త‌మ్ముళ్ల త‌ల‌నొప్పి

Publish Date:Aug 18, 2025

Advertisement

 

ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు తమ్ముళ్ల త‌ల‌నొప్పి మొద‌లైందా? స‌త్య‌వేడు ఎమ్మెల్యేతో మొద‌లు.. ప్ర‌స్తుతం ద‌గ్గుబాటి దుర్గాప్ర‌సాద్, కూన ర‌వికుమార్, న‌జీర్ ఇలా టీడీపీ ఎమ్మెల్యేల వ్య‌వ‌హారంతో కొత్త త‌ల‌నొప్పిగా త‌యార‌వుతోందా? మ‌రి వైసీపీ వాగుడుకాయ‌లైన వంశీ, నాని, అనిల్, రోజా వంటి వారికీ- వీరికీ తేడా ఏంట‌న్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోందా? అన్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.ఇప్ప‌టికే  కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎమ్మెల్యేల దందా మొద‌లైంద‌న్న టాక్ ఒకింత వైల్డ్ గానే స్ప్రెడ్ అయ్యింది. అదే పెద్ద విష‌య‌మ‌నుకుంటే మ‌ధ్య‌లో మ‌రో తంటా వ‌చ్చే ప్రమాదం ఉందికూన ర‌వికుమార్ విష‌య‌మే తీస్కుంటే ఆముదాలవ‌లస ఎమ్మెల్యే అయిన ఈయ‌న త‌ల్లికి వంద‌నం విష‌యంలో ముగ్గురు ప్రిన్సిపాల్స్ తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

అయితే పొందూరు కేజీబీవీ స్కూల్లో విద్యార్ధినుల నుంచి అక్ర‌మంగా అద‌న‌పు డ‌బ్బు వ‌సూళ్లు చేస్తున్నార‌ని తాను నిల‌దీయ‌డం వ‌ల్లే వారిలా త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అంటారు ర‌వికుమార్. తాను అమెరికా నుంచి రాగానే వారి బండారం మొత్తం బ‌య‌ట పెడ‌తాన‌ని అంటున్నారాయ‌న‌. అయితే ఎమ్మెల్యే త‌న‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ల రూపంలో వేధిస్తున్నారంటూ.. పొందూరు కేజీబీవీ ప్రిన్సిప‌ల్ ఆరోపిస్తున్నారు.అయితే ఇందులో మ‌రో కోణం కూడా లేక‌పోలేద‌ని అంటారు. వ‌చ్చే రోజుల్లో అచ్చెన్నను మంత్రిత్వం నుంచి త‌ప్పించి కూన‌కు ఆ ప్రాంతం నుంచి ప‌ద‌వి ఇచ్చేలా అధిష్టానం ఆలోచిస్తుంద‌ని అంటారు.. దీంతో అచ్చెన్న వ‌ర్గ‌మే ఇదంతా చేయిస్తుండ‌వ‌చ్చ‌న్న ప్ర‌చారం కూడా ఒకింత జోరుగానే న‌డుస్తోంది.

ఇదిలా ఉంటే రీసెంట్‌గా  గుంటూరు తూర్పు ఎమ్మెల్యే న‌జీర్ విషయం పార్టీకి తలనోప్పిగా మారింది . ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్.. ఓ మహిళతో వీడియో కాల్ లో మాట్లాడుతూ ముద్దులు పెడుతున్న దృశ్యాలు  వైరల్ గా మారాయి. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.  ఈ వీడియో వ్యవహారం తేల్చాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఈ వీడియోలో ఉన్న టీడీపీ మహిళా నేత గుంటుపల్లి వాణి ఈ విష‌యంపై తాను మ‌రో వీడియో రిలీజ్ చేశారు. తన భర్తతో వీడియో కాల్ మాట్లాడిన వీడియోను డీప్ ఫేక్ చేసి ఎమ్మెల్యేను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారామె. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఈ కేసులో అనుమానితురాలిగా భావించి మ‌రో టీడీపీ మ‌హిళా నేత సోఫియాను ప్ర‌శ్నించారు పోలీసులు. ఆమె చెప్పేదాన్నిబ‌ట్టీ చూస్తే.. వాణికి ఎమ్మెల్యేకీ మ‌ధ్య ఎఫైర్ ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని బాంబు పేల్చారామె. ఇందులో ఇంకో న‌మ్మ‌లేని నిజ‌మేంటంటే ఈ వీడియో లీక్ చేసింది మ‌రెవ‌రో కాదు.. వాణి భ‌ర్త న‌వీన్ కృష్ణేన‌ని అంటున్నారామె. ఈ విష‌యం త‌న‌కు స్వ‌యంగా న‌వీన్ కృష్ణే చెప్పిన‌ట్టు పోలీసుల‌తో చెప్పారామె. దీంతో ఎమ్మెల్యే వీడియో లీక్ కేసును ఎలా హ్యాండిల్  చేయాలో అర్ధంకాని గ‌జిబిజి గంద‌ర‌గోళం ఎదుర్కుంటున్నార‌ట గుంటూరు పోలీసులు.

ఇదంతా ఇలా ఉంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌ర్సెస్ ద‌గ్గుబాటి  ప్ర‌సాద్ వ్య‌వ‌హ‌రం మ‌రో త‌ల‌నొప్పి త‌క‌రారు కింద త‌యారైన‌ట్టు తెలుస్తోంది. అనంత‌పూర్ అర్బ‌న్ ఎమ్మెల్యే అయిన ద‌గ్గుబాటి ప్ర‌సాద్.. జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన వార్ టూ సినిమా  అనుమ‌తుల‌తోనే ఆడిస్తున్నారా? అని తెలుగు యువ‌త నేత ధ‌నుంజ‌య నాయుడితో చేసిన సంభాషణ ద్వారా ఇది వెలుగులోకి వ‌చ్చింది. తాను అనంత‌పూర్ ఎమ్మెల్యే కాబ‌ట్టి.. సినిమా ఆడ‌దంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

అయితే ఈ ఆడియో లీక్‌లో వాయిస్ త‌న‌ది కాద‌ని కంప్ల‌యింట్ చేశారు ద‌గ్గుబాటి. తాను తొలి నుంచి నంద‌మూరి, నారా కుటుంబాల అభిమానిన‌ని.. అలాగ‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ అంటే త‌న‌కెలాంటి ద్వేషం లేద‌ని అన్నారాయ‌న‌. ఒక వేళ త‌న మాట‌ల‌కు జూనియర్ ఫ్యాన్స్ నొచ్చుకుని ఉంటే సారీ చెబుతున్నాన‌ని కూడా అన్నారు. ఈ ఆడియో లీక్ లోని వాయిస్ త‌న‌ది కాద‌ని ఆయ‌న పోలీస్ కంప్ల‌యింట్ కూడా చేశారు. 

ఇప్పుడీ వ్య‌వ‌హారం చినికి చినికి గాలి వాన‌గా మారింది. జూనియ‌ర్  ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటి ముందు చేరి నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. కూట‌మి నేత‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు కూడా చేస్తున్నారు. దీనంత‌టికీ కార‌ణ‌మైన ఎమ్మెల్యే విష‌యం బాబు వ‌ర‌కూ చేరింది. వ‌రుస పెట్టున త‌మ పార్టీ ఎమ్మెల్యేలు ఈ విధంగా బుక్ అవ‌డం. అది వైసీపీకి ఆయుధంగా మార‌డంపై చంద్ర‌బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నివేదిక ఇవ్వాలసిందిగా పార్టీ నేతలను ఆదేశించారు.

ఇప్ప‌టికే కొలికిపూడి రూపంలో ఒక కొత్త త‌ల‌నొప్పి త‌యార‌వుతుండ‌టం గుర్తించి ఎలాగోలా క‌ట్ట‌డి చేశారు. ఆపై క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీని వేసి ఇలాంటి వారంద‌రిపైనా చ‌ర్య‌లు తీసుకునేలా ఒక ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు. ఇక‌పై ఇలాంటి వ్య‌వ‌హారాలు బ‌య‌ట ప‌డితే.. వారికి పార్టీలో గానీ ప‌ద‌వులు ఇవ్వ‌డంలోగానీ ప్రాధాన్య‌త ఇవ్వ‌బోమ‌న్న సంకేతాల‌ను పంపేలా తెలుస్తోంది.
 

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.