గీత దాటితే అరెస్ట్...కేసీఆర్‌కు రేవంత్ లక్ష్మణ రేఖ

Publish Date:Aug 10, 2025

Advertisement

 

కాళేశ్వరం నివేదికను ఒక అస్త్రంగా చేసుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను అరెస్టు చేస్తారా ? కాళేశ్వరం ప్రాజెక్ట్’ నిర్మాణానికే కాదు, అందులో జరిగిన అవకతవకలకు, కర్త, కర్మ, క్రియ అన్నీ,ఆయనే అని, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్’ నివేదిక తేల్చి చెప్పిన నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌ను అరెస్టు చేస్తుందా? అనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజానీకంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

నిజానికి,అరెస్టు చేయడమా, చేయక పోవడమా అనేది, విచారణ  కమిషన్ నివేదిక ఆధారంగా తీసుకునే నిర్ణయం కాదు. రాజకీయంగా తీసుకోవలసిన నిర్ణయం. అందుకే, రాజకీయ లాభ నష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని,విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం   గతంలో కేసీఆర్’ ప్రభుత్వం తనను జైలుపాలు చేసిన చేదు అనుభవాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోలేదని ఇంతవరకు చెపుతూ వచ్చారు. అలాగే, తప్పక ప్రతీకారం తీర్చుకుంటారని, సన్నిహితులు మాత్రమే కాదు, అప్పట్లో రేవంత్ రెడ్డి చేసిన శపధం గుర్తున్న అందరూ భావిస్తూ వచ్చారు.


అయితే,ఇటీవల ఢిల్లీ  మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చచ్చిన పామును ఇంకేం చంపుతాం,అన్నట్లు, ఇప్పటికే కేసీఆర్, ఫార్మ్ హౌస్’ లో స్వీయ’ బందీగా ఉన్నారు. ఆయన్ని కొత్తగా జైలుకు పంపవలసిన అవసరం లేదు. ఇప్పడు ఆయనకు చర్లపల్లి జైలు అయినా, ఫార్మ హౌస్ అయినా ఒక్కటే’ , ఫార్మ్ హౌస్’ లో సంరక్షణ ఉంటుంది, చర్లపల్లి జైల్లో పహారా. ఉంటుంది .. అదొక్కటే తేడా.. కాబట్టి…
అంటూ, కేసీఆర్’ను జైలుకు పంపే ఆలోచన లేదనే ముఖ్యమంత్రి ఒక విధంగా స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. ఒక విధంగా అదే తుది నిర్ణయం అనే భ్రమలను కల్పించారు. 

అయితే, అదే ప్రభుత్వ అంతిమ నిర్ణయమా లేక కేసీఆర్’ జనంలోకి రాకుండా, ఆయన ముందరి కాళ్లకు బంధం వేసే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అరెస్ట్ ఉండదనే సంకేతాలు ఇచ్చారా,,అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్’ బయటకు రానంత వరకు అరెస్ట్’ ఉండదని కాదని కాలు బయట పెడితే మాత్రం ‘అరెస్ట్’ తప్పదనే సంకేతాలు ఇచ్చారా, అనే అనుమనాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

అదే సమయంలో, ఇప్పటికిప్పడు కేసీఆర్’ను అరెస్ట్ చేస్తే,అందుకు  రాజకీయంగా మూల్యం చెల్లించుకోవలసి వస్తుందనే అభిప్రాయం కూడా, పార్టీ వర్గాల్లో వ్యక్త  మవుతోందని అంటున్నారు. మరో వంక కేసీఆర్’ ను అరెస్ట్ చేయడం వల్లనే కాదు,అరెస్ట్ చేయక పోవడం వలన కూడా కాంగ్రెస్ పార్టీ, రాజకీయంగా ఎంతో కొంత మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు. గత (2023) అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తెను అరెస్ట్ చేయక పోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల అస్త్రంగా మలచు కున్నారు. 

‘బీజీపీ,బీఆర్ఎస్ ఒక్కటే’ నినాదాన్ని, జనంలోకి బలంగా తీసుకు పోయారు. అదే సమయంలో బీజేపీ ఆదిస్థానం బండి సంజయ్’ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో కాంగ్రెస్’ఆరోపణలకు మరింత బలం చేకూరి బీజేపీ మరింతగా నష్ట పోయిందని, ఇప్పటికీ రాజకీయ విశ్లేషణల్లో వినిపిస్తూనే ఉంటుంది. అప్పుడే కాదు, ఇప్పటికి  కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూనే వుంది. అయితే, ఇప్పడు కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్, కేసుల్లో కేసీఆర్ ను అరెస్ట్ చేయక పోతే,కాంగ్రెస్ ప్రయోగించిన, ‘కుమ్ముక్కు’ అస్త్రాన్నే బీజేపీ ప్రయోగించే ప్రమాదం వుంది.

నిజానికి,బీజీపే సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్,ఇప్పటికే ఆరోపణలు ప్రారంభించారు.కేసీఆర్’కు కాంగ్రెస్ అధిష్టానంతో డీల్ కుదిరిందని, ముడుపులు చేతులు మారుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. సో .. ఒక విధంగాచూస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో’ చెప్పలేమని అంటున్నారు.అలాగే, రేవంత్ రెడ్డి, కాళేశ్వరం నివేదికను, అసెంబ్లీ ఇతర వేదికల ద్వారా బీఆర్ఎస్’ను, కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేసేందుకు ఉపయోగించుకుంటారే, కానీ, కేసీఆర్’ నే కాదు,ఆయన  కుటుంబం సభ్యుల్లో ఏ ఒక్కరి విషయంలోనూ విచారణలు అరెస్టుల వరకు పోరనే  అంటున్నారు. 

ముఖ్యంగా, రేవంత్ రెడ్డి లోపలి మనిషి తెలిసిన సన్నిహితులు, కనిపించినంత దూకుడుగా నిర్ణయాలు తీసుకోరని అంటారు.అందుకే రేవంత రెడ్డి బయటకు ఆవేశంగా రాజకీయం చేస్తున్నట్లుగా కనిపించిన,కీలక సమయంలో ఆచి తూచి అడుగులు వేస్తారని, గత 18 నెలల పాలనలోనూ అదే వ్యూహాత్మకంగా,పట్టు విడుపులు ప్రదర్శిస్తూ పాలన సాగిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో  రాజకీయంగా లాభనష్టాలు వేసుకుని ముందడుగు వేస్తున్నారు.ఈ విషయంలో రేవంత్ రెడ్డి భవిష్యత్ వ్యూహాలు, నిర్ణయాలు చర్యలను ఊహించడం కష్టమని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.