Publish Date:Aug 13, 2022
బాల్యంలోనే విడిపోయి పెద్దయిన తర్వాత కలుసుకునే అన్నాచెల్లెళ్లను సినిమాలు బాగా చూపించి ఇలానూ జరుగుతుందా అని పించారు ప్రేక్షకు లచేత. కొన్ని ఊహించని సంఘటనలు అలానే జరుగుతాయన్నది ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. తప్పిపోయిన పిల్లలు కలవడం ఈమధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లోనూ జరిగింది. తనకు ఒక అన్న ఉన్నాడని తెలిసి అతన్ని కలవడాని కి ఏకంగా పదేళ్లపాటు తెలిసిన అన్ని ప్రాంతాలు, ఆస్పత్రులూ తిరిగిండి క్రిస్టినా సాడ్బెరీ. ఆస్టిన్ టెక్సాస్లో కుక్ హాస్పిటల్ అని పిల్లల ఆస్పత్రి ఉంది. అక్కడకి ఏడేళ్లుగా రోజూ వెళ్లి అన్ని వార్డులు తరచి చూసేది. ఆమెను ఎవ్వరూ అడ్డుకునే వారు కాదు. కారణం ఆమె అక్కడే పుట్టింది. మూడేళ్ల వయసులో క్రిస్టినా తన అసలు కుటుంబానికీ దూరమయింది. అన్నా.. నువ్వులేని నా బతుకు భారం.. అంటూ వీధుల పడి సినిమాటిక్గా ఏడవలేదు. ఎలాగైనా కలివాలని, ఎందుకు విడిపోయిందీ తెలుసుకోవాల న్నది ఆమె పట్టుదల.
చిత్రమేమంటే క్రిస్టినా సోదరుడు రేమండ్ టర్నర్ కూడా ఇలానే అదే ఆస్పత్రిలో తిరగడం! అపరిచితుల్లా ఇద్దరూ అక్కడే తిరిగా రు. 2006 నుంచి తన అసలు కుటుంబం గురించి తిరుగుతూంటే ఆమెకు తన తల్లి కలిసిందికాని తండ్రి , సోదరుడూ ఎవరన్నది ఇంకా తెలియలేదు. చివరికి 2014లో డిఎన్ ఏ పరీక్షా కేంద్రానికి వెళ్లి కాస్తంత అనుమానంగా అనిపించిన 24 మంది తో తనను పోల్చి రిపోర్టు ఇమ్మన్నది. కానీ వారిలో సగం మంది దూరపు బంధువులే తప్ప సొంత సోదరుడు లేదని తేలింది. ఇక ఇక్కడితో అంతా అయిపోయింది. తిరగడం వేస్ట్ అనే అనుకుంది.
ఇలా ఉండగా, రేమాండ్ భార్య మరియా అతని చేత డి ఎన్ ఏ వంటి పరీక్ష చేయించింది. వాస్తవానికి హామ్స్టడ్లో అతను తన తండ్రితో ఉంటున్నాడు. ఆయన వివాహం చేసుకోలేదు. రేమాండ్, తన తమ్ముడూ ఇద్దరూ అమ్మమ్మగారింట పెరిగారు. కానీ అతనికి ఒక సోదరి ఉందన్న సంగతి తెలియదు. అయితే తాను చేయించుకున్న పరీక్షల వల్ల తాను ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చిన కుటుంబానికి చెందినవాడని తేలింది. దీన్ని ఆధారం చేసుకుని తన సోదరి గురించి తానూ వెతకడం ఆరంభించాడు. కొద్ది నెలల తర్వాత క్రిస్టినా అనే ఆమె కూడా ఇదే లక్ష్యంతో తిరుగుతోందని తెలుసుకున్నాడు. ఆమె గురించి తెలుసుకోవ డం లో అతనికి వారి తండ్రి ఒక్కడే అన్నది తెలిసి ఎంతో ఆశర్యపోయాడు. కాగా 42 ఏళ్ల క్రిస్టినా తన 11 ఏళ్ల కుమారుడు బ్రైసన్కు నరాల వ్యాధి చికిత్సకు ఆస్పత్రి చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో రేమాండ్ని చాలాసార్లు చూసింది. అతనూ చూశాడు. కానీ ఆస్పత్రికి వచ్చిన వారిని చూసినట్టుగానే ఇద్దరూ భావించుకున్నారే గాని హలో అనుకోలేదు. చిత్రంగా ఇదంతా ఏకంగా ఏడేళ్లు సాగింది.
కానీ ఒకరోజు రోడ్డు దాటి ఆస్పత్రికి వెళుతూంటే రేమాండ్ అక్కడి కూడలిలో గిటార్ పట్టి పాత పాట పాడుతున్నాడు. అది విని క్రిస్టినా అలా నిలుచుండిపోయింది. అంతే వేగంగా అతని దగ్గరికి వెళ్లి, ఈ పాట నీకెలా తెలుసు అది మా నాన్నగారు పాడేవారట మా అమ్మమ్మ చెప్పేది అన్నది. అప్పటికి రేమాండ్ కి అర్ధమయింది .. ఇన్నాళ్లూ చూస్తున్న ఈ క్రిస్టినాయే తన సోదరి అని. ఇద్దరు తమని తాము గుర్తించుకున్నారు..కనీళ్ల పర్యంతమయ్యారు..అన్నాచెల్లెళ్ల బంధాన్ని వ్యక్తం చేసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cinematic-turns-in-sister-25-141868.html
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.