోసం ప్రాణాలను అర్పించారా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ, అమిత్ షా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చిందని ఖర్గే పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్‌ను ఓడించారని ప్రశంసించారు. మాజీ సీఎం కేసీఆర్ తన పాలనలో రైతులను, మహిళలను, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రధాని మోడీ, కేసీఆర్, కేటీఆర్ దీనిపై చర్చ పెట్టాలని, ఒక్క ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు నిరూపించినా వారి కాళ్ళ ముందు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.గత బీఆర్ఎస్ పాలనలో యువతను గొర్రెలు, బర్రెలు కాయాలని, చెప్పులు కుట్టుకోవాలని, చేపలు పట్టుకోవాలని వారి కులవృత్తుల్లోకి మళ్ళీ వాళ్ళని నెట్టాలని చూశారని ముఖ్యమంత్రి అన్నారు

By
en-us Political News

  
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉథృతి కొనసాగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఆ సుందర జలదృశ్యాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో పర్యటకులు వస్తున్నారు.
కింద పడ్డా పై చేయి నాదే అన్న నానుడి వినే ఉంటారు ...అచ్చం అలాగే వ్యవహరిస్తున్నరట మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్. మద్యం కుంభకోణం కేసులో పీకల్లోతు కూరుకుపోయిన జగన్ రేపో మాపో విచారణ ఎదుర్కోక తప్పదని ఓ పక్కన లోకం మొత్తం కోడై కూస్తున్నా.. అబ్బే మనకున్న పరపతి ముందు కేసులు పెద్ద లెక్క కాదు అనేలా బిల్డప్ ఇస్తున్నారా అనిపిస్తుంది ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.
సృష్టి కేసులో త‌వ్వే కొద్దీ న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. డాక్ట‌ర్ న‌మ్ర‌త జ‌గత్ జంత్రీగా క‌నిపిస్తోంది. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కూ హైద‌రాబాద్ లో 30 స‌రోగ‌సీ కేసులు హ్యాండిల్ చేయ‌గా.. ఆమె బేబీ సెంట‌ర్ కి స‌రోగ‌సీ విష‌యంలో క‌నీసం ప‌ర్మిష‌న్లు లేవ‌ని తెలుస్తోంది.
జ‌గ‌న్ ప్రెస్ మీట్లకు.. ఈ మ‌ధ్య రాముడు మంచి బాలుడికి మ‌ల్లే వ‌చ్చేస్తున్నారు. భ‌ల్లే భ‌ల్లే క‌బుర్లు చెబుతున్నారు. అంతా బాగుంది. ఆయ‌న క‌బుర్ల‌న్నీ పేప‌ర్లూ, టీవీల్లో వ‌చ్చేస్తాయి. కాద‌న‌డం లేదు. కానీ ఈ బొట్టు పెట్టుకుని మ‌రీ బుద్ధిమంతుడ్లా క‌నిపించ‌డ‌మేంటా? అన్న‌ది ఒక అనుమానం. ప్ర‌శ్న‌. చ‌ర్చ‌. వ‌గైరా వ‌గైరా.
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం (జులై 30) 8.8 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా జపాన్, అమెరికా, గ్వామ్ వంటి పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు వరుణ్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
గొర్రెల స్కాం కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో 10 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలపై గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది.
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో కీలక వ్యక్తులు వరుసగా అరెస్టౌతున్నారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ పునాదుల వరకూ వెడుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత జగన్ కు అరెస్టు భయం పెచ్చరిల్లిందని పరిశీలకులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెరిగింది. ఈ కుంభకోణంలో దోచుకున్న కోట్ల రూపాయల సొమ్మును దాచిన ప్రదేశాన్ని గుర్తించిన సిట్.. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది.
ర‌ష్యాలో భారీ భూకంపం సంభ‌వించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 8.7గా నమోదైంది. 2011 టోకియో భూకంపం తరువాత ఇదే అతి పెద్ద భూకంపంగా అధికారులు చెబుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. పవిత్రమైన శ్రావణమాసం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
యువతీ, యువకులు సెల్ఫీ మోజులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లు, నదులు, కొండలు వంటి ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
రుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.