కృష్ణాన‌గ‌రే మామా!..సినిమా కష్టాల వెత!

Publish Date:Aug 7, 2025

Advertisement

తెలుగు సినీ కార్మికులు వ‌ర్సెస్ నిర్మాతలు!

సినీ కార్మికులు వ‌ర్సెస్ నిర్మాత‌లు అస‌లు గొడ‌వేంటి? పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ  నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్ వీరిక‌స‌లు టాలెంటే లేదు. ఐనా ఐటీ ఎంప్లాయిస్కి ఇచ్చే దానిక‌న్నా భారీ వేత‌నాల‌ను ఇస్తున్నామ‌ని అంటున్నారు. మ‌రో ప‌క్క చూస్తే మూడేళ్లు అయ్యింది.  మా వేత‌నాలు పెంచి..  30 శాతం పెంచ‌ండని డిమాండ్ చేస్తున్నారు తెలుగు సినీ కార్మికులు. అయితే యూనియ‌న్ల అక్ర‌మాలు, అవినీతి కార‌ణంగా సినిమా ఫీల్డ్ లోకి నైపుణ్యం గ‌ల వారు రావ‌డం లేదంటూ,  అందుకు ఉదాహ‌ర‌ణగా  డ్యాన్స‌ర్ల వ్య‌వ‌హారాన్ని వెలుగులోకి తెచ్చారు నిర్మాత విశ్వప్రసాద్.

యూనియ‌న్లు ఒక్కో కార్డు కోసం ల‌క్ష‌లాది రూపాయ‌ల మేర డ‌బ్బు వ‌సూలు చేస్తున్నార‌నీ.. మాలాంటి వారు సిఫార్సు చేసినా కార్డు ఇవ్వ‌డం లేద‌నీ.. దీంతో వారికి తెలిసిన వారినే వెంట తెస్తూ.. ఆపై నైపుణ్యం లేని వారిని సినిమా ఫీల్డ్ లోకి తెస్తున్నార‌ని ఆరోపించారాయ‌న‌. దీంతో తాము   డాన్స‌ర్ల‌ను తేవ‌ల్సి వ‌స్తోంద‌నీ, దీంతో  ఖ‌ర్చు త‌డిసి మోపెడౌతోందపీ అంటున్నారు  నిర్మాత విశ్వ ప్ర‌సాద్. ఆ మాట‌కొస్తే ప‌రిశ్ర‌మ అవినీతి అడ్డా, అక్ర‌మ‌మాల పుట్ట అని తానెప్పుడో  చెప్పానని ఆ మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాననీ చెబుతున్నారు. 

త‌మ‌కంత టాలెంట్ లేకుంటే ఏడు జాతీయ అవార్డులు ఎలా వ‌స్తాయంటారు సినీ కార్మిక సంఘం అధ్య‌క్షుడు అమ్మిరాజు. ఇక బాహుబ‌లి నుంచి పుష్ప వ‌ర‌కూ తెలుగు సినిమా ఖ్యాతి అంత‌ర్జాతీయ స్తాయికి చేరింది, మ‌రి ఇదెలా సాధ్య‌మైంది? మొన్నామ‌ధ్య ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌  ఆస్కార్ సాధించింది. ఇందులో ఉన్న‌దంతా తెలుగు వారి ప్ర‌తిభా పాట‌వాలే. అలాగే  మ‌న త‌గ్గేదేలే, బ్రో ఐ డోంట్ కేర్ వంటి మేన‌రిజ‌మ్స్.. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి కదా.. మ‌న పాట‌లు, మాట‌లు వ‌ర‌ల్డ్ వైడ్ ఆడియ‌న్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి..  ఇదంతా తెలుగు వారి ప్ర‌తిభ కాదా?  అని నిల‌దీస్తున్నారు సినీ కార్మికులు. ఒక‌రైతే విశ్వ ప్ర‌సాద్ గారూ మీరు నిర్మాణ సంస్థ  స్థాపించి ఇన్నేళ్ల‌య్యింది. 17 సినిమాల వ‌ర‌కూ తీశారు. అందులో ఓ మూడు నాలుగు త‌ప్ప ఏవైనా పెద్ద‌గా ఆడాయా? మ‌రి  మీకంత టాలెంట్ ఉంది క‌దా? ఎందుకు సాధ్యం కాలేద‌ని నిల‌దీశారు.

ఇదంతా అలా ఉంచితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో చిన్న సినిమా  నిర్మాత‌లైతే ఇప్పుడిస్తున్న వేత‌నాల్లోంచి 25 శాతం వారే త‌గ్గించుకోవాల‌ని అంటారు. ఆల్రెడీ కార్డున్న వాళ్లే కాదు లేని వాళ్లు కూడా ఫీల్డ్ లోకి వ‌చ్చేలాంటి స్ట్ర‌క్చ‌ర్ రావాల‌ని విశ్వ‌ప్ర‌సాద్ నిర్మాత‌లంద‌రి త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తుంటే.. చిన్న సినిమా నిర్మాత‌ల  త‌ర‌ఫున సీ క‌ళ్యాణ్ వ‌చ్చి ఈ బాంబు పేల్చారు. కొంద‌రు నిర్మాత‌లైతే.. 10 శాతం మేర అయితే పెంచ‌గ‌లంగానీ.. ఇంత పెద్ద మొత్తం త‌మ వ‌ల్ల కాదంటున్నారు.

ఫైన‌ల్ గా నిర్మాత‌లు వ‌ర్సెస్ కార్మికుల వ్య‌వ‌హారంలో అస‌లు పేచీ ఎక్క‌డ‌ అని చూస్తే... వారేమో వెంట‌నే 30 శాతం వేత‌నాలు పెంచాల‌ని కోరుతుంటే.. వీరేమో.. మాకు ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు కావాలి.. ఇక్క‌డ స‌రైన నిపుణులు లేన‌పుడు బ‌య‌ట రాష్ట్రాల నుంచి టెక్నీషియ‌న్ల‌ను తెప్పించుకునే వెస‌లుబాటు క‌ల్పించాలి. షూటింగ్ ఎక్క‌డ జ‌రిగినా రేషియో అనేది ఉండ‌కూడ‌దు. సెకండ్ సండే, ఫెస్టివ‌ల్స్ లో వ‌ర్క్ కి మాత్ర‌మే డ‌బుల్ కాల్ షీట్.. మిగిలిన సండేస్ లో సింగిల్ కాల్ షీట్.. ఈ నాలుగు ప్ర‌తిపాద‌న‌లపై ఫెడ‌రేష‌న్ నిర్ణ‌యం చెబితే.. అప్పుడు వేత‌నాల పెంపు గురించి ఆలోచిస్తామ‌ని అంటున్నారు నిర్మాత‌లు.

ఇప్పుడు మ‌రో చ‌ర్చ‌కు కూడా తెర‌లేచింది.. చిరంజీవి, బాల‌కృష్ణ వీరెవ‌రిలో ఇండ‌స్ట్రీ పెద్ద అయ్యే అవ‌కాశ‌ముంద‌న్న చ‌ర్చ‌ సైతం జ‌రుగుతోంది. చిరంజీవి అనేదాన్నిబ‌ట్టీ చూస్తే ఇది నిర్మాత‌లు, కార్మికుల స‌మ‌స్య‌... కాబ‌ట్టి వారే తీర్చుకోవాల‌ని అంటే..  బాల‌కృష్ణ మాత్రం ఇటు నిర్మాతలు,  అటు కార్మికులు ఇద్ద‌రికీ న్యాయం జ‌ర‌గాల‌ని అన్నారు. మ‌రి వీరిలో పెద్ద కాద‌గిన అర్హ‌త ఎవ‌రికుంది? అన్న‌దొక స‌స్పెన్స్ గా మారింది. చూడాలి.. ఈ కృష్ణాన‌గ‌ర్ సినిమా క‌ష్టాల వెత ఎక్క‌డి వ‌ర‌కూ వ‌స్తుందో ?

By
en-us Political News

  
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.