Publish Date:Jun 24, 2025
పోలవరం -బసకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజకీయాల కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన అవసరం మంత్రులపై ఉందని చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. మొత్తం 42 అజెండా అంశాలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. అమరావతిలో మలివిడత భూసేకరణపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. తొలివిడత నిబంధనలే మలివిడతకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాలను ఇన్ఛార్జి మంత్రి నేతృత్వంలో జిల్లాస్థాయిలో నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
రాజధానిలో మరో 44వేల ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్ర P4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అన్న క్యాంటీన్ ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్న క్యాంటీన్లు మానిటర్ చేయడానికి, ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకవడానికి ఒక కమిటీని వేయాలని సీఎం సూచించారు. టెన్నిస్ ప్లేయర్ సాకేత్కు గ్రూప్- 1 ఉద్యోగం ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్కు సెప్టెంబర్లో శంకుస్థాపన చేసే విధంగా చూడాలని సీఎంచంద్రబాబు తెలిపారు.
పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో కొన్ని పంటలకు డిమాండ్ లేకపోవడంతో మనం మార్కెట్లోనే ప్రవేశించి కొంటున్నామని స్పష్ట చేశారు. పొగాకుకు మార్కెట్లో ధర తక్కువగా ఉండటంతో రూ. 250 కోట్లు మనం మార్కెట్లో ప్రవేశించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్లో వాణిజ్య పంటలకు డిమాండ్ ఎక్కువ ఉన్న పంటలు వేసే విధంగా రైతులను మోటివేట్ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ రైతుల్లో అవగాహన తీసుకురావాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-chandrababu-25-200575.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.