Publish Date:Feb 13, 2020
వైసీపీలో రాజ్యసభ రేస్ మొదలైంది. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. అసెంబ్లీలో పార్టీల బలాబలాల ప్రకారం ఆ నాలుగు సీట్లూ అధికార వైసీపీకే దక్కనున్నాయి. దాంతో, రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకునేందుకు పలువురు పోటీ పడుతున్నారు. అయితే, ఖాళీ అవుతోన్న ఆ నాలుగు స్థానాల్లో మూడింటికి ఆల్రెడీ అభ్యర్ధులు ఖరారైనట్లు తెలుస్తోంది. నాలుగో అభ్యర్ధి ఎంపికపైనే తర్జనభర్జనలు జరుగుతున్నాయంటున్నారు. అయితే, మొదట్లో వినబడిన పేర్లు ఇఫ్పుడు సైడైపోయాయి. ఎందుకంటే, ఇటీవల పార్టీలో చేరిన బీద మస్తాన్ రావు, అలాగే గోకరాజు గంగరాజు తనయుడు గోకరాజు రంగరాజుకి రాజ్యసభ సభ్యత్వాలు దాదాపు ఖరారైనట్లు మొదట్లో ప్రచారం జరిగింది. అలాగే, మూడో అభ్యర్ధిగా అయోధ్యరామిరెడ్డి పేరు ఫైనలైజ్ చేశారని అన్నారు. ఇక, నాలుగో సీటును ఎస్సీలకు కేటాయిస్తారని లీకులిచ్చారు. అయితే, ఇఫ్పుడు పాధాన్యతాక్రమం మారిపోయింది. వైసీపీకి దక్కనున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో.... ఒకటికి రెడ్డికి... మరొకటి కాపుకి... అలాగే, మూడోది కమ్మకి... నాలుగోది దళితులు లేదా వెలమ లేదంటే ముస్లింలకు ఇవ్వాలనే జగన్ ఆలోచనగా చెబుతున్నారు.
ముఖ్యంగా, కాపు కోటాలో మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధిస్తున్న చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా పవన్ కల్యాణ్ కు చెక్ పెట్టొచ్చన్నది వైసీపీ ఆలోచనగా తెలుస్తోది. ఇక, కమ్మ కోటాలో... సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ కు రాజ్యసభ సభ్యత్వం దక్కొచ్చని అంటున్నారు. ఇటీవల తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి జాస్తి చలమేశ్వర్ కలవడంతో అతనికి రాజ్యసభ సభ్యత్వం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇక, రెడ్డి కోటాలో బడా పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి పేరు మొదట వినిపించినా, ఇఫ్పుడు సడన్ గా మెగా కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇక, నాలుగవది ఎవరో తేల్చాల్సి ఉంది.
అయితే, అవగాహనలో భాగంగా బీజేపీకి రెండు రాజ్యసభ సీట్లను కేటాయిస్తే మాత్రం ఈ లెక్కల్లో తేడాలు వచ్చే అవకాశముంది. ఒకవేళ, ఎన్డీఏలో వైసీపీ చేరితే రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయని, ఒకటి రెడ్డికి... రెండోది ఎస్సీకి కేటాయిస్తారని అంటున్నారు. అదే జరిగితే, వైసీపీకి దక్కనున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chiranjeevi-likely-to-be-elected-to-rajya-sabha-from-ycp-25-94221.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.