పండుగలతో ప్రజల జీవనశైలి ఆరోగ్యకరం : సీఎం చంద్రబాబు
Publish Date:Mar 19, 2026
Advertisement
విజయవాడలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం పండుగ వాతావరణంలో కళకళలాడింది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై సందడి చేశారు.మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం ఉగాది పచ్చడి రుచి చూశారు. జీవితంలో తీపి, చేదు, పులుపు వంటి అనుభవాల సమ్మేళనం అనే సందేశాన్ని గుర్తు చేస్తూ పచ్చడి ప్రాధాన్యతను వివరించారు. అనంతరం పండితుడు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం వినిపించగా సభలోని అందరూ ఆసక్తిగా విన్నారు.తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం… కొత్త సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సంతోషం, సుభిక్షం నెలకొనాలని కోరుకున్నారు. పండుగలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుస్తాయని సీఎం అన్నారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుందని తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి 6,787 మందికి రూ. 55.63 కోట్లు ఫైల్పై సంతాకం చేసి నిధులు విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేశ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా తదితర ప్రముఖులు పాల్గొని వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తెచ్చారు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-naidu-at-ugadi-celebrations-36-215761.html





