Publish Date:Jun 10, 2025
జగన్ హయాంలో అస్తవ్యవస్థంగా తయారైన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసి దారిలో పెట్టేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకుల పంపిణీని సమూలంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందు కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టి పెట్టి శ్రమిస్తున్నారు. రేషన్ సరుకుల పంపిణీ ని ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇందు కోసం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో బాగంగా సోమవారం (జూన్ 9) ఏలూరులో పర్యటించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణం చేతా రేషన్ సరుకుల పంపిణీ ఆగడానికి వీల్లేదని ఆయనీ సందర్భంగా డీలర్లకు చెప్పారు. సర్వర్లు పని చేయడం లేదనో, మరో కారణం చేతనో రేషన్ షాపులకు వస్తున్న వారిని డీలర్లు వెనక్కు పంపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్న ఆయన.. సర్వర్ పని చేయని సందర్భంలో లబ్ధిదారుని ఫొటో తీసుకుని సంతకం చేయించుకుని రేషన్ ఇవ్వాలనీ, అంతే తప్ప పంపిణీని వాయిదా వేయడానికి వీల్లేదని కచ్చతమైన ఆదేశాలు జారీ చేశారు.
జగన్ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీ అంటూ దొడ్డిదారిన రేషన్ సరుకులను అక్రమ మార్గాల ద్వారా అమ్ముకున్నారని, దానిని నిర్మూలించేందుకే పాత పద్దతికే తాము మద్దతుగా నిలిచామని నాదెండ్ల చెప్పుకొచ్చారు. లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ వారికి అంది తీరాలపీ, ఇందులో ఎలాంటి మినహాయింపులకు తావులేదని కూడా నాదెండ్ల స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cleansing-the-public-distribution-system-aim-39-199640.html
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.