Publish Date:Jan 29, 2022
తెలంగాణ ముఖ్యమంత్రి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ స్థానం గజ్వేల్ నుంచి పోటీ చేయరట. నియోజకవర్గ సమీక్షలో పార్టీ నాయకుడు, ప్రజా ప్రతినిధులకు ఈ విషయంలో ఆయనే స్వయంగా సంకేతాలు ఇచ్చారట. అంతే కాకుండా.. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ రోల్ మోడల్ గా తాను తీర్చిదిద్దిన గజ్వేల్ నియోజకవర్గంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డిని బరిలో దింపుతున్నట్లు కూడా హింట్ ఇచ్చారట. అయితే.. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? లేక మరేదైనా కొత్త వ్యూహం పన్నారా? అనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కని ఫజిల్ గా మారింది. ఇదే విషయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే.. రాజకీయ ఎత్తులు వేయడంలో దిట్ట అనిపించుకున్న కేసీఆర్ మరేదో కొత్త వ్యూహం రచించి ఉంటారని, అందులో భాగంగానే తన సిట్టింగ్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయకూడదని నిర్ణయించుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ బీజేపీపైన, మోదీపైన సందర్భం వచ్చినప్పుడల్లా నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీపై ఒక విధంగా ఆయన వార్ ప్రకటించారనే చెప్పాలి. కేసీఆర్ మొన్నా మధ్యన తమిళనాడు వెళ్లి, ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ తో చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశం ఏమిటో బయటపెట్టకుండా గుంభనంగా ఉంచారు. ఆ తర్వాత బీహార్ ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్, ఆ పార్టీలోని మరి కొందరు సీనియర్ నేతలను ప్రగతి భవన్ కు రప్పించుకుని చర్చలు జరిపారు. వారి కోసం కేసీఆర్ ప్రత్యేకంగా బీహార్ కు చార్టర్డ్ ఫ్లైట్ పంపించారని మీడియా అంతా కోడై కూసింది. అంతకు ముందు కేరళ సీఎం, ఇతర సీపీఎం జాతీయ స్థాయి నేతలతో కూడా ప్రగతిభవన్ లో సమాలోచనలు చేశారు.
అదలా ఉంచితే.. కేసీఆర్ కన్ను ఇప్పుడు కేంద్రంపై పడిందని, బీజేపీ ముక్త భారత్ దిశగా ఆయన పావులు కదుపుతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ వంకతో కేంద్రం చక్రం తిప్పడమో లేక, ప్రధాన పదవి పైదవి పైనో కేసీఆర్ కన్నేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు తన కుమారుడు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ అధికార సింహాసనంపై కూర్చోబెట్టాలనే లక్ష్యం ఎన్నాళ్లుగానో కేసీఆర్ లో ఉంది. తాను ఢిల్లీపై గురిపెడితే.. కొడుకు తెలంగాణను ఏలుకోవాలనేది కేసీఆర్ వ్యూహం కావచ్చనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ లో నిర్వహించి సమీక్షలో వంటేరు ప్రతాపరెడ్డిని గెలిపించాలని ఇటీవలే ఎన్నికైన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డికి సూచించారు. అయితే.. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఏమాత్రం లీకవకుండా చతురుడైన చంద్రశేఖరరావు జాగ్రత్త పడ్డారు. ఇదే ఇప్పుడు కేసీఆర్ వ్యూహం ఏమిటనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తోంది. నిజానికి వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి తాను పోటీ చేయడం లేదని కేసీఆర్ చెప్పినప్పుడే స్థానిక నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారని తెలుస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ.. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు వంటేరు ప్రతాపరెడ్డి కేసీఆర్ పైన, గులాబీ పార్టీపైన ఒంటికాలిపై లేచి మరీ విమర్శలు చేసిన వైనాన్ని స్థానిక నేతలు లోపల్లోపలే గుర్తుచేసుకుని మదనపడుతున్నారట. అయితే.. గులాబీ బాస్ కు ఇప్పుడు అత్యంత సన్నిహితుడిగా వంటేరు ప్రతాపరెడ్డి ఉండడంతో కేసీఆర్ ముందు నోరు విప్పితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయంతో వారు అన్నీ మూసుకుని గుంభనంగా ఉంటున్నారట. గజ్వేల్ నియోజకవర్గం నుంచి వంటేరును బరిలో దింపుతున్నట్లు కేసీఆర్ అభిప్రాయం చెప్పడంతోనే స్థానిక టీఆర్ఎస్ లో అప్పుడే లొల్లి మొదలైందంటున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన వంటేరుకు ఛాన్స్ ఎలా ఇస్తారనేది ఉద్యమకారులం అని చెప్పుకునే పార్టీ సీనియర్ల నుంచి తన్నుకు వస్తున్న ప్రశ్న. కేసీఆర్ ఓ ప్రతిపాదన తెచ్చినంత మాత్రాన అన్నీ అయిపోతాయా? వంటేరుకు ఛాన్స్ రాకుండా అడ్డుకునేందుకు ఆయన వ్యతిరేక వర్గం ఇప్పటికే రంగంలోకి దిగిందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-kcr-good-bye-to-gajwel-constituencey-39-130875.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.