Publish Date:Jul 19, 2025
ఏపీ సీఎం చంద్రబాబు.. వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఆయన స్పందించారు. పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు వైసీపీ మద్యం కుంభకోణం.. ఈ కేసును విచారి స్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరు, వారు చేస్తున్న అరెస్టులు వంటివాటిని ప్రస్తావించారు. ఈ కేసు దాదాపు కొలిక్కి వచ్చిందని చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు కూడా వెనక్కి తగ్గిన విషయాన్ని ప్రస్తావించారు. బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు వెనక్కి తగ్గాయంటే.. కేసు తీవ్రత ఎలా ఉందో అర్ధమవుతుందన్నారు.
ఈ క్రమంలో అసలు దొంగలు దొరుకుతున్నారని, ముఖ్యంగా గత పాలకుడు జగన్ కూడా దొరికిపోయాడని చంద్రబాబు చెప్పారు. దీనిని వదిలి పెట్టేది లేదన్న ఆయన.. త్వరలోనే దీనిని ప్రజలకు వివరించేందుకు నాయకులు ప్రజల మధ్యకు వెళ్లాలని సూచించారు. ఇప్పటి వరకు తాను మాట్లాడకపోవడానికి కారణం.. సిట్ విచారణ జరుగుతుండడమేనని, తాను ఏం చెప్పినా.. ఆ ప్రభావం విచారణపై పడుతుందన్న ఉద్దేశంతోనే మాట్లాడలేదన్నారు. ఇప్పుడు అంతా బయటకు వచ్చిన నేపథ్యంలో ఇక వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
జగన్ తాను.. తప్పులు చేసి.. వాటిని టీడీపీ నేతల పైనా.. తనపైనా వేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయంలో నాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ.. విష ప్రచారం చేస్తున్న జగన్ను, ఆయన పరివారాన్ని ఎక్కడికక్కడ నిలువరించాలన్నారు.ఈ విషయంలో ఎవరూ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అవసరమైతే.. పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ మద్యం కుంభకోణం విషయాన్ని కూడా లేవనెత్తి.. చర్చకు పెట్టాలన్నారు. సిట్ కూడా.. త్వరలోనే నివేదిక ఇస్తుందన్న చంద్రబాబు.. జగన్ చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి ఎప్పటికప్పుడు.. కౌంటర్ ఇచ్చేలా నాయకులు వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-chandrababu-25-202279.html
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకే రోజున గంటల వ్యవధిలో భేటీ కావడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి వరుస భేటీల వెనక కారణాలు తెలియనప్పటికీ గంటల వ్యవధిలోనే ఇరువురు కీలక నేతలు రాష్ట్రపతితో సమావేశం కావడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
బీహార్ లో 65 లక్షల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదంలో ఉంటే.. తమిళనాడులో ఆరున్నర లక్షల ఓట్లు కొత్తగా వచ్చి చేరాయట. ఈ ఓట్లు ఎక్కడివాని చూస్తే ఇవి వలస వచ్చిన వారివిగా తెలుస్తోంది. ఇదెలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ, మాజీ మంత్రి చిదంబరం. ఎందుకంటే వలస వచ్చిన వాళ్లకు ఇక్కడేం జరుగుతుందో తెలీదు. ఇక్కడి రాజకీయాలు అసలే పట్టవు.
ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం టేకాఫ్ కు దాదాపు మూడు గంటలు ఆలస్యం అయ్యింది. సరిగ్గా టేకాఫ్ కు ముందు ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.
జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో, గిరిజన సమస్యల పోరాటంలో, మడమ తిప్పని పోరాట యోధుడిగా.. శిబుసోరెన్ కి పేరుంది. ఇప్పటి వరకూ ఆయన 8 సార్లు లోక్ సభ కు, రెండు సార్లు రాజ్య సభకు ఎన్నికైన శిబుసొరేన్ , జార్ఖండ్ సీఎంగా ఎనలేని సేవలందించారు.
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు సైకిల్ పై ప్రయాణించారు. జిల్లా కేంద్రమైన మెదక్ నుంచి అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని రామాయంపేట వరకూ సైకిళ్లపై ప్రయాణించి వచ్చారు.
భారత్, రష్యాలను టార్గెట్ చేస్తూ అమెరికా బెదిరింపు అస్త్రాలు సంధిస్తూనే ఉంది. రష్యాను ఏకాకిని చేయాలనో? లేక భారత్ను తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనో? కారణం ఏదైతేనేం అమెరికా అధికార ప్రతినిధులు ఒకరి తర్వాత మరొకరు భారత్ కు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.
మొత్తం 15 మంది ఋత్వికులు కేసీఆర్ దంపతులు కర్తలుగా యాగాన్ని నిర్వహించనున్నారు.
పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని, సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టమైన గడవు విధించిన నేపధ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అత్మరక్షణలో పడిందా? అందుకే ఏదో విధంగా ఈ గండం నుంచి కట్టేక్కేందుకు వ్యూహాలు రచిస్తోందా? మళ్ళీ మరోమారు ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టిని కేంద్రీకరించిందా?
ఆంధ్రప్రదేశ్ లో కుంకీ ఏనుగులు పని మొదలు పెట్టేశాయి. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పంటపొలాలు, గ్రామాలపై ఏనుగుల గుంపు పడి విధ్వంసం సృష్టిస్తుండటం, కొన్ని సార్లు ప్రాణనష్టం కూడా కలిగిస్తున్న నేపథ్యంలో ఏనుగుల బెడద నుంచి గ్రామాలను, పొలాలను కాపాడే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించారు.
జార్ఖండ్ మాజా ముఖ్యమంత్రి శిబూ సొరేన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ( ఆగస్టు 4) ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన జూన్ నెలలో ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదరింపు కాల్ వచ్చింది.ఆదివారం (ఆగస్టు 3) గుర్తు తెలియని అగంతకుడి నుంచి గడ్కరీ నివాసంలో బాబు పెట్టినట్లు ఫోన్ చేశాడు. ఈ ఫోన్ కాల్ తో పోలీసులు ఒక్కసారిగా ఉలక్కిపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ గడ్కరీ నివాసంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చారు.
పూజకు దైవభక్తి మెండు. నిత్యం పూజలూ, పునస్కారాలతోనే గడుపుతుంటుంది. ఆమె భక్తి మూఢ భక్తి లిమిట్ కూడా దాటిపోయింది.
నాన్నా విదేశాలకు వెళ్లిపోదాం పదండి.. ఇదీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో చేస్తున్న కొత్త ప్రతిపాదనగా పార్టీ వర్గాలు, పరిశీలకులు అంటున్నారు.