న్యాయవ్యవస్థ ఉన్నంత వరకు ప్రజలకు భయం లేదు: జస్టిస్ టాకూర్

Publish Date:Dec 7, 2015

Advertisement

 

కాంగ్రెస్ పార్టీ కనిపెట్టిన ‘మత అసహనం’ అనే పదం ఇప్పుడు ఎక్కువగా వినబడుతోంది. ఊహజనితమయిన ఈ అంశంపై చర్చించడం కోసం అతి ముఖ్యమయిన అనేక బిల్లులను, ప్రజా సమస్యలపై చర్చలను పార్లమెంటు పక్కన పెట్టడం చూస్తుంటే అందుకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ టి.ఎస్. టాకూర్ మత అసహనం గురించి చాలా చక్కటి మాట చెప్పారు.

 

"కొందరు రాజకీయ నాయకులు దానితో రాజకీయాలు చేసుకొంటున్నారు. కానీ మన న్యాయవ్యవస్థ ఇదే విధంగా స్వతంత్ర ప్రతిపతితో నడుస్తున్నంత కాలం, మన దేశంలో ప్రజలు ఏ మతానికి, ప్రాంతానికి చెందిన వారయినప్పటికీ  వారికి మత స్వేచ్చతో సహా రాజ్యాంగం ప్రసాదించిన అన్ని హక్కులను అది కాపాడుతుంది. వారికి అండగా నిలబడుతుంది. కనుక ప్రజలు మత అసహనం గురించి చింతించనవసరం లేదు," అని అన్నారు.

 

"మన దేశంలో మత సహనం ఉంది కనుకనే విభిన్న మతాల ప్రజలు కలిసికట్టుగా జీవించగలుగుతున్నారనే విషయం మనం మరిచిపోకూడదు. ఇంతవరకు మన దేశంలో ఎన్ని మతాలువారు ప్రవేశించినా వారినందరినీ తనలో ఇముడ్చుకొంది. అదే మన దేశం యొక్క గొప్పదనం. మన దేశానికి వస్తున్న విదేశీయులకి కూడా మన న్యాయ వ్యవస్థలు చట్ట ప్రకారం రక్షణ కల్పిస్తునప్పుడు భారతీయులకు కల్పించలేవా? దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా వారు మన న్యాయవ్యవస్థలను ఆశ్రయించినట్లయితే, వారికి చట్ట ప్రకారం పూర్తి న్యాయం జరిగేలా చూడవలసిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉంది. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయడంలో మన న్యాయవ్యవస్థలు ఎన్నడూ తమ బాధ్యతను ఎన్నడూ విస్మరించలేదు. ఇక ముందు కూడా మన న్యాయవ్యవస్థలు ఇదే నిబద్దతతో పనిచేస్తుంటాయి. కనుక దేశ ప్రజలు మత అసహనం గురించి అనవసరంగా చింతించనవసరం లేదు,” అని అన్నారు.

 

రచయితలు దాబోల్కర్, కులబుర్గీల హత్యలపై జస్టిస్ టి.ఎస్. టాకూర్ స్పందిస్తూ “సుప్రీం కోర్టు ఆదేశించినంత మాత్రాన్న దేశంలో నేరాలు ఆగిపోవు. సమాజంలో మంచి పౌరులతో బాటు నేర ప్రవృతి కలిగినవారు కూడా ఉంటారు. అటువంటివారి వలన నేరాలు జరుగుతుంటాయి. అవి జరగకుండా అరికట్టడానికి, ఒకవేళ జరిగితే దోషులను శిక్షించడానికి మనం బలమయిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకొన్నాము. అవి చట్టప్రకారం దేశ ప్రజలందరికీ అండగా నిలబడి న్యాయం చేస్తుంటాయి. కనుక బాష, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయులు అందరికీ మన న్యాయవ్యస్థలు రక్షణ కల్పిస్తూనే ఉంటుంది,” అని అన్నారు.

 

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి దేశంలో చాలా మత ఘర్షణలు జరిగాయి. అయినా దేశంలో ప్రజలందరూ కలిసికట్టుగానే జీవిస్తున్నారు. కారణం ప్రజలలో మత సహనం కలిగి ఉండటమే. అడపా దడపా నేర ప్రవృతి కలిగిన వాళ్ళు లేదా స్వార్ధ రాజకీయ నాయకుల కారణంగా దేశంలో మత ఘర్షణలు తలెత్తుతుంటాయి. కానీ ప్రజలు వారంతట వారుగా మత ఘర్షణలకు పూనుకొన్న సందర్భాలు చాలా అరుదు. భారత న్యాయవ్యవస్థలో అత్యునత స్థానంలో ఉన్న జస్టిస్ టి.ఎస్. టాకూర్ చెప్పిన ఈ మాటలు మత అసహనం గురించి తెగ మాట్లాడేస్తున్న మన రాజకీయనాయకులకు కనువిప్పు కలిగించగలిగితే బాగుండును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.