మసకబారుతున్న యువ కిరణాలు
Publish Date:Mar 20, 2012
Advertisement
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీవ్ గాంధీ పేరును అడ్డుపెట్టుకుని మధ్యలో తన పేరును కూడా ఇరికించుకుని అట్టహాసంగా ప్రారంభించిన రాజీవ్ యువకిరణాలు పథకం ఘోరంగా విఫలమయింది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువకులను గుర్తించి వారికి శిక్షణ ఇప్పించి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఈ హామీ పూర్తిగా నెరవేరడం లేదు. కానీ ఈ పథకం పబ్లిసిటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ. 20 కోట్లు ఖర్చు పెట్టింది. నిరుద్యోగులకు ఉపాధి మాత్రం లభించడం లేదు కానీ వీరికి తూతూ మంత్రంగా శిక్షణ ఇస్తున్న కొన్ని సంస్థలు మాత్రం లక్షలాది రూపాయలుఆర్జిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి నెలాఖరునాటికి సుమారు మూడు లక్షలమందికి శిక్షణ ఇప్పించినట్లుగా రికార్డుల్లో పేర్కొంటున్నారు. అయితే ఈ మూడు లక్షల్లో 30 వేల మందికి కూడా ఉపాధి అవకాశాలను కల్పించలేకపోయారు. హడావిడిగా నిరుద్యోగులను గుర్తించి తూతూ మంత్రంగా వారికి శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈ అరకొర శిక్షణతో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు. కొన్ని ప్రైవేట్ సంస్థలు వీరికి ఉద్యోగంలోకి తీసుకున్నప్పటికీ వీరి పనితీరు ఘోరంగా ఉండడంతో వెంటనే ఉద్యోగం నుంచి తీసివేస్తున్నాయి. మరి కొంతమంది శిక్షణా సంస్థలు చూపిస్తున్న ఉద్యోగాలు నచ్చక అక్కడ చేరటం లేదు. పరిగణనలోకి తీసుకుంటే రాజీవ్ యువకిరణాల లక్ష్యంలో 10 శాతం కూడా సాధించలేకపోయినట్లు తెలుస్తుంది. శిక్షణ సంస్థలకు ప్రభుత్వ నిధులను దోచిపెట్టేందుకే రాజీవ్ యువకిరణాలను ప్రవేశపెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/cm-kiran-kumar-reddy-24-12785.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





