జ‌గ‌న్ అడ్డంగా దొరికాడు.. వ‌దిలేది లేదు

Publish Date:Jul 19, 2025

Advertisement

 

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంపై ఆయ‌న స్పందించారు. పార్టీ ఎంపీల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో చంద్ర‌బాబు వైసీపీ మ‌ద్యం కుంభ‌కోణం.. ఈ కేసును విచారి స్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ప‌నితీరు, వారు చేస్తున్న అరెస్టులు వంటివాటిని ప్ర‌స్తావించారు. ఈ కేసు దాదాపు కొలిక్కి వ‌చ్చింద‌ని చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు కూడా వెన‌క్కి త‌గ్గిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు వెన‌క్కి త‌గ్గాయంటే.. కేసు తీవ్రత ఎలా ఉందో అర్ధ‌మ‌వుతుంద‌న్నారు.

ఈ క్ర‌మంలో అస‌లు దొంగ‌లు దొరుకుతున్నార‌ని, ముఖ్యంగా గ‌త పాల‌కుడు జ‌గ‌న్‌ కూడా దొరికిపోయాడ‌ని చంద్ర‌బాబు చెప్పారు. దీనిని వ‌దిలి పెట్టేది లేద‌న్న ఆయ‌న‌.. త్వ‌ర‌లోనే దీనిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల‌ని సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు తాను మాట్లాడ‌క‌పోవ‌డానికి కార‌ణం.. సిట్ విచార‌ణ జ‌రుగుతుండ‌డ‌మేన‌ని, తాను ఏం చెప్పినా.. ఆ ప్ర‌భావం విచార‌ణ‌పై ప‌డుతుంద‌న్న ఉద్దేశంతోనే మాట్లాడ‌లేద‌న్నారు. ఇప్పుడు అంతా బ‌య‌ట‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో ఇక వెనుక‌డుగు వేయాల్సిన అవ‌స‌రం లేద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

జ‌గ‌న్ తాను.. త‌ప్పులు చేసి.. వాటిని టీడీపీ నేత‌ల‌ పైనా.. త‌న‌పైనా వేస్తున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి విష‌యంలో నాయ‌కులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సంకేతాలు ఇస్తూ.. విష ప్ర‌చారం చేస్తున్న జ‌గ‌న్‌ను, ఆయ‌న ప‌రివారాన్ని ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రించాల‌న్నారు.ఈ విష‌యంలో ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గాల్సిన అవ‌స‌రం లేద‌ని పార్టీ ఎంపీల‌కు చంద్ర‌బాబు సూచించారు. అవ‌స‌ర‌మైతే.. పార్ల‌మెంటు స‌మావేశాల్లో వైసీపీ మ‌ద్యం కుంభ‌కోణం విష‌యాన్ని కూడా లేవ‌నెత్తి.. చ‌ర్చ‌కు పెట్టాల‌న్నారు. సిట్ కూడా.. త్వ‌ర‌లోనే నివేదిక ఇస్తుంద‌న్న చంద్ర‌బాబు.. జ‌గ‌న్ చేస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారానికి ఎప్ప‌టిక‌ప్పుడు.. కౌంట‌ర్ ఇచ్చేలా నాయ‌కులు వ్య‌వ‌హ‌రించాల‌ని దిశానిర్దేశం చేశారు

By
en-us Political News

  
కాళేశ్వరం కమిషన్‌ నివేదికను త్వరలోనే శాసన సభలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ సమర్పించిన నివేదికకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
ఏపీలో సెప్టెంబర్‌ 1 నుంచి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా ఈ కొత్త బార్‌ పాలసీ అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు.
హైదరాబాదులో మరొకసారి భారీ వర్షం కుమ్మేసింది.. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డు మీద వరద నీరు ఏరులై పారాయి.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది.
తెలంగాణ అంతర్జాతీయ స్పోర్ట్స్ చైర్మన్లు గా సంజీవ్ గోయంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయంకా, యువర్ లైఫ్ సిఇఓ ఉపాసన కొణిదెల నియమితులయ్యారు.
ఏపీలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చాని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం కమీషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కమీషన్ రిపోర్ట్ ఊహించిందే. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని గులాబీ బాస్ అన్నారు.
సిరాజ్ మ్యాజిక్.. విజయానికి ఏడు పరగుల దూరంలో ఇంగ్లాండ్ ఆలౌట్ ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన ఇంటి అద్దె భత్యం ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.
అనకాపల్లి జిల్లాలో పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకవ్వడంతో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
భారతీయ రాష్ట్ర సమితి నుంచి ఆ పార్టీ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉద్వాసన తప్పదా? పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. కవితను పార్టీ నుంచి బహిష్కరించే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని గట్టిగా చెబుతున్నారు.
తొమ్మిదో తేదీ రాఖీ పండ‌గ వ‌స్తోంది. అన్నా చెల్లెళ్ల బంధం మ‌రంత పెరుగుతుందేమో అని చూస్తే.. కేటీఆర్ టార్గెట్ గా క‌విత మరిన్ని అస్త్రాలు సంధించ‌డంతో గులాబీ ద‌ళాలు మ‌రింత‌ నీర‌స‌ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డిలాంటి వారి చేత త‌న‌ను తిట్టించ‌డం వెన‌క పెద్ద నాయ‌కుడు ఉన్నాడంటూ ఆమె చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయ్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.