Publish Date:Jul 10, 2025
ఇదీ జగన్ బంగారు పాళ్యం పర్యటనకు పత్రికల్లో పెడుతోన్న క్యాప్షన్స్. జులై 9న జగన్ చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మామిడి రైతుల పరమార్శకు వచ్చారా? లేక తన హంగూ ఆర్భాటం చూపించడానికి వచ్చారా? ఎవరికీ అర్ధం కాలేదు. అదసలు పరమార్శ యాత్రలా లేదు. దండయాత్రను తలపిస్తోందన్న మాట వినిపిస్తోంది. అధ్యక్షుడినే ఏకంగా చొక్కా పట్టుకుని లాగుతున్నారు, ముట్టుకుంటున్నారు. ఎవరూ ఎవరి మాట వినడం లేదు. జగన్ అరుస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదెవరూ. 10 లక్షల జనాభా వచ్చినా టీడీపీ సభలు సజావుగా జరిగినవి ఎన్ని లేవు. అదే వైసీపీ.. ఆ అరుపులేంటి? కేకలేంటి? రచ్చ రావణ్యమేంటి? కొందరననే మాటలేంటంటే అరలుంగీలు కట్టి వదిలితే వీళ్లు అచ్చం ఆ దండుపాళ్యం బ్యాచీలా లేరూ.. అన్న మాట వినిపించింది సర్వత్ర
.అటుమొన్న పొదిలి, మొన్న తెనాలి, నిన్న సత్తెనపల్లి, నేడు బంగారుపాళ్యం.. అంతా ఒకటే బ్యాచ్, ఒకటే లుక్. ఎలాంటి తేడా లేదు. అలజడి సృష్టించడానికి అందరూ కలసి కట్టు కట్టుకుని మూకుమ్మడిగా దిగినట్టుగా కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.ఇది మామిడి రైతుల కష్టాలు తెలుసుకోవడం కాదు.. మన్నాంగడ్డి కాదు. ఇది అదే. శాంతి భద్రతల సమస్యకు విఘాతం కలిగించేదే.. కాబట్టి దీన్ని కంపల్సరిగా కట్టడి చేయాలంటారు కొందరు. మరి కొందరైతే ఒక ప్రశ్న వేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజా సమ్యలను తెలుసుకుని.. ప్రజా వేదికలైన అసెంబ్లీకి వెళ్లి సమస్య పరిష్కారం కనుగొనడం ఒక రూట్ మ్యాప్. ఆయనసలు అసెంబ్లీకే వెళ్లకుండా ఏం సాధించేటట్టు? అదీ నిజమే కదా అంటారు ఇంకొందరు. జగన్ ఇప్పట్లో అప్పట్లో అసెంబ్లీకి వచ్చేది లేదు. అక్కడ రైతులు కాదు.. ఇతరులెవరి సమస్యలను చర్చించే అవకాశమే లేదు. ఇదంతా తన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న పోరాటం ఆరాటం.
అయినా సీజన్ అయిపోయాక వచ్చి ప్రయోజనమేంటి? అంటారు కొందరు రైతులు. ఒక వేళ జగన్ నిజంగా చేయాల్సి వస్తే ఇప్పటికే జిల్లాలోని ఫ్యాక్టరీల్లో నిల్వ ఉన్న లక్ష కిలోల పల్ప్ ని కొనాలి. ఎందుకంటే తమ దగ్గర అంత నిల్వ ఉంది కాబట్టి.. ఈ సీజన్ కి పల్ప్ వద్దన్నది ఫ్యాక్టరీల మాట. ఎప్పుడైతే ఉన్న నిల్వ అమ్ముడవుతుందో ఆపై తాము కొంటామని అంటారు వారు. ఈ సీజన్ లో కూడా అదేమంత సేల్ కాలేదు. వాళ్లు అప్పట్లో ముప్పై రూపాయలు పర్ కిలో కొంటే ఇప్పుడు ఐదు రూపాయలకు కూడా కొనే నాథుడే లేరు. దీంతో వారు కాయ కొనడం లేదు. ఇక్కడ చూస్తే పల్ప్ ఫ్యాక్టరీలు కొంటున్నాయి కదాని.. టేబుల్ రకాలు పక్కన పెట్టి, తోతాపురి రకం ఎక్కువగా వేసేశారు రైతులు.
ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన తంటా ఇది. దానికి తోడు తన హయాంలో ఈ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు.. జగన్. వారికి ఏదైనా సాయం చేసిన దాఖలాలు కూడా లేవు. ఈ సారి వర్షాలు కూడా బాగా పడ్డంతో.. పంట ఏపుగా ఎదిగింది. దీంతో వచ్చిన సమస్య ఇది. ఇది జనానికి అర్ధం కావల్సిన విషయం. కానీ జగన్ ఏం చేస్తున్నారు? బల ప్రదర్శన చేయడానికో వేదిక చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సమస్య ఏంటో అర్ధంకాక ఒక గజిబిజి గందరగోళానికి ఆస్కారమేర్పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయ్. ఇది మామిడి రైతుల కష్టాలు తెలుసుకుని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నివేదిక ఇద్దాం,దీనిపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడదాం అన్న ఆలోచనతో చేసిన పర్యటన లాగా వుందా? ఆ ఆలోచనే లేకపోతే ఈ సమస్యను అధికారంలో లేని నీవు పరిష్కరిస్తావా?ఎంత దండగ మారిన గోల ఇది. ఇదేమన్నా కోటప్పకొండ తిరనాళ్ళా?ఈ పోకడ రాష్ట్రానికి క్యాన్సర్ కంటే ప్రమాదకరం!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chittoor-district-39-201690.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.