జ‌గ‌న్ అడ్డంగా దొరికాడు.. వ‌దిలేది లేదు

Publish Date:Jul 19, 2025

Advertisement

 

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంపై ఆయ‌న స్పందించారు. పార్టీ ఎంపీల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో చంద్ర‌బాబు వైసీపీ మ‌ద్యం కుంభ‌కోణం.. ఈ కేసును విచారి స్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ప‌నితీరు, వారు చేస్తున్న అరెస్టులు వంటివాటిని ప్ర‌స్తావించారు. ఈ కేసు దాదాపు కొలిక్కి వ‌చ్చింద‌ని చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు కూడా వెన‌క్కి త‌గ్గిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు వెన‌క్కి త‌గ్గాయంటే.. కేసు తీవ్రత ఎలా ఉందో అర్ధ‌మ‌వుతుంద‌న్నారు.

ఈ క్ర‌మంలో అస‌లు దొంగ‌లు దొరుకుతున్నార‌ని, ముఖ్యంగా గ‌త పాల‌కుడు జ‌గ‌న్‌ కూడా దొరికిపోయాడ‌ని చంద్ర‌బాబు చెప్పారు. దీనిని వ‌దిలి పెట్టేది లేద‌న్న ఆయ‌న‌.. త్వ‌ర‌లోనే దీనిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల‌ని సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు తాను మాట్లాడ‌క‌పోవ‌డానికి కార‌ణం.. సిట్ విచార‌ణ జ‌రుగుతుండ‌డ‌మేన‌ని, తాను ఏం చెప్పినా.. ఆ ప్ర‌భావం విచార‌ణ‌పై ప‌డుతుంద‌న్న ఉద్దేశంతోనే మాట్లాడ‌లేద‌న్నారు. ఇప్పుడు అంతా బ‌య‌ట‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో ఇక వెనుక‌డుగు వేయాల్సిన అవ‌స‌రం లేద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

జ‌గ‌న్ తాను.. త‌ప్పులు చేసి.. వాటిని టీడీపీ నేత‌ల‌ పైనా.. త‌న‌పైనా వేస్తున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి విష‌యంలో నాయ‌కులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సంకేతాలు ఇస్తూ.. విష ప్ర‌చారం చేస్తున్న జ‌గ‌న్‌ను, ఆయ‌న ప‌రివారాన్ని ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రించాల‌న్నారు.ఈ విష‌యంలో ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గాల్సిన అవ‌స‌రం లేద‌ని పార్టీ ఎంపీల‌కు చంద్ర‌బాబు సూచించారు. అవ‌స‌ర‌మైతే.. పార్ల‌మెంటు స‌మావేశాల్లో వైసీపీ మ‌ద్యం కుంభ‌కోణం విష‌యాన్ని కూడా లేవ‌నెత్తి.. చ‌ర్చ‌కు పెట్టాల‌న్నారు. సిట్ కూడా.. త్వ‌ర‌లోనే నివేదిక ఇస్తుంద‌న్న చంద్ర‌బాబు.. జ‌గ‌న్ చేస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారానికి ఎప్ప‌టిక‌ప్పుడు.. కౌంట‌ర్ ఇచ్చేలా నాయ‌కులు వ్య‌వ‌హ‌రించాల‌ని దిశానిర్దేశం చేశారు

By
en-us Political News

  
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సాగుతోంది. మంగళవారం (ఆగస్టు 12) ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను ఏరపాటు చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు మంగళవారం హౌస్ అరెస్ట్ చేశారు. రామచందర్ రావు హౌస్ అరెస్టును బీజేపీ నేతలు ఖండించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం కోసం వైసీపీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు దాదాపు వంద కోట్లు ఖర్చు చేసిందని తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అదుపులోనికి తీసుకుని కడపకు తరలించారు.
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల మార్పుపై జోక్యం చేసుకోవాలంటూ వైసీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే.. ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల మార్పు విషయంలో జోక్యం చేసుకోబోమంటూ స్పష్టం చేసి వైసీపీకి షాక్ ఇచ్చింది.
తెలుగు సినీ పరిశ్రమ తీరు అడ్డగోలుగా ఉంది. పన్నులన్నీ తెలంగాణ ప్రభుత్వానికి కడతాం.. మా సమస్యలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించాలంటూ దబాయిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
పులివెందుల తీర్పు పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కావడానికి ఇక కొన్ని గంటలే ఉంది. ఈ నేపథ్యంలో పులివెందులలో పోలింగ్ హీట్ పీక్స్ కు చేరింది. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఓ వృద్దురాలు తన వంతుగా విరాళం అందజేశారు.
గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్‌, ఫిలిం ఫెడరేషన్‌ మధ్య వేతనాల సమస్య రోజురోజుకీ జటిలం అవుతోంది. పీట ముడులు పడుతోంది. దీనికి పరిష్కారం కోసం పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది.
ఆలస్యం అమృతం విషం అన్న నానుడి అతికినట్లు సరిపోయే సందర్భం ఏదైనా ఉందంటే అది ఇదే. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్దీ కేంద్రం నుంచి పంచాయతీలకు రావసిన కేంద్ర నిధులు ఆగిపోతాయి. మురిగిపోతాయి.
సింధూన‌ది పై ప్రాజెక్టు క‌డితే అణుబాంబులేస్తానంటోంది పాక్. మొన్న‌టికి మొన్న ఇదే అణు బాంబుల విష‌యంలో భారీ ఎత్తున భ‌య‌ప‌డ‌బ‌ట్టే క‌దా? కాళ్లు పట్టుకుని మ‌రీ ఇండియాతో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి వ‌చ్చింది?
తాజాగా రాహుల్ గాంధీ మీడియా ముందుకు వచ్చి ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈసీ తప్పులకుప్పగా మారిందంటూ ఏకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తాను చేసే ఆరోపణలన్నిటికీ ఆధారాలున్నాయనీ, తాను, తన ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంతో శ్రమించి శోధించి ఈ వివరాలను సేకరించామని చెప్పుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.