పాపం శంకర్ దాదా..కాంగ్రెస్ పార్టీ

Publish Date:Apr 26, 2014

Advertisement

 

“పాపం! ఈ చిరంజీవికి రాజకీయ అవగాహన ఎప్పటికి కలుగుతుందో.. అసలు ఎప్పటికయినా కలుగుతుందో లేదో...”అని ఆయన ప్రసంగాలు విన్న ప్రతీసారి సీమాంధ్రలో ప్రజలు జాలిపడుతుంటారు. ఆయన గత ఐదేళ్ళుగా రాజకీయాలలోనే ఉన్నప్పటికీ, దేశముదురు కాంగ్రెస్ నేతలతో భుజాలు రాసుకు తిరుగుతున్నపటికీ, ఆయన రాజకీయంగా ఇంకా ‘మెచ్యూర్’ అవలేదని రాజకీయ విశ్లేషకులే కాదు ప్రజలు కూడా భావిస్తున్నారు.

 

మొన్న మచిలీపట్నంలో కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నపుడు ఆయన మోడీని హిట్లర్ అన్నందుకు అక్కడి ప్రజలు కొందరు ఆయనని కోడిగుడ్లతో సన్మానం చేసారు. అయినప్పటికీ రోట్లో తల పెట్టిన తరువాత ఇక రోకటి పోటుకి భయపడటం ఎందుకన్నట్లు, కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నపుడు ప్రత్యర్ధులను విమర్శించక తప్పదని, ఈసారి తెదేపా, వైకాపా, బీజేపీలను విమర్శించి తన రాజకీయ అజ్ఞానాన్ని మరో మారు బయటపెట్టుకొన్నారు ఆ మెగాజీవి.

 

తెదేపా-బీజేపీలది అనైతిక బందమని ఆయన విమర్శించారు. అయితే తాము తెరాస, వైకాపాలతో రహస్య ఒప్పందాలు చేసుకొంటే అది నైతికం, తెదేపా-బీజేపీలు బహిరంగంగా పొత్తులు పెట్టుకొని కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేస్తుంటే అది అనైతికమని చిరంజీవి చెప్పడం హాస్యాస్పదం. తెదేపా, వైకాపాలకు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లేనని ఆయన మరో కొత్త విషయం కనిపెట్టి, దానిని ప్రజలకు చాటి చెప్పారు. తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొనే పోటీలో దిగి, ఎన్నికల తరువాత కూడా కలిసేపనిచేస్తామని వారే విస్పష్టంగా చెపుతున్నపుడు, చిరంజీవి ఈ విషయం కొత్తగా కనిపెట్టినట్లు చెప్పడం నవ్వు కలిగిస్తుంది.

 

వైకాపా విషయంలో కూడా తన రాజకీయ అవగాహనా రాహిత్యం ప్రదర్శించుకొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన లగడపాటి, రాయపాటి, కిరణ్ కుమార్ రెడ్డి వంటి అనేకమంది నేతలు తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య రహస్య అవగాహన ఉందని కుండబ్రద్దలు కొట్టినట్లు చెపుతున్న సంగతి ఆయనకు తెలియదనుకోవాలా? తెలిసి నటిస్తున్నారనుకోవాలా?

 

అయితే జగన్ తనపై ఉన్న కేసుల నుండి విముక్తి పొందేందుకు ఎన్నికల తరువాత ఏ కూటమి అధికారంలోకి వస్తే దానికే మద్దతు తెలుపుతారని ఎవరయినా ఊహించగలరు. అయితే జగన్ ఇప్పుడు మోడీని తిట్టడం లేదు కనుక ఆయన బీజేపీకి మద్దతు తెలుపుతారని చిరంజీవి చెప్పడం చూస్తే, తమ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోదని ఆయనే స్వయంగా దృవీకరిస్తున్నట్లుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఆయనకు నమ్మకముంటే, తమ పార్టీతో రహస్య అవగాహన ఉన్న జగన్ బీజేపీకి మద్దతు ఇస్తారని చెప్పిఉండరు. కానీ, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాదని అర్ధమయిందో ఏమో జగన్ బీజేపీకి మద్దతు ఇస్తాడని ప్రకటించేశారు.

 

ఇక రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంద్రాలో తమ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో స్వయంగా చూస్తూ కూడా ఆయన చంద్రబాబుకి ఇవే ఆఖరి ఎన్నికలని, జగన్ కేసుల మాఫీ కోసమే పోరాడుతున్నారని అనడం గురువింజ గింజ సామెత జ్ఞప్తికి తెస్తుంది.

 

ఈసారి ఆంధ్ర, తెలంగాణా మరియు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని దాదాపు ఇప్పటికే ఖరారు అయింది. సీమాంద్రాలో వస్తే తెదేపా లేకపోతే వైకాపాలే అధికారంలోకి వస్తాయి తప్ప కాంగ్రెస్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అధికారంలోకి రాదని, రాలేదని సీమాంద్రా అంతటా పర్యటిస్తున్న చిరంజీవికి ఈపాటికి అర్ధమయ్యే ఉండాలి. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసి అక్కడేదో బావుకొందామని చూస్తే అక్కడా ఏటికి ఎదురీదక తప్పడంలేదిప్పుడు. ఎన్నికల తరువాత మళ్ళీ కేసీఆర్ దయతలిస్తే, ఆయన పార్టీకి మద్దతు ఇచ్చో , పుచ్చుకోనో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొనే పరిస్థితిలో ఉంది కాంగ్రెస్.

 

ఇదంతా తెలిసి కూడా చిరంజీవి శంకర్ దాదాలాగా ఇంత అమాయకత్వం ఒలకబోసేస్తుంటే ఎవరికయినా నవ్వు రాకమానదు.

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.