తల్లికి వందనంపై వైసీపీ తప్పుడు ప్రచారంపై న్యాయపోరాటం : లోకేష్

Publish Date:Jun 13, 2025

Advertisement

 

తల్లికి వందనంపై తప్పుడు ప్రచారం చేస్తే వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవు అని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. తల్లికి వందనంలో రూ. 13 వేలు ఇచ్చి రూ. 2 వేలు నా ఖాతాలో పడ్డాయన్న ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు రుజువు చేయాలి, లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలి. అలా చేయకుంటే వారిపై చట్ట ప్రకారం ముందుకెళ్తా లోకేష్ హెచ్చరించారు. వైసీపీ ఆరోపణలని  గతంలో మాదిరి భరించేది లేదు. నిరాధార ఆరోపణలు చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు'. అని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. అటు, ఉపాధ్యాయుల బదిలీలు జూన్ 16 కల్లా పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్' దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువుతాం. ప్రజలందరూ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి. 

తల్లికి వందనం అర్హులు ఎంత మంది ఉంటే అంత మందికీ లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే అమ్మ ఒడి ఇచ్చింది. కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్ధులకు పథకాన్ని వర్తింప చేస్తున్నాం. అర్హులు ఇంకా ఉన్నా ఇస్తాం'. అని లోకేష్ తెలిపారు. ఏపీలో కూటమి సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తల్లికి వందనం' పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, సూపర్ సిక్స్‌లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పిల్లల తల్లులు తమ ఆనందాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో సంవత్సర కాలంలోనే చేసి చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
నిజానికి చంద్ర‌బాబుది బాహుబ‌లి ఐడియా. ఆయ‌న రాయి రాయి కొట్టుకుంటూ పోరు. ఒక్క దెబ్బ‌తో కొడితే కొండ ఎలా పిండి అవుతుందో చేసి చూస్తారు.
ఫోన్ దొంగిలించిందనే ఆరోపణలతో బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు. బాలిక పరిస్థితి చూసి చలించిపోయిన ఎమ్మెల్యే.. బాలిక బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు.
తాను ఎప్పుడు రాష్ట్రం బాగు కోసమే ఆలోచిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో ఆయన మాట్లాడారు.
సింగయ్య మృతికి ముమ్మాటికి వైసీపీ అధినేత జగన్ నిర్లక్ష్యమే కారణమని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. జగన్మోహన్ రెడ్డికి మానవత్వమే లేదు.ఉంటే సింగయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శ చేయలేదని షర్మిల ప్రశ్నించారు.
గత పాలకులు విధ్వంసం సృష్టించారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేశ్ విమర్శించారు.
వైసీపీ అధినేత జగన్ పరామర్శ పేరుతో వెళ్లి రోడ్‌షోలు నిర్వహించారని హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతు వైసీపీ నేతలు దారుణంగా దిగజారిపోయారని విమర్శించారు.
తెలంగాణలో వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది.
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు సోమవారం (జూన్ 23) వెలువడ్డాయి.
ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన ఫోన్ అక్రమ ట్యాపింగ్‌ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, చివరకు ఏ కంచికి చేరుతుందో.. ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఏమో కానీ.. ఇంతవరకు అందుతున్న సమాచారం ప్రకారం ముందు ముందు పెద్ద తలకాయలకు చిక్కులు తప్పవని అంటున్నారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖలో సందడి మొదలైంది. కారణాలు ఏవైనా చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న కమలదళం నాయకుల్లో కదలిక వచ్చింది. అయితే.. కదలికతో పాటు కయ్యాలకు తెర లేచింది.
వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఏపీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.