ఈ ‘దూకుడు’ లాభించేనా?

Publish Date:Mar 27, 2013

Advertisement

 

గత కొంత కాలంగా ప్రతిపక్షాలతో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మొదట్లో పార్టీ వర్గాలు, మీడియా కూడా మెచ్చుకొన్నపటికీ అది చూసి మరి కొంచెం అతిగా వ్యవహరిస్తున్న ఆయన ధోరణిని ఇప్పుడు అదే పార్టీవర్గాలు, మీడియా కూడా తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టాయి.

 

ముఖ్యమంత్రిలో గణనీయమయిన ఈ మార్పు సహకార ఎన్నికల తరువాత నుండే మొదలయిందని చెప్పవచ్చును. సహకార ఎన్నికలలో పార్టీలో ఎవరూ సహకరించకపోయినప్పటికీ, ఆయన ఒంటి చేత్తో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడమే అందుకు కారణం అని చెప్పవచ్చును. ఆ తరువాత ప్రతిపక్షాలు తన ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా అవలీలగా వీగిపోవడంతో ఆయన ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. కానీ, అవిశ్వాసానికి తెదేపా దూరంగా ఉనందునే తన ప్రభుత్వం నిలబడి ఉందని ఆయనకు తెలిసినప్పటికీ, తెదేపా తనపై అవిశ్వాసానికి మద్దతు ఈయలేని నిస్సహాయ స్థితిలో ఉందని ఆయన భ్రమించడమే ఆయనకు కొండంత దైర్యం ఇచ్చి ఆయన దూకుడు కొనసాగించేలా చేస్తోంది.

 

ఇప్పుడు ఆయన ప్రవర్తన చూస్తుంటే, కిరణ్ కుమార్ అసలు నైజం ఇదే అయినప్పటికీ, ఇంత కాలం పార్టీలో, ప్రభుత్వంలో పరిస్థితులు తనకు వ్యతిరేఖంగా ఉనందునే సాత్విక ముసుగు వేసుకోవలసి వచ్చిందేమోననిపిస్తుంది.

 

కొద్ది నెలల క్రితం ఇదే ముఖ్యమంత్రి రవీంద్రభారతిలో విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘ఎన్ని రోజులు పదవిలో ఉంటానో’ అంటూ వైరాగ్యం ప్రదర్శించారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చే ఎన్నికల తరువాత కూడా తానే ముఖ్యమంత్రిగా కొనసాగబోతునట్లు దృడంగా విశ్వసిస్తున్నట్లు కనబడుతున్నారు.

 

అయితే, క్రమంగా ఆయన దూకుడు అహంకారంగా మారుతుండటంతో ఇప్పుడు అన్ని వర్గాల నుండి విమర్శలు మూట కట్టుకొంటున్నారు. కొద్ది రోజుల క్రితం తెరాస నేత హరీష్ రావుకి దీటుగా సమాధానం చెబుతూ ‘తెలంగాణకు ఒక్క నయాపైసా కూడా విదిలించాను ఏమి చేసుకొంటారో చేసుకోండి’ అని ఆయన అనడం తెరాస నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

 

ఆ తరువాత మొన్న శాసన సభలో ‘కాగ్ నివేదిక అంటే అదేమి బైబిలో భగవద్గీతో కాదు అందులో చెప్పినవన్నీ నిజాలని నమ్మడానికి’ అంటూ కాగ్ నివేదికలను సైతం ఆయన తప్పుపట్టారు. మళ్ళీ అదే కాగ్ చేత ఆ మరునాడే అక్షింతలు వేయించుకోవలసి వచ్చింది.

 

ఒకవైపు విద్యుత్ కోతలతో నీళ్ళు అందక పంటలు ఎండిపోతుంటే, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క ఎకరం కూడా నీళ్ళు అందక ఎండిపోలేదని ఆయన శాసనసభలో చాల గట్టిగా వాదించడం చూసిన తరువాత మేధావులు సైతం ఆయన ధోరణిని అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. అదే విధంగా విద్యుత్ బిల్లులు పెరిగితే ప్రజలు తప్పనిసరిగా ఆ భారం బరించాల్సిందే అంటూ దురుసుగా మాట్లాడి ప్రజలలో కూడా తనను తానూ చులకన చేసుకొన్నారు. అందుకు ప్రతిచర్యగా ప్రతిపక్షాలు అన్నీ ధర్నాలు నిరాహార దీక్షలు చేయడం, చివరికి వారి ఒత్తిడికి తట్టుకోలేక ఆయన విద్యుత్ బిల్లుల పెంపు విషయంలో వెనక్కి తగ్గాల్సిరావడం ఇటీవల కాలంలో ‘పెరిగిన ఆయన రేటింగ్స్’ పెరిగినంత వేగంగానూ పడిపోయేలా చేసాయి.

 

నానాటికి అడ్డు ఆపులేకుండా పెరుగుతున్న ధరలు, విద్యుత్ కోతలు, విద్యుత్ లేకపోయినా సామాన్య ప్రజలకు షాకులు ఇస్తున్న విద్యుత్ బిల్లులు వంటి అనేక ప్రతికూల అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా, కేవలం కాంగ్రెస్ అధిష్టానం అండదండలు చూసుకొని, రాష్ట్రంలో ప్రతిపక్షాల మద్య జరుగుతున్న తీవ్రయుద్ధాలను చూసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఇప్పుడు ‘తన గాలి వీస్తోందనుకొంటే’ అంతకంటే పొరపాటు ఉండదు.

 

కాంగ్రెస్ పార్టీలో ఎవరి పరిస్థితి ఎల్లకాలం ఒకేలా ఉండదని ఆ పార్టీ చరిత్ర తెలిసిన వారెవరయినా చెప్పగలరు. ఆయన ఎంత అకస్మాత్తుగా ముఖ్యమంత్రి అయ్యారో అంతే అకస్మాతుగా దాని నుండి దింపబడినా ఆశ్చర్యం పోనవసరం లేదు. అటువంటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇంత దురుసుగా వ్యవహరించడం అంటే తానూ కూర్చొన్న కొమ్మను తానే నరుకొంటున్నట్లు అవుతుంది. ఉన్న కొద్దిపాటి సమయంలో ‘ఫలానా కిరణ్ కుమార్ అనే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఈ గొప్ప పనులు చేసారు’ అనే పేరు సంపాదించుకోగలిగితే అదే ఆయనకు శ్రీ రామరక్షగా నిలుస్తుంది తప్ప ఈ ‘దూకుడు’ మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును.

By
en-us Political News

  
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.