Publish Date:Mar 25, 2025
రోళ్లు పగిలే ఎండలు మార్చిలోనే జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణంగా మే 2, 3 వారాలలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదౌతాయి. అటువంటిది ఈ ఏడాది మార్చి నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాలలో అప్పుడే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదౌ తున్నాయి. ఈ నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా తీసుకోవలసిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమవారం (మార్చి 24) నాడు సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు.
వేసవి ప్రణాళిక విషయంలో చాలా పకడ్డందీగా వ్యవహరించాలన్నారు. అలాగే ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మొబైల్ అలర్ట్ ల ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు. అలాగే అవసరమైన అన్ని ప్రాంతాలలోనూ చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వపరంగా సహకారం అందించాలన్నారు.
ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాలలో తాగునీటి, పశుగ్రాసం కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశువుల కోసం రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థులకు ‘వాటర్ బెల్’ విధానం అమలు చేయాలన్నారు. మునిసిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి రూ.39 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఉపాధి పథకం కింద నీటి కుంటల నిర్మాణం, చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-cbn-review-on-summer-plan-39-194951.html
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.