వాణీదేవీతో కేసీఆర్ మైండ్ గేమ్!  పొలిటికల్ డైవర్షన్ పాలసీ.. 

Publish Date:Feb 23, 2021

Advertisement

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి. కేసీఆర్ సంచలన నిర్ణయం. ప్రతిపక్షాలకు ఒకింత షాక్. అంతలోనే తేరుకొని ఎదురుదాడి మొదలుపెట్టాయి విపక్షాలు. పీవీ కూతురును బలిపశువు చేశారంటూ విమర్శిస్తున్నాయి. అయితే.. మాయల మరాఠీ కేసీఆర్ ఏం చేసినా ఓ లెక్క ఉంటుంది. తిక్క నిర్ణయాలు అస్సలు తీసుకోరు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి ఎంపిక వెనకా.. పెద్ద స్కెచ్చే ఉందని అంటున్నారు. గులాబీ బాస్ ఎప్పటి నుంచో అమలు చేస్తున్న డైవర్షన్ పాలసీలో భాగంగానే వాణీదేవి పేరు తెరమీదకు వచ్చిందని చెబుతున్నారు. ఇంతకీ ఏంటా డైవర్షన్ స్కీమ్? ఎందుకు వాణీదేవి నేమ్?

పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు దంపతులు వామనరావు, నాగమణిల మర్డర్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. వామనరావును నడిరోడ్డు మీద అంత దారుణంగా చంపడమేంటని జనాల్లో తీవ్ర ఆగ్రహం. హత్య వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపణ. పోలీసులు సైతం పాలకులకు కొమ్ము కాశారని అనుమానం. విపక్షాలు ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. సహచర న్యాయవాది మర్డర్ తో హైకోర్టు లాయర్లు రగిలిపోయారు. ర్యాలీలతో హోరెత్తించారు. కొన్ని రోజులుగా తెలంగాణ స్టేట్ మొత్తం వామనరావు దంపతుల హత్య గురించే చర్చ. రచ్చ. ఈ కేసులో ప్రభుత్వం ఫుల్ గా బద్నామ్ అయింది. ప్రజా కోర్టులో దోషిగా నిలబడింది. ఇది ఇలానే కొనసాగితే.. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు అటు నాగార్జున సాగర్ బైపోల్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్ లోనూ ఆ ప్రభావం పడుతుందని గులాబీ బాస్ ఆందోళన చెందారని అంటున్నారు. అందుకే, ఈ టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు.. వ్యూహాత్మకంగా పీవీ కూతురు వాణీదేవీ పేరును తెరపైకి తీసుకొచ్చారట. 

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ నరసింహారావు కుమార్తెను బరిలో దింపడంతో ఒక్కసారిగా రాష్ట్రమంతా ఆశ్చర్యపోయింది. అప్పటి వరకూ ఎవరికీ పెద్దగా తెలీని పేరు కావడంతో అంతా ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలైంది. అప్పటి దాకా అధికార పార్టీకి ఎమ్మెల్సీ కేండిడేటే లేకపోవడం.. సడెన్ గా వాణీదేవి పేరును కేసీఆర్ ప్రకటించడంతో అంతా అయోమయం. పొలిటికల్ అటెన్షన్ అంతా అటు వైపు షిఫ్ట్ అయింది. మూడు రోజులుగా వాణీదేవి గురించే డిస్కషన్. వాణీదేవీ ఇష్యూతో వామనరావు ఎపిసోడ్ ప్రధాన్యత తగ్గిపోయింది. కేసీఆర్ కూ కావలసింది ఇదేనంటున్నారు. ఇది ఆయన మైండ్ గేమ్. 

టాపిక్ ను డైవర్ట్ చేయడంలో కేసీఆర్ ఎక్స్ పర్ట్. గతంలోనూ పలుమార్టు కేసీఆర్ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారని అంటున్నారు. దుబ్బాకలో పరాజయం, గ్రేటర్ ఎన్నికల్లో పరాభవం నుంచి ప్రజల ద్రుష్టి మళ్లించేందుకే కేటీఆర్ ను సీఎం చేస్తారనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. కొంత కాలం పాటు ముఖ్యమంత్రి మార్పు చుట్టూనే చర్చ జరిగిందని.. దుబ్బాక, గ్రేటర్ టాపిక్ పక్క దారి పట్టిందని చెబుతున్నారు. ఇక చాలు అనుకున్నాక.. వెంటనే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆవేశంతో ఊగిపోతూ సీఎం కుర్చీ దిగేది లేదంటూ కస్సుమని.. చర్చకు క్షణాల్లో పుల్ స్టాప్ పెట్టారని అంటున్నారు. 

రోజు రోజుకీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటం.. కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుండటం.. బీజేపీ దూకుడు.. రేవంత్ రెడ్డి పాదయాత్ర, రణభేరితో కాక మీదుండడం... ఇలా వరుస పరిణామాలతో కంగారెత్తిన కేసీఆర్ జనాలను కన్ఫూజ్ చేసే పని చేస్తున్నారని అంటున్నారు. హాలియా సభలో ప్రతిపక్షాలను తిట్టిపోయడం ఆయనలోని అసహనానికి నిదర్శణమని చెబుతున్నారు. ప్రజల్లో మళ్లీ కేసీఆర్ పై క్రేజ్ పెంచేలా.. అవసరం లేకున్నా తన 67వ బర్త్ డే సెలబ్రేషన్స్ తో రాష్ట్రమంతా హోరెత్తించారని అంటున్నారు. ఆ తర్వాత జరిగిన వామనరావు దంపతుల మర్డర్ ను డైవర్ట్ చేసేందుకు లేటెస్ట్ గా పీవీ కూతురు వాణీదేవిని ఎమ్మెల్సీ కేండిడేట్ గా సెలెక్ట్ చేసి పొలిటికల్ అటెన్షన్ ను అటువైపు డైవర్ట్ చేశారని విశ్లేషిస్తున్నారు. 

ఇదంతా కేసీఆర్ మైండ్ గేమ్ అని.. తాత్కాలిక ప్రయోజనాల కోసం వాణీదేవిని బలి చేస్తున్నారని అంటున్నారు. అయితే.. ప్రస్తుతానికి ఇలాంటి విషయాలను పక్కనపెట్టినా.. ఎన్నికల సమయం వచ్చే సరికి జనమంతా కేసీఆర్ కు తగిన బుద్ది చెబుతున్నారు. కర్రు కాల్చి వాత పెడుతున్నారు. దుబ్బాక, గ్రేటర్ ఎలక్షన్ ఫలితాలే ఇందుకు సాక్షం. వామనరావు దంపతుల మర్డర్ ను వాణీదేవి ఎపిసోడ్ తో టెంపరరీగా సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేసినా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు రివేంజ్ తీసుకునేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు.

By
en-us Political News

  
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.