Publish Date:Sep 20, 2022
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఓ 10 సెకన్ల ఆడియో.. ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం.. నా నుంచి దూరం కాలేదంటూ... చిరంజీవి చెప్పిన ఆడియో ట్విట్.. అ హాట్ టాపిక్ అయిపోయింది. అయితే మెగాస్టార్ చేసిన ఈ ట్విట్పై ఓ వైపు మెగా అభిమానులు, మరోవైపు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మనకు రాజకీయాలు వద్దు బాస్ అంటు కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ఫాదర్లోని డైలాగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఏదీ ఏమైనా చిరంజీవి చేసిన ఈ కామెంట్స్పై భిన్న అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయన్నది మాత్రం నిజం. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల అధినేతలు.. తమ పార్టీల విజయం కోసం.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
అలాంటి వేళ.. మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి కామెంట్స్... అదీ రాజకీయంపై చేయడం పట్ల రాజకీయ పరిశీలకులు సైతం తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి... 2009 ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 18 సీట్లు కైవసం చేసుకొంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన తన పార్టీని హస్తం పార్టీలో విలీనం చేశారు. ఆ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టి... కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగారు. అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా జరిగారు.
మరో వైపు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా థియేటర్ల టికెట్ల ధరలను భారీగా తగ్గించింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్తో తాడేపల్లిలో చిరంజీవి భేటీ అయ్యారు. దాంతో చిరంజీవికి మళ్లీ రాజ్యసభ టికెట్ అంటూ పెద్ద ప్రచారమే జరిగింది. దీంతో చిరంజీవి.. స్వయంగా మీడియా ముందుకు వచ్చి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని విస్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ట్విట్టర్లో వదిలిన ఆడియో.. ఆయన తాజాగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించినవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chiru-sensational-audio-tweet-shakes-social-media-39-144112.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.