బాబోయ్ వీళ్ళేం మనుషులు బాబు!
Publish Date:Mar 20, 2012
Advertisement
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రముఖ సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్ బాబు మధ్య ఒకానొక దశలో పచ్చగడ్డివేస్తే భగ్గుమనేది. మోహన్ బాబు చంద్రబాబుపై కట్టిగట్టి కాలికి బలపం కట్టుకుని చిత్తూరుజిల్లా అంతా తిరిగి టిడిపికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. చంద్రబాబు అనుయాయులు మోహన్ బాబుపై అనేకమైన ఆరోపణలు చేశారు. అటువంటి వీరిద్దరి మధ్య ఇప్పుడు సయోధ్య కుదరడం చేతులు కలపడం చిత్తూరు జిల్లా ప్రజానీకానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీళ్ళేనా గతంలో బద్ధశత్రువులుగా మెలిగింది అన్న ఆశ్చర్యాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు, మోహన్ బాబు మధ్య గతంలో వ్యాపార లావాదేవీలు ఉండేవి. హెరిటేజ్ డైరీలు ఏర్పాటుకు మోహన్ బాబు కూడా పెట్టుబడులు పెట్టారు. అయితే ఆ తరువాత మోహన్ బాబును తెలివిగా చంద్రబాబునాయుడు వ్యాపార భాగస్వామిగా వదిలించుకున్నారు. అప్పట్లో కొంత డబ్బు చెల్లింపు విషయంలో కూడా చంద్రబాబునాయుడు ఆలస్యం చేయడంతో మోహన్ బాబు ఆయనకు దూరమయ్యారు. అంతేకాక ఎన్నికల సమయంలో పనికట్టుకుని మరీ చంద్రబాబుకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రచారం చేశారు. మోహన్ బాబు ప్రచారం వల్ల చంద్రబాబుకు పెద్దగా నష్టం జరగలేదు. అయితే వీరిద్దరి మధ్య మాత్రం అగాధం మరింత పెరిగింది. కాలక్రమెణా ఇద్దరిలోనూ వచ్చిన మార్పు కారణంగా ఇప్పుడు ఇద్దరూ చేతులు కలుపుతున్నారు. కానీ గతాన్ని మర్చిపోలేని చిత్తూరుజిల్లా ప్రజలు మాత్రం 'బాబోయ్ వీళ్ళేం మనుషులు బాబు, తిట్టుకుంటారు ... కొట్టుకుంటారు ... మళ్ళీ కలిసిపోతారు' అని వ్యాఖ్యానించుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/cine-actor-mohan-babu-24-12788.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





