కాంగ్రెస్ లో కొనసాగాలా? కొత్తపార్టీ పెట్టుకోవాలా?

Publish Date:Feb 11, 2014

Advertisement

 

ఇక నేడో రేపో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ సమైక్యంగా రాజినామాలు చేసి ప్రజలలోకి రానున్నారు. అయితే ఈమధ్య కాలంలో కొంత మంది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తాము రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నామే తప్ప, పార్టీని కాదని గట్టిగా నొక్కి చెపుతుండటంతో వారందరూ రాజీనామాలు చేసిన తరువాత కూడా పార్టీలోనే కొనసాగుతారా? అనే అనుమానం కలుగుతోంది. కానీ, కధ ఇంతవరకు వచ్చిన తరువాత ఇంకా కాంగ్రెస్ లో కొనసాగడమూ కష్టమే కనుక వేరు కుంపటి పెట్టుకోవడం అనివార్యమనిపిస్తోంది. ఈ రెండు ఆప్షన్స్ లలో సాధ్యాసాధ్యాలను, లాభ నష్టాలను పరిశీలిస్తే ‘కొత్త కుంపటి ఆప్షనే’ సాధ్యంగా, లాభసాటిగా కనిపిస్తోంది.

 

సీమాంధ్ర అంతటా కాంగ్రెస్ వ్యతిరేఖత స్పష్టంగా కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో వారు ఆ పార్టీలోనే కొనసాగడం చాలా రిస్కు తీసుకోవడమే అవుతుంది. ఇంతకాలంగా తమ పార్టీ ప్రజలను మోసగించిందని వారందరూ స్వయంగా ప్రజలకు చాటింపు వేసుకొన్న తరువాత, మళ్ళీ ఇప్పుడు అదే పార్టీలో ఉన్న తమకు ఓటు వేయమని అడగడం కూడా కష్టమే. అందువల్ల కాంగ్రెస్ లో కొనసాగేందుకు చాలా బలమయిన కారణం, చాలా బలమయిన వాదన అవసరం.

 

వారు కాంగ్రెస్ లోనే కొనసాగాలంటే రేపు రాష్ట్ర విభజన బిల్లు లోక్ సభలోనే ఏదో ఒక వంకతో ఆమోదం పొందకుండా ఆగిపోవాలి. అప్పుడు వారందరూ రాష్ట్ర విభజన జరగకుండా బిల్లుని ఆపిన ఘనత తమదేనని చెప్పుకొని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పార్టీ చేత బహిష్కరణలకు గురయ్యి, పదవులను కూడా తృణప్రాయంగా వదులుకొన్నతమకే మళ్ళీ ఓటేసి గెలిపిస్తే, ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి తమ మద్దతుపైనే ప్రధానంగా ఆధారపడే తమ కాంగ్రెస్ అధిష్టానం కొమ్ములు వంచి మరీ లొంగదీసి శాశ్వితంగా రాష్ట్ర విభజనను ఆపేస్తామని హామీ ఇస్తారేమో!

 

ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకోవడం చాలా దురదృష్టకరమని, అందుకు తాము చాలా బాధపద్దామని ఆవేదన వ్యక్తం చేస్తూనే, దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే గొప్ప లౌకికవాద పార్టీ అని అందువల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకే మళ్ళీ ఓటువేసి గెలిపించుకొని ఈ దేశాన్ని మతతత్వ బీజేపీ నుండి, నరేంద్ర మోడీ నుండి కాపాడుకోవాలని కోరవచ్చును.

 

తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే, తప్పకుండా తెలంగాణా ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేస్తున్న బీజేపీతో చేతులు కలుపుతున్న తేదేపాకు ఓటేస్తే, చంద్రబాబు ఎలాగు తెలంగాణా ఏర్పాటుకి అనుకూలమే గనుక, ఆ రెండు పార్టీలు కలిసి మళ్ళీ రాష్ట్ర విభజనకు పూనుకొంటే, ఇంతకాలం తాము చేసిన పోరాటం, త్యాగాలు వృధా అవుతాయని, సీమాంధ్ర ప్రజలందరూ రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా మళ్ళీ ఉద్యమించవలసివస్తుందని చెప్పుకోవచ్చును.

 

అయితే, ఈ స్టోరీతో ప్రజలను నమ్మించడం, వారి ఓట్లను పొందడం చాలా కష్టం. పైగా ఈ ఎన్నికలు తెదేపా, వైకాపాలకు జీవన్మరణ పోరాటం వంటివి గనుక అవి ఎట్టిపరిస్థితుల్లోనూ విజయం సాధించాలని తీవ్రం కృషి చేస్తాయి గనుక, కాంగ్రెస్ పార్టీ గెలవడం కల్ల. అందువల్ల ఇప్పుడు రెండో ఆప్షనుకే మొగ్గు చూపవలసి వస్తుంది.

 

మూడు నెలల క్రిందటే రెండు మూడు పార్టీ పేర్లను ఎన్నికల కమీషన్ వద్ద రిజిస్ట్రేషను కూడా చేయించుకొని, ముఖ్యమంత్రి కొత్తపార్టీ పెట్టబోతున్నారని మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి, దానిపై నిరంతరం చర్చ జరిగేలా చేస్తూ ప్రజలలో దానిపట్ల ఆసక్తిని రేకెత్తించగలిగారు కనుక, దానిని చాలా సులువుగా ప్రజలలోకి తీసుకువెళ్ళవచ్చును. కొత్తపార్టీ పెట్టినట్లయితేనే ప్రజలలో నెలకొనిఉన్న కాంగ్రెస్ వ్యతిరేఖతను తమకనుకూలంగా మలుచుకోవచ్చును. ఇంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానాని(నిర్ణయాని మాత్రమే)కి వ్యతిరేఖంగా చేసిన తమ పోరాటాలకు, చేసిన త్యాగాలను క్లెయిం చేసుకొని ప్రజల నుండి ఓట్లు రాబట్టుకోవడానికి వేరు కుంపటి పెట్టుకోవడమే మేలు.

 

ముఖ్యమంత్రి, ఆయన సహచరులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసమే (పదవీ కాలం ముగిసిపోయినందుకు కాదు సుమా!) తమ తమ పదవులకు రాజీనామాలు చేసి, కాంగ్రెస్ బోనులో నుండి సమైక్య సింహాలుగా బయటపడి, సమైక్యవాదంతో సమైక్యం కోసం సమైక్యపార్టీ పెడితే వారిని ప్రజలు నెత్తిన పెట్టుకొనే అవకాశం ఉంది. అశోక్ బాబు వంటివారు తమ ఉద్యోగులను, తద్వారా ప్రజలను ఇప్పటికే మానసికంగా సిద్దం చేసి కొత్తపార్టీకి అనువైన వాతావరణం సృష్టించే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు కూడా! తాత్కాలికంగా వేరు కుంపటి పెట్టుకొని, పని పూర్తయిన తరువాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే కలిసిపోయే సౌలభ్యం కూడా దీనీలో ఉంటుంది కనుక సీమాంధ్ర నేతలు కాంగ్రెస్ లో కొనసాగి రిస్కు తీసుకోవడం అనవసరం. అందువల్ల వేరు కుంపటి పెట్టుకోవడమే చాలా బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. మరి మన ప్రియతమ నేతలు ఈ రెంటిలో ఏ ఆప్షన్ ఎంచుకొంటారో చూద్దాము.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.