ప్రభుత్వానికి కార్మిక సంఘాలకు మధ్య కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదే: అశ్వద్ధామరెడ్డి

Publish Date:Oct 15, 2019

Advertisement

ఆర్టీసీ కార్మికుల సమ్మె పదో రోజుకు చేరుకుంది, జీతాలు లేక అవస్థలు పడుతున్న కార్మికులకు మద్దతుగా రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. దీంతో జిల్లాలో పదో రోజు నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని టీ.ఆర్.ఎస్ నేత కేశవరావు కోరారు. పరిస్థితులు చేయిదాటకముందే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ విలీనం మినహా మిగతా డిమాండ్ లను ప్రభుత్వం పరిశీలించారని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల విలీనం అంటే విధి విధానాలు మార్చుకోవాలని కోరడమేనని కేకే అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని కేశవరావు అన్నారు. కార్మికుల సమ్మె ఉధృతమైన సమయంలో కేకే చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం కావటం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమవడం, తాత్కాలిక సిబ్బంది కారణంగా జరుగుతున్న ప్రమాదాలతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ సమయంలో సమ్మె పరిష్కారంపై కేకే ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి, పంతొమ్మిదిన బంద్ కు పిలుపునిచ్చాయి. అందుకే కేకే రంగంలోకి దిగి ప్రకటన చేశారా, ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధపడుతోందా అనే చర్చ కూడా మొదలైంది.  మరోవైపు ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందనే వార్తలు గుప్పుమనడం కూడా కలకలం రేపాయి.

ఇప్పటికే ఓ టీఆర్ ఎస్ ఎంపీ ఆర్టీసీ కి చెందిన నాలుగెకరాల భూమిని టెండర్ దక్కించుకున్నారంటూ వార్తలు ప్రకంపనలు రేపాయి. మొత్తంగా అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడి తోనే కేకే ప్రకటన చేసి ఉండొచ్చనే విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. పంతొమ్మిదిన బంద్ జరిగే లోపు ఏం జరగబోతోందనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ప్రభుత్వానికి కార్మిక సంఘాలకు మధ్య కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదేనన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి. కేసీఆర్ ఆహ్వానిస్తే చర్చలకు రావటానికి సిద్ధమన్నారు. ఆర్టీసీ కార్మిక నాయకులు గవర్నర్ తమిళ సాయిని కలిశారు. ఆర్టీసీ, జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి తోపాటు పలువురు కార్మిక సంఘాల నేతలు రాజ్ భవన్ కు వెళ్లి ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాలను గవర్నర్ కు వివరించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తామని గతంలో కేసీఆర్ చెప్పారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధి సంఘాలు మద్దతు ప్రకటించాయి, కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర చేశాయి. మంత్రులు పువ్వాడ, గంగుల ఎర్రబెల్లి కి మాట్లాడే నైతిక హక్కు లేదంటూ విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతోంది. మహిళా ఉద్యోగులు, కార్మికుల కుటుంబ సభ్యులు కూడా రోడ్డెక్కారు. హన్మకొండ డిపో నుంచి ఏకశిల పార్కు వరకు నిరసన ర్యాలీ చేశారు.

 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.