Publish Date:Jul 10, 2025
ఇదీ జగన్ బంగారు పాళ్యం పర్యటనకు పత్రికల్లో పెడుతోన్న క్యాప్షన్స్. జులై 9న జగన్ చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మామిడి రైతుల పరమార్శకు వచ్చారా? లేక తన హంగూ ఆర్భాటం చూపించడానికి వచ్చారా? ఎవరికీ అర్ధం కాలేదు. అదసలు పరమార్శ యాత్రలా లేదు. దండయాత్రను తలపిస్తోందన్న మాట వినిపిస్తోంది. అధ్యక్షుడినే ఏకంగా చొక్కా పట్టుకుని లాగుతున్నారు, ముట్టుకుంటున్నారు. ఎవరూ ఎవరి మాట వినడం లేదు. జగన్ అరుస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదెవరూ. 10 లక్షల జనాభా వచ్చినా టీడీపీ సభలు సజావుగా జరిగినవి ఎన్ని లేవు. అదే వైసీపీ.. ఆ అరుపులేంటి? కేకలేంటి? రచ్చ రావణ్యమేంటి? కొందరననే మాటలేంటంటే అరలుంగీలు కట్టి వదిలితే వీళ్లు అచ్చం ఆ దండుపాళ్యం బ్యాచీలా లేరూ.. అన్న మాట వినిపించింది సర్వత్ర
.అటుమొన్న పొదిలి, మొన్న తెనాలి, నిన్న సత్తెనపల్లి, నేడు బంగారుపాళ్యం.. అంతా ఒకటే బ్యాచ్, ఒకటే లుక్. ఎలాంటి తేడా లేదు. అలజడి సృష్టించడానికి అందరూ కలసి కట్టు కట్టుకుని మూకుమ్మడిగా దిగినట్టుగా కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.ఇది మామిడి రైతుల కష్టాలు తెలుసుకోవడం కాదు.. మన్నాంగడ్డి కాదు. ఇది అదే. శాంతి భద్రతల సమస్యకు విఘాతం కలిగించేదే.. కాబట్టి దీన్ని కంపల్సరిగా కట్టడి చేయాలంటారు కొందరు. మరి కొందరైతే ఒక ప్రశ్న వేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజా సమ్యలను తెలుసుకుని.. ప్రజా వేదికలైన అసెంబ్లీకి వెళ్లి సమస్య పరిష్కారం కనుగొనడం ఒక రూట్ మ్యాప్. ఆయనసలు అసెంబ్లీకే వెళ్లకుండా ఏం సాధించేటట్టు? అదీ నిజమే కదా అంటారు ఇంకొందరు. జగన్ ఇప్పట్లో అప్పట్లో అసెంబ్లీకి వచ్చేది లేదు. అక్కడ రైతులు కాదు.. ఇతరులెవరి సమస్యలను చర్చించే అవకాశమే లేదు. ఇదంతా తన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న పోరాటం ఆరాటం.
అయినా సీజన్ అయిపోయాక వచ్చి ప్రయోజనమేంటి? అంటారు కొందరు రైతులు. ఒక వేళ జగన్ నిజంగా చేయాల్సి వస్తే ఇప్పటికే జిల్లాలోని ఫ్యాక్టరీల్లో నిల్వ ఉన్న లక్ష కిలోల పల్ప్ ని కొనాలి. ఎందుకంటే తమ దగ్గర అంత నిల్వ ఉంది కాబట్టి.. ఈ సీజన్ కి పల్ప్ వద్దన్నది ఫ్యాక్టరీల మాట. ఎప్పుడైతే ఉన్న నిల్వ అమ్ముడవుతుందో ఆపై తాము కొంటామని అంటారు వారు. ఈ సీజన్ లో కూడా అదేమంత సేల్ కాలేదు. వాళ్లు అప్పట్లో ముప్పై రూపాయలు పర్ కిలో కొంటే ఇప్పుడు ఐదు రూపాయలకు కూడా కొనే నాథుడే లేరు. దీంతో వారు కాయ కొనడం లేదు. ఇక్కడ చూస్తే పల్ప్ ఫ్యాక్టరీలు కొంటున్నాయి కదాని.. టేబుల్ రకాలు పక్కన పెట్టి, తోతాపురి రకం ఎక్కువగా వేసేశారు రైతులు.
ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన తంటా ఇది. దానికి తోడు తన హయాంలో ఈ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు.. జగన్. వారికి ఏదైనా సాయం చేసిన దాఖలాలు కూడా లేవు. ఈ సారి వర్షాలు కూడా బాగా పడ్డంతో.. పంట ఏపుగా ఎదిగింది. దీంతో వచ్చిన సమస్య ఇది. ఇది జనానికి అర్ధం కావల్సిన విషయం. కానీ జగన్ ఏం చేస్తున్నారు? బల ప్రదర్శన చేయడానికో వేదిక చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సమస్య ఏంటో అర్ధంకాక ఒక గజిబిజి గందరగోళానికి ఆస్కారమేర్పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయ్. ఇది మామిడి రైతుల కష్టాలు తెలుసుకుని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నివేదిక ఇద్దాం,దీనిపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడదాం అన్న ఆలోచనతో చేసిన పర్యటన లాగా వుందా? ఆ ఆలోచనే లేకపోతే ఈ సమస్యను అధికారంలో లేని నీవు పరిష్కరిస్తావా?ఎంత దండగ మారిన గోల ఇది. ఇదేమన్నా కోటప్పకొండ తిరనాళ్ళా?ఈ పోకడ రాష్ట్రానికి క్యాన్సర్ కంటే ప్రమాదకరం!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chittoor-district-39-201690.html
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.