చెవిరెడ్డి భాస్కర్రెడ్డి.. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ కొనసాగుతున్నకొద్ది.. ఆయన మరింత కూరుకు పోతున్నా రనిపిస్తోంది. ఈ స్కామ్లోని సొమ్ము తరలింపులో చెవిరెడ్డి భాస్కరరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిం చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరు చెవిరెడ్డి అనుచరులే. బాలాజీ కుమార్ యాదవ్, నవీన్కృష్ణను సిట్ అధికారులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
చెవిరెడ్డి అరెస్ట్కంటే ముందే వీరిద్దరూ అజ్ఞాతంలోకి జారుకున్నారు. వీరికి కొందరు బడా నేతలు డబ్బులు సమకూర్చి ఇతర రాష్ట్రాలకు పంపించినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి వీరిద్దరూ పరారీలోనే ఉన్నారు. ఎట్టకేలకు ఇప్పుడు పట్టుబడ్డారు. ఇప్పుడు వీరిద్దరితో కలుపుకుంటే ఈ కేసులో అరెస్ట్ల సంఖ్య 11కు చేరుకుంది. ఇప్పుడీ కేసులో వీరిద్దరు నోరు తెరిస్తే చెవిరెడ్డి మరింత ఇరుక్కుంటారనే చర్చ నడుస్తోంది.
రాజ్ కెసిరెడ్డి బృందం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన మద్యం ముడుపుల సొమ్మును చెవిరెడ్డి చెప్పిన చోటకు చేర్చేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు చేర్చడంలో వీరిద్దరిదీ కీలక పాత్ర అంటున్నారు. దానికి సంబంధించి ఆధారాలు దొరకడం వల్లే సిట్ అధికారులు వారిని అరెస్టు చేశారు.
ఇలా రోజురోజుకు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోవడంతో చెవిరెడ్డిలో ఫ్రస్టేషన్ పెరుగుతోందనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో జైలు వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హల్ చల్ చేశారు. సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో.. తనపై తప్పుడు కేసులు పెట్టారని అరుస్తూ బయటకు వచ్చారు చెవిరెడ్డి. ఎవ్వరినీ వదిలేది లేదంటూ హెచ్చరించారు. చెయ్యని తప్పునకు శిక్ష అనుభ విస్తున్నా అంటూ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇవేవీ అధికారులు పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపించడం లేదు. చెవిరెడ్డి అంతలా ఊగిపోతున్నా పోలీసులు ఆయన్ని బలవంతంగా వ్యానులోకి ఎక్కించి తరలించారు. తన కీలక అనుచరులు వరుసగా దొరికి పోతుండటంతో చెవిరెడ్డి ఫ్రస్ట్రేషన్తో ఉన్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆ క్రమంలో త్వరలో ఈ కేసులో ఎవరెవరున్నారో.. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు? చెవిరెడ్డికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు పోలీసులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chevireddy-bhaskarreddy-in-frustration-25-201075.html
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.