రాజ్యసభలో చిదంబర రహస్యం

Publish Date:Aug 13, 2013

Advertisement

 

 

.....సాయి లక్ష్మీ మద్దాల

 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తో కేంద్రం ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం రాజ్యసభలో తేల్చి చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తేదీని తాను ఖచ్చితంగా చెప్పలేనన్నారు. తెలంగాణా అంశాన్ని తొమ్మిదేళ్ళుగా నానబెట్టిన కాంగ్రెస్ ఎన్నికల వేళ రాజకీయ లబ్ధికోసమే హడావిడిగా నిర్ణయం తీసుకుందన్న విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నంలో 2009 లో తెలంగాణా పై ప్రకటనను ఉపసంహరించుకుంటూ ఆనాడు అన్ని పార్టీలు 'యు టర్న్'తీసుకున్నాయని చెప్పారు. మరి ఈనాడు మరల 'యూటర్న్'తీసుకోమని ఏ పార్టీ అయిన ఆయనకు హామీ యిచ్చిందా ఈ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పవలసి ఉంది. ఎలాంటి కసరత్తు చేయకుండా తెలంగాణా పై ప్రకటన చేసారన్న విమర్శలకు సమాధానంగా శ్రీకృష్ణ కమిటీ వేసి చాలా కసరత్తు చేశామని చెప్పారు. కానీ శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ. దాని మీద కేంద్ర మంత్రి వర్గం లో కాని,పార్లమెంట్ లో కాని ఎటువంటి చర్చ జరగలేదు. వాస్తవానికి ఆ కమిటి చివరి అంశంగా తెలంగాణా గురించి ప్రస్తావిస్తూ అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వారి సమ్మతితో విభజన చేయాలని చెప్పింది. కానీ విభజన ప్రక్రియ ఆ ప్రకారంగా జరగలేదు. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో మొదటగా చెప్పిన 5 అంశాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనే విషయాన్ని స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పవలసి ఉంది.



ఎన్.డి.ఎ  ప్రభుత్వం గురించి  మాట్లాడుతూ ఆనాటి కేంద్ర హోం మంత్రిగా ఉన్న అద్వాని విభజన తనకు సమ్మతంగా లేదని చెప్పారని రాజ్యసభలో చిదంబరం అన్నారు. మరి నేడు బి.జె.పి సహకారంతో విభజన చెయ్యటానికి ఏ విధంగా ముందుకు వచ్చారో చిదంబరం చెప్పాలి. 2009 నాడు ప్రకటనను వెనకకు తీసుకున్నప్పటికీ నేడు మరల ప్రకటన చేయటానికి పరిస్థితులలో  మార్పు ఏమి వచ్చింది అనేది స్పష్టంగా చెప్పవలసి ఉంది. సి.డబ్ల్యు. సి  నిర్ణయం అంతిమ నిర్ణయం అని ప్రకటిస్తున్న కాంగ్రెస్ పెద్దలు 2001 లో సి.డబ్ల్యు.సి తీసుకున్న రెండవ ఎస్. ఆర్. సి నిర్ణయం ఏమైందో చెప్పాలి. రాష్ట్ర విభజన లాంటి అతి ముఖ్యమైన విషయాలు పార్లమెంట్ లో ప్రధాని ప్రకటించాలి. చిదంబరం ఎందుకు చేస్తున్నారు?అన్నిటికి మించి ఇప్పుడు కొత్తగా ఆంటోని కమిటీ అది కూడా పార్టీ కమిటీ వేశామని చెబుతున్నారు. ఏదైనా చెప్పుకునేది ఉంటె ఆ కమిటీతో చెప్పుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రత్యేక పార్టీ కమిటీ ఎవరిని బుజ్జగించటానికి నేతలనా,ప్రజలనా?

By
en-us Political News

  
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.