Publish Date:Nov 27, 2024
మహారాష్ట్ర రాజకీయం ముదిరి పాకాన పడింది. ఓ వైపు అనూహ్య విజయం సాధించిన బీజేపీ కూటమి పార్టీలలోనూ విభేదాలు పొడసూపాయి. అలాగే ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ కూటమిలోనూ లుకలుకలు మొదలయ్యాయి. ముందుగా బీజేపీ కూటమి విషయానికివస్తే.. కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ కూటమిలో ముఖ్యమంత్రి పదవి కోసం కుమ్ములాటలు సాగుతున్నాయి. బీజేపీయే కలలో కూడా ఊహించని విధంగా కూటమిలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రధర్మం సంగతి పక్కన పెట్టి ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతోంది. ఏక్ నాథ్ షిండే సీఎంగా కొనసాగుతారన్న నమ్మకం, ఒప్పందంతోనూ కూటమి మహా ఎన్నికలకు వెళ్లింది. అయితే ఘన విజయం తరువాత బీజేపీ ప్లేట్ ఫిరాయించిందన్నది శివసేన షిండే వర్గం ఆరోపణ. అంతే కాదు షిండేను సీఎంను చేసి తీరాల్సిందేనని ఆయన వర్గం ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. షిండే గత రెండేళ్లుగా సాగించిన పాలనకు ప్రజామోదమే ఈ ఎన్నికలలో బీజేపీ కూటమి ఘన విజయానికి కారణమని చెబుతున్నారు.
అయితే బీజేపీ అధినాయకత్వం మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ నే దేవెంద్రఫడ్నవిస్ నే సీఎం పీఠంపై కూర్చోపెట్టాలని పట్టుబడుతోంది. అదే సమయంలో ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా కన్ ఫర్మ్ అయ్యారని కూడా చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఏక్ నాథ్ షిండే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజ్యాంగం ప్రకారం మంగళవారం (నవంబర్ 26)తో అసెంబ్లీ గడువు ముగియడంతో ఎగ్జిస్టింగ్ ప్రభుత్వం గద్దె దిగి కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది. అయితే సీఎం ఎవరన్న విషయం తేలకపోవడంతో షిండే రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. షిండే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేయడానికి రాజ్ భవన్ కు వెళ్లిన సందర్భంగా ఆయన బాడీ లాంగ్వేజ్ గమనించిన ఎవరికైనా ఆయన హ్యాపీగా లేరన్న విషయం స్పష్టమౌతుంది.
షిండేను సముదాయించడానికి బీజేపీ ఆయనకు భారీ ఆఫర్లు చేసిందని కూడా మహారాష్ట్ర రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. ఫడ్నవీస్ సర్కార్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు షిండే ఇష్టపడకుంటే.. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని కూడా బీజేపీ హై కమాండ్ ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. అయితే రాష్ట్ర రాజకీయాలకు దూరం కావడానికి షిండే ఇసుమంతైనా అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే విషయంలో జాప్యం జరుగుతోంది.
మరో వైపు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ కూటమిలో కూడా లుకలుకలు మొదలయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ బలం పూర్తిగా దిగజారిపోయింది. అతి తక్కువ స్థానాలలో విజయం సాధించింది. దీంతో శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం అసెంబ్లీలో విపక్ష నేత హోదా కోసం పట్టుబడుతున్నారు. కూటమిలో పెద్ద పార్టీగా, కూటమికి నాయకత్వం వహించే పార్టీగా కాంగ్రెస్ అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇక శరద్ పవార్ అయితే కూటమిలో కొనసాగే విషయంలోనే విముఖంగా ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహావికాస్ అఘాడీ ఐక్యంగా కొనసాగే విషయంలో సర్వత్రా అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/clumzr-turn-in-maharashtra-politics-39-189057.html
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.