విశాఖలో యోగా డే రికార్డు సృష్టిద్దాం : సీఎం చంద్రబాబు

Publish Date:May 16, 2025

Advertisement

 

విశాఖలో జూన్ 21న యోగా డే రికార్డు సృష్టించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు  అధికారులకు దిశానిర్దేశం చేశారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలని ముఖ్యమంత్రి తెలిపారు. యోగాంధ్ర-2025 థీమ్‌తో ప్రచారం చేపట్టలని దీనిపై ప్రజలకు సన్నద్దం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. జూన్‌ 21న విశాఖలో ప్రధాని మోదీ పాల్గొనే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 

నెల రోజుల పాటు యోగా ప్రాక్టీస్‌ చేసిన వారికి సర్టిఫికెట్‌ ఇవ్వాలన్నారు. విశాఖలో లక్షల మందితో కలిసి ప్రధాని మోదీ యోగాసనాలు వేస్తారని, ఆర్‌కే బీచ్‌ నుంచి సముద్రతీరం పొడవునా లక్షల మందితో యోగా డే నిర్వహించనున్నట్టు వెల్లడించారు. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలన్నారు. 

యోగా అనేది ప్రాథమిక బాధ్యత అనేలా ప్రతిఒక్కరూ భావించాలని.. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలన్నారు.. రాష్ట్రంలో ప్రతి చోటా యోగాపై నెలరోజుల పాటు విస్తృత చర్చ జరగాలి. మనం నిర్వహించే యోగా డే విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థల సహకారాన్ని తీసుకోవాలన్నారు.. ఏపీలో జరిగే యోగా డే గత 10 ఏళ్ల కార్యక్రమాలను తిరగరాసేలా ఉండాలి” అని సిఎం చంద్రబాబు సూచించారు..

By
en-us Political News

  
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్, కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులులో పేర్కొంది. ఫార్ములా- ఈరేసు కేసులో విచారణకు హాజరుకావాలని తెలిపింది.
గత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే ఇప్పుడు రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్ముల నాగేశ్వరరావుకు కాళేశ్వరం బురద అంటించాలని చూస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి .
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ శుక్రవారం పరామర్శించారు. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
అరెస్ట్ భయంతో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం కూలిన ఎయిర్‌ ఇండియా విమానం శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్‌ డీవీఆర్‌ లభించింది. ప్రమాద స్థలానికి చేరుకున్న గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ ఏటీఎస్‌ అధికారులు దీనిని స్వాధీనం చేసుకున్నారు.
తొలి నుంచి క‌మల్ హాస‌న్ ది ద్ర‌విడ నాస్తిక వాదం. అది బై బ్ల‌డ్ అలా వ‌చ్చిందా అన్నది తెలీదు కానీ ఆయ‌న ద‌క్షిణాదిలోనే ఏఎన్నార్ త‌ర్వాత నాస్తిక‌వాదంలో అగ్ర‌గ‌ణ్యుడు.
పాక్ అమెరికా లు  సంప్ర‌దాయ మిత్ర దేశాలు. అయితే  911 దాడుల త‌ర్వాత  పాక్ కి దూరం జ‌రుగుతూ వ‌చ్చింది అమెరికా.  అప్ప‌ట్లో జార్జి బుష్ కి లాడెన్ కుటుంబానికి వ్యాపార సంబంధాలుండేవి. నేడ‌దే సీన్ రిపీట్ అవుతూ వ‌స్తోంది. మీకు తెలుసో తెలీదో గానీ మునీర్ కి ట్రంప్ కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయ్.  ట్రంప్ పిల్ల‌ల‌కు చెందిన వ‌ర‌ల్డ్ లిబ‌ర్టీ ఫైనాన్షియ‌ల్ అనే బిట్ కాయిన్ సంస్థ తో మునీర్ నాయ‌క‌త్వంలో పాకిస్తాన్ ఒప్పంద ప‌త్రాల మీద సంత‌కాలు చేసింది.
ఫార్ములా-ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం జూన్ 16న 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.
సరదాగా.. కొంచే కామెడీ..గా అయితే.. బాలయ్య బాబులా... సరే.. సర్లే ఎన్నో అనుకుంటాము అన్నీ జరుగుతాయా ఏంటి?’ అనుకోవచ్చు. కాదూ.. కూసింత సీరియస్’గా చెప్పుకుందామంటే, రజనీకాంత్ చెప్పిన అతిగా ఆశ పడే ఆడది.. ఆతిగా ఆవేశ పడే మగాడు సుఖ పడినట్లు చరిత్రలో లేదు అన్న డైలాగు గుర్తు చేసుకోవచ్చు. అవును.. మన ఇప్పుడు మాట్లాడు కుంటున్నది బీఆర్ఎస్ లో తిరుగు బావుటా ఎగరేసిన ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గురించే. నిజానికి.. కవిత మనసులో ఏముందో అప్పుడే కాదు.. ఇప్పటికీ అంటూ ఈరోజుకు కూడా ఎవరికీ తెలియదు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. హైదరాబాద్‌ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్‌ తెలుసుకున్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ కుమార్ కీలక ప్రకటన సమాచారం వెల్లడించారు.
మొన్నామ‌ధ్య కేసీఆర్ మాగంటి నివాసానికి వ‌చ్చి ఆయ‌న బంధువుల‌ను ప‌ర‌మార్శించిన విష‌యం గుర్తుందా?  అప్పుడు కేసీఆర్ ఎంత ప్ర‌శాంతంగా ఉన్నారో.. ఇప్పుడు కాళేశ్వ‌రం క‌మిష‌న్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన‌పుడు కూడా సేమ్ అలాగే ఉన్నారు. మీడియా క‌ళ్ల‌న్నీ కేసీఆర్ పైనే. కానీ కేసీఆర్ మాత్రం ఏ మీడియానూ చూడ‌లేదు. ఎవ‌రికీ ఎలాంటి బైట్ ఇవ్వ‌లేదు.
సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావుకి ఊరట లభించింది. రాజధాని మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో  సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిలు కోరుతూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంను ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.