చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళారా? లేక అనారోగ్యంతో విధులకి దూరంగా ఉంటున్నారా? తెలియరావడం లేదు. మే 21 నుంచి జూన్ 5 వరకూ జింగ్ పింగ్ కనపడలేదు. అధికార కార్యక్రమాలకీ హాజరవ్వలేదు. అయితే అనారోగ్యంతో ఉండడం వల్ల.. రెండు వారాలు విశ్రాంతి తీసుకుని ఉండవచ్చని భావించారు. జూలై 6,7 వ తేదీలలో బ్రెజిల్ లో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి జింగ్ పింగ్ హాజరు కావడం లేదని చెప్పడంతో.. అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. జీ జింగ్ పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి బ్రిక్స్ సమావేశానికి హాజరువుతూ వస్తున్నారు. తొలిసారిగా ఆయనీ బ్రిక్స్ సమావేశానికి గైర్హాజరువుతున్నారు.
జీ జింగ్ పింగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కి జనరల్ సెక్రటరీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్ కి చైర్మన్ గానూ వ్యవహారిస్తున్నారు. చైనా లో అధికార మార్పిడి జరగబోతున్నదా? లేక ఇప్పటికే అధికార మార్పిడి జరిగిపోయిందా? అన్నదొక చర్చ. ప్రస్తుతం చైనాలో జనరల్ ఝాంగ్ యుజియానే అధికారం చెలయిస్తున్నట్టు తెలుస్తోంది. జనరల్ ఝాంగ్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కి వైస్ చైర్మన్ గా ఉన్నారు. జనరల్ ఝాంగ్ 24 మంది సభ్యులు గల.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు. సెంట్రల్ కమిటీలో సీనియర్ మెంబర్స్ మద్దతు జనరల్ ఝాంగ్ యుజీయ కి బలంగానే ఉంది. సెంట్రల్ కమిటీ లో సీనియర్ సభ్యులలో చాలా వరకూ మాజీ అధ్యక్షుడు హు జింటావో అనుచరులున్నారు.
సెంట్రల్ కమిటీ లో మెజారిటీ సభ్యుల మద్దతు ఝాంగ్ యుజియా కి ఉంది కాబట్టి అధికార మార్పిడి జరిగి ఉండవచ్చనే అనుమానాలకి మరింత బలం చేకూరుతోంది. సెంట్రల్ కమిటీ లోని సీనియర్ సభ్యులు మాజీ అధ్యక్షుడు హు జింటావో మద్దతుదారులు కావడం వల్ల జింగ్ పింగ్ కి వీరంతా వ్యతిరేకంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు. చైనా లోని పాఠశాల విద్యార్థులకు జింగ్ పింగ్ పాఠాలు చెబుతున్నారు. చైనా పాఠశాల పుస్తకాల్లో జింగ్ పింగ్- ఆలోచనలు అనే పేరు మీద విద్యార్థులకి పాఠాలు నేర్పుతున్నారు. ఇదే సెంట్రల్ కమిటీ లోని సీనియర్ సభ్యులకి నచ్చడం లేదట. ఇప్పటికే మావో- ఆలోచనల పేరిట పాఠాలు చెబుతుండగా కొత్తగా ఈ జిన్ పింగ్ ఆలోచనలేంటన్నదొక ప్రశ్న.
అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి జిన్ పింగ్ అటు మిలిటరీలో, ఇటు ఆర్ధిక విధానాలకు సంబంధించి తన అనుచరులకే పెద్ద పీట వేస్తూ వచ్చారు. నిజానికి జింగ్ పింగ్ అనుచరుల కంటే అనుభవం, నాలెడ్జ్ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. వీరందరినీ కాదని తన అనుచరులకే ఆయన కీలక బాధ్యతలు అప్పగించడం సెంట్రల్ కమిటీ సీనియర్ సభ్యుల ఆగ్రహానికి మరో కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ ని తుదుపరి చైనా అధ్యక్షుడిగా జింగ్ పింగ్ ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు.. గత కొంత కాలంగా! ఇది కూడా సెంట్రల్ కమిటీ సభ్యులకి నచ్చలేదని అంటారు. వాంగ్ యాంగ్ అంత సమర్థుడైన విదేశాంగ మంత్రి కాదన్నది వీరి అభిప్రాయంగా తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/china-president-25-201121.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.