ఇక చిరంజీవి శల్యసారధ్యం చేయనున్నారా

Publish Date:Feb 25, 2014

Advertisement

 

స్వర్గీయ నందమూరి తారక రామారావు సినీ రంగం నుండి రాజకీయాలలోకి ప్రవేశించి, తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలోనే తన పార్టీని తిరుగులేని మెజార్టీతో ఎన్నికలలో గెలిపించుకొని ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసించారు. తెలుగువాడి పౌరుషం డిల్లీ పెద్దలకు రుచి చూపించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడి, యావత్ ప్రపంచమూ తెలుగుజాతిని గుర్తించేలా చేసారు. తెలుగుజాతికి నిలువెత్తు ప్రతీకగా నందమూరి నిలిచారు. అదేవిధంగా తన కటోర పరిశ్రమతో సినీ రంగంలో సమున్నత స్థానానికి ఎదిగి, మెగా స్టార్ గా ప్రజల చేత నీరాజనాలు అందుకొన్న చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయిపోదామని ప్రయత్నించారు. కానీ, అది పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లయింది. తన స్వగ్రామంలో కూడా గెలవలేని దుస్థితి. ఆ తరువాత ఆయన రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే.

 

ఆయన పదవీ పరంగా పైకి ఎదుగుతుంటే, గత రెండేళ్లుగా ఆయన వేసే ప్రతీ అడుగుతో ఆయనకున్న ప్రజాభిమానం అదఃపాతాళానికి పడిపోతోంది. ప్రజలు ఊహించిన చిరంజీవి వేరు. కంటికెదురుగా కనబడుతున్న చిరంజీవి వేరు అన్నట్లు తయారయ్యారు ఆయన. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతిని, వారి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు డిల్లీ పెద్దలతో డ్డీకొంటే, చిరంజీవి మంత్రి పదవి కోసం, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని సోనియాగాంధీ కాళ్ళ ముందు పెట్టేశారు. ఈ విషయంలో కేవలం ఆయనొక్కడినే తప్పు పట్టనవసరం లేదు. ఆంధ్ర, తెలంగాణా కాంగ్రెస్ నేతలు అనేక మంది ఆపని ఎప్పుడో చేసారు. ఇంకా చేస్తున్నారు కూడా. వారిలో చిరంజీవి కూడా ఒక్కరు.

 

ఒకప్పుడు మెగా స్టార్ గా కోట్లాది ప్రజల నీరాజనాలు అందుకొని, ప్రజా రాజ్యం పార్టీ అధినేతగా అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులను శాసించిన చిరంజీవి, కాంగ్రెస్ పట్ల, సోనియా, రాహుల్ గాంధీల పట్ల చూపిన వినయ విదేయతలకు మెచ్చి ఆయనను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేందుకు సోనియమ్మ అనుగ్రహించినట్లు తాజా సమాచారం. ఆయనకున్న ప్రజాకర్షణను ఉపయోగించుకొని ప్రజలలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేఖతను అధిగమించి ఎన్నికల గండం గట్టెక్కాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఆయనను ముఖ్యమంత్రిని చేసినట్లయితే ఎన్నికలలో కాపు కులస్థుల ఓట్లు అన్ని గంపగుత్తగా తమకే పడిపోతాయని కాంగ్రెస్ అడియాసకు పోతోంది. అయితే గతంలో ఆయన పార్టీ పెట్టిన్నపుడు ఆయనను నమ్ముకొని వెళ్ళిన వారందరి పరిస్థితి ఏమయిందో, ఆ తరువాత ఆయన తను రాజకీయంగా ఏవిధంగా పైకెదిగేరో, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం రాష్ట్ర విభజన వ్యవహారంలో కోట్లాది సీమాంధ్ర ప్రజల మనోభావాలను కించపరుస్తూ వారి ఆత్మగౌరవాన్ని ఏవిధంగా సోనియమ్మ పాదాల చెంతపెట్టారో కళ్ళార చూసిన తరువాత కూడా ప్రజలు, ఆయన అభిమానులు, ముఖ్యంగా కాపు కులస్తులు ఆయనని చూసి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని భావించడం అడియాసే అవుతుంది.

 

కానీ, కాంగ్రెస్ పార్టీలో ఆమాత్రమయిన ప్రజాకర్షణ గల నేత మరొకరు లేకపోవడంతో ఆయనకి అదృష్టం కలిసివచ్చిందని అనుకోకతప్పదు. అయితే, గత ఎన్నికలలో స్వంత పార్టీనే గెలిపించుకోలేక చతికిలపడిన ఆయన చేతిలో అవసాన దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పెట్టాలనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశః ఆయన విదేయతకు మెచ్చి కేవలం మిగిలిన ఈ మూడు నెలల కోసం మాత్రమే ఆయనను ‘తీన్ మైనే కా సుల్తాన్’గా చేసి, కాంగ్రెస్ అదృష్టం బాగుండి ఎన్నికలలో గెలిస్తే అప్పుడు శాశ్విత ముఖ్యమంత్రిగా సమర్డుడైన మరొక నేతని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందేమో. ఎప్పుడు కావాలంటే అప్పుడు పదవిలో నుండి తప్పుకొనేందుకు సిద్దంగా ఉండే మన్మోహన్ సింగుని ప్రధానమంత్రిగా నియమించుకొని రాహుల్ గాంధీ కోసం ప్రధాని కుర్చీని రిజర్వ్ చేసుకొన్నట్లే, ఇప్పుడు చిరంజీవిని కూడా ఎంపిక చేసి ఉండవచ్చును. ముఖ్యమంత్రి కుర్చీలో ఒక్కరోజయినా కూర్చోవాలని తపించిపోతున్న చిరంజీవికి ఊహించని ఈ పరిణామాలు ఒక వరంగా మారడంతో “అధిష్టానం ఆదేశిస్తే ఏ బాధ్యతయినా శిరసావహించేందుకు సిద్దంగా ఉన్నానని” ఒక స్టాండర్డ్ రాజకీయ డైలాగు పలికి, “కుర్చీలో కూర్చొనేందుకు తన రెడీ” అని ఆయన కూడా ప్రకటించేశారు.

 

ఏమయినప్పటికీ, కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు ఇంకా దృవీకరించవలసి ఉంది. ఒకవేళ ఆయననే ముఖ్యమంత్రిగా ఎంచుకొంటే అది ప్రతిపక్షాలకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎన్నికలలో తప్పకుండా కలిసివస్తుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.