అక్షరాలు గుండ్రంగా రాయడం అందరికీ అంత సులభంగా వచ్చే కళ కాదు. చిన్నపుడు స్కూల్లో కాపీ రైటింగ్ పేర టీచర్లు పిల్లలకు పెద్ద శిక్షే వేసేవారు. ఎవరు గుండ్రంగా రాస్తే వారికి క్లాసులో గౌరవం, లీడర్ అయ్యే అవకాశాలుండేవి. అదో పెద్ద హోదా. తెలుగు టీచర్లకు అక్షరాలు గుండ్రంగా రాసే వారంటే మహాయిష్టం. బాల్యంలో ఇంత ప్రాధాన్యతిచ్చిన హ్యాండ్ రైటింగ్కి క్రమేపీ పెద్ద చదువుల్లోకి వెళ్లగానే అంత ప్రాధాన్యత కనపడదు. ఫలితంగా చేతికి వచ్చిన విధంగా వేగంగా రాసే యడం అలవడి అదే పద్ధతి వృత్తి, ఉద్యోగాల్లోనూ కొనసాగిస్తూంటాము. ఇది తప్పు కాదు. కానీ ఆ అలవాటు డాక్టర్ వృత్తి లో ఉన్నవారికే మరీ ఇబ్బంది.
ఏదో చిన్నజ్వరంతోనో, పెద్ద ఆరోగ్య సమస్యతోనో వీధి చివర్నున్న డాక్టర్ దగ్గరికో, ఆస్పత్రికో వెళతాం. మన సమస్య వివరిస్తాం. డాక్టర్ వీలయినంతగా పరీక్ష చేసి పెన్ను పట్టి కాయితం మీద వీలయినంత వేగంగానో, వీలయినంత నెమ్మదిగానో మందులు రాసిస్తారు. అది చూస్తే చైనా, జపాన్ భాషల్లో ఏదో రాశా డనే ఫీలింగ్ వచ్చి పేషెంట్లు విసుక్కోవచ్చు. ఎందుకంటే ఆ మందుల పేర్లు ఆయన రాసిన విధానంలో బొత్తిగా అర్ధంగావు గనుక. దాన్ని చదివే బ్రహ్మ ఒక్కడే.. అతగాడే మందుల దుకాణంవాడు. అతనికి డాక్టర్కి వున్న అక్షరాలను అర్ధంచేసుకునే లింకు మనబోటివారికి ఎవ్వరికీ అర్ధం కాదు. కానీ అతగాడు టెన్త్ చది వినా, ఎంబీబీఎస్ రాసిన కాయితాన్ని అమాంతం చేతిలోంచి లాక్కుని అదే వేగంగా వాటిపేర్లు చదువుతూ అసిస్టెంట్ చేత తీయించి బిల్లు ఇంతయిందని అంటాడు.
అప్పటిదాకా ఏదో మంత్రాలు విన్నట్టే ఉం టుంది. అంత చదువుకున్నవాడు ఛండాలంగా రాసింది అంతగా చదువుకోని వాడు ఎలా అర్ధంచేసుకు న్నాడు? అనే సందేహంతోనే ఊగిసలాడుతూ ఇల్లు చేర తాం. అదే చిత్రం. మందుల పేర్లు దుకాణం వాడి కి కంఠతా ఉంటాయా? ఫలానా డాక్టర్ ఫలానా ఆరోగ్య సమస్యకి ఫలానా మందులే రాస్తాడన్న అపూర్వజ్ఞానం కలిగి ఉండడమేనా? బహుశా అదే అయి ఉంటుంది.
ఏమయినప్పటికీ, చిన్నప్పటి టీచర్ల బెత్తం దెబ్బలు ఇపుడు తడుముకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు అన్ని తిట్లు, దెబ్బలు తిని నేర్చుకున్న బహుచక్కని రాత క్రమేపీ తగలడిందేమిటా అని! గుండ్రంగా చూడముచ్చటగా రాయడం జీవితాంతం ఆ నేర్పు కలిగి ఉండేవారు తక్కువమందే ఉంటారు. ప్రొఫెషన్ని అనుసరించి రాయడంలో వేగం పుంజుకుని అక్షరాలు అవతలివారికీ అర్ధం కావాలన్న ధ్యాసపోతోంది. టెన్త్పరీక్షల్లో గుండ్రంగానే రాయాలి, మందులు రాసే డాక్టర్ గుండ్రం గానే రాయాలి. కానీ ఈ రెండు ఎన్నడూ ఒకే పంథాలో జరగవు. దీన్ని గురించే ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒక ట్వీట్ కూడా చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/changing-styles-of-handwriting-25-143310.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.