కాంగ్రెస్ లో ఒంటరయిన ముఖ్యమంత్రి

Publish Date:Apr 29, 2013

Advertisement

 

ఏ కార్యక్రమమయినా సాదాసీదాగా జరిగితే అది ఖచ్చితంగా కాంగ్రెస్ కి సంబందించినది మాత్రం కాదని చెప్పవచ్చును. అది కాంగ్రెస్ సమావేశం అయినా, పధకం అయినా నియామకం అయినా ఎంతో కొంత రాజకీయం తప్పని సరి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ హస్తం’, ‘ఇందిరమ్మ కలలు’, ‘బంగారు తల్లి’ పధకాలను ఈ రోజు మెదక్ జిల్లా సంగారెడ్డిలో ప్రారంభించనున్నతరుణంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఈ కార్యక్రమాలకి మొహం చాటేసి విదేశాలకు వెళ్ళిపోయారు. ముఖ్య మంత్రి తనకు ఏమాత్రం విలువ ఈయడం లేదని ఆయన అలిగారు. కానీ, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సునితా రెడ్డి మాత్రం వారిరువురి మద్య ఎటువంటి విభేదాలు లేవవి ఒక సర్టిఫికేట్ జారీచేసారు.

 

ఇక, మొన్న కరీంనగర్ లో జరిగిన మరో సభలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణా విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవాలని, తెలంగాణా రాష్ట్రం కోసం కేంద్రాన్ని ఒప్పించవలసిన బాధ్యత తీసుకోవాలని సభాముఖంగా కోరిన తరువాత ‘జై తెలంగాణా!’ అంటూ నినాదాలు చేసారు. దానితో వేదిక మీదున్న కిరణ్ కుమార్ రెడ్డి కొంచెం అసహనం ప్రకటిస్తూ తెలంగాణా అంశం కేంద్రం పరిధిలో ఉందని కేంద్రం ఏ నిర్ణయం తీసుకొన్నా దానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రకటించవలసి వచ్చింది.

 

ఒకవైపు ఎంతో ఆర్భాటంగా ఆయన తన పధకాలను ప్రచారం చేసుకొని ప్రజలలో తన ప్రతిష్ట పెంచుకోవాలని ఆయన ప్రయత్నిస్తుంటే, అది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం, దానితో తమకేమి సంబంధం లేదన్నట్లు ఆయన క్యాబినెట్ మంత్రులే ప్రవర్తించడం విశేషం. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రితో ఆయనకున్న విబేదాలు తరచూ బయట పడుతూనే ఉన్నాయి.

 

ఇక రాష్ట్ర మంత్రి వర్గం, శాసన సభ్యులలో సగం మంది తెలంగాణా కారణంగా ఆయనను వెలివేస్తే, వివిధ కారణాలతో డా.రవీంద్రా రెడ్డి, వీ.హనుమంత రావు, చిరంజీవి, రామచంద్రయ్య వంటివారు అనేక మంది ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఇక, మాజీ మంత్రి శంకర్ రావు అయితే తీవ్ర విమర్శలు చేసారు. ముఖ్యమంత్రి పరిస్థితి చూస్తే ఆయనకు కేవలం అధిష్టానం మద్దతు ఉండనే ఏకైక కారణంతోనే మిగిలిన వారందరూ ఆయనని బలవంతంగా భరిస్తున్నట్లు ఉంది తప్ప, ఆయనతో కలిసి పనిచేసే ఆసక్తి ఎవరికీ ఉన్నట్లు కనబడటం లేదు. అందుకు ఆయననే తప్పుపట్టాల్సి ఉంటుంది.

 

పార్టీలో, ప్రభుత్వంలో అందరిని కలుపుకుపోవలసిన పార్టీలో ఒంటరివాడుగా తిరుగుతున్నారు. కానీ పార్టీలో, ప్రభుత్వంలో తనను ఎంతమంది వ్యతిరేఖిస్తున్నా ఆయన మాత్రం తన పద్దతిలో ముందుకు సాగిపోతున్నారు. మరి, ఇటువంటి నేపద్యంలో ఆయన సారద్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కొంటుందో, ఏవిధంగా గెలుస్తుందో కాలమే చెప్పాలి.

By
en-us Political News

  
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. నియోజకవర్గ పరిధిలోని తంబిగాని పల్లెలో తెలుగుదేశం వర్గీయులపై దాడికి తెగబడ్డాయి.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవలు ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం పేరు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. నియోక‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి అరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ఏపీలో పోలింగ్ రోజు నియోజ‌క‌వ‌ర్గంలో పిన్నెల్లి సోద‌రులు, వారి అనుచ‌రులు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు, కార్య‌కర్త‌ల‌పై దాడులకు తెగ‌బ‌డి భ‌య‌ బ్రాంతుల‌కు గురిచేశారు.
పిరికి పిల్లి పిన్నెల్లి చేసిన పాపాలకు కనీసం ఏడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. ఆయన రాక కోసం సెంట్రల్ జైలు గేటు ఎదురుచూస్తోంది.
మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కీలక నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బుధవారం పంపించారు.
మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం ఘటనలో బాధితుడు శేషగిరిరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి, పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండగా ఉంటుందని... ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈవీఎంపై దాడిని ధైర్యంగా అడ్డుకునే ప్రయత్నం చేశారని అభినందించారు.
శాంక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైన అచ్చ తెలుగు మహిళ జయ బాడిగ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఈ సందర్భంగా తెలుగు వెలుగును చాటారు.
పోలీసుల కళ్ళుగప్పి పిన్నెల్లి బ్రదర్స్ తప్పించుకుని పారిపోయారని తెలుస్తోంది. వీళ్ళ అరెస్టు గురించి గానీ, మళ్ళీ తప్పించుకుని పోయిన  విషయంలో గానీ, పోలీసుల నుంచి స్పష్టమైన సమాచారం రావడం లేదు.
ఆంధ్రప్రదేశ్ పోలింగ్‌ రోజున మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను ధ్వంసం చేశారు.
కిక్రెట్ రారాజు, రన్ మిషన్ కింగ్ విరాట్ కోహ్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉందా? అంటే ఔననే అంటున్నారు గుజరాత్ పోలీసులు. కచ్చితమైన సమాచారం మేరకు కింగ్ కోహ్లీ లక్ష్యంగా ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించిన నలుగురు టెర్రరిస్టులను అదుపులోనికి తీసుకున్నామని చెబుతున్నారు.
పిఠాపురంలో అంబేద్కర్‌ విగ్రహానికి అవమానం జరిగింది. పట్టణంలోని అగ్రహారం పశువుల సంత సమీపంలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్నిధ్వంసం చేశారు. అంత‌టితో ఆగ‌క, విగ్ర‌హం ముఖంపై క‌సిగా గాట్లు పెట్టారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు అక్క డకు చేరుకుని అంబేద్కర్‌ విగ్రహాన్ని పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాస్తారోకోకి దిగారు.
విజయంపై విశ్వాసం వ్యక్తం చేయడంలో వైసీపీ కీలక నేతలంతా సైలెంట్ అయిపోయినప్పటికీ కొందరు మాత్రం ఇంకా గంభీరంగా ప్రకటనలు ఇస్తున్నారు. వీరిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్ లు ముందు వరుసలో ఉంటారు. వారి ప్రకటనలను నమ్ముతున్నదెవరు? నవ్వి పోతున్నదెవరు అన్నది పక్కన పెడితే.. వారి ప్రకటనల్లోని డొల్లతనం వారి మాటల్లోనే కనిపించేస్తోంది.
ప్రాణవాయువు ఇచ్చే చెట్టు నిండు ప్రాణం తీసింది. చెట్టు విరిగి మీద పడటంతో రవీంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.