Publish Date:Oct 15, 2019
బిర్లా ప్లానిటోరియం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంత కాలం ఇమేజ్ షోస్ తో సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించి ఆకట్టుకున్న బిర్లా సైన్స్ సెంటర్ డిజిటలైజేషన్ లోకి మారిపోయింది. పరిశోధనాత్మక పద్ధతులో దూసుకుపోతోంది. భారత్ ను ప్రపంచ దేశాల సరసన నిలిపిన ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగాన్ని గ్రాఫిక్ పద్ధతిలో ప్రదర్శించింది. పాత విధానానికి స్వస్తి పలుకుతూ ఆధునిక పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఆకాశం, నక్షత్రాలు, రోదసీ, గ్రహణాలపై సైంటిఫిక్ కోణంలో విశ్లేషిస్తూ భావిభారత తరాలకు విజ్ఞానాన్ని పంచుతుంది బిర్లా ప్లానిటోరియం.
ఖగోళంలో జరిగే మార్పుల్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తూ అన్ని వయసుల వారికి సైన్స్ పై ఆసక్తి పెంచుతోంది. వివిధ భాషల్లో వివరిస్తూ చూపించే విజువల్స్ బిర్లా ప్లానిటోరియంకి దేశ వ్యాప్తంగా గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక ముందు చంద్రయాన్ లాంటి ఉపగ్రహ ప్రయోగాల్ని డిజిటల్ రూపంలో మరింత నూతనంగా అదిస్తోంది బిర్లా ప్లానిటోరియం. గతంలో కేవలం ఫొటోల సాయంతో చూపించి సైన్స్ పై ఆసక్తిని పెంచేది, ఇప్పుడు విజువలైజేషన్ లో వచ్చిన మార్పుల్ని అందిపుచ్చుకుంది ప్లానిటోరియం.
పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ ఆధునిక పద్ధతిలో డిజిటలైజేషన్ ను ఇవన్ సన్ సదరన్ లాండ్స్ యూయస్ఏ నిర్మించిన పవర్ ఫుల్ డిజిటల్ సిస్టమ్ ను బిర్లా ప్లానిటోరియం నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. విక్రమ్ లాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే అద్భుత క్షణాలని డిజిటలైజేషన్ ద్వారా ప్రదర్శించాయి, చంద్రయాన్-2 ప్రయోగం తొలి నుంచి చంద్రుడిపై దిగే చివరి దృశ్యం హోవరింగ్ స్టేజ్ అని అంతిమ దశ వరకు ఇందులో పొందుపర్చారు. నలభై ఐదు నిమిషాల పరిశోధనాత్మక డిజిటలైజేషన్ చంద్రయాన్-2 షోను తెలంగాణ గవర్నర్ తమిళ సాయి సౌందర్ రాజన్ ప్రారంభించారు.
చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి డిజిటల్ ప్రోగ్రాం కళ్లకు కట్టినట్టుగా చూపించారని గవర్నర్ ప్రశంసించారు. పదిహేనేళ్లుగా తాము చేస్తున్న ఆలోచనలు ఈనాటికి కార్యరూపం దాల్చాయని బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ సిద్దార్థ తెలిపారు. ఇకపై రాబోయే రోజుల్లో డిజిటలైజేషన్ కు అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారాయన. మొత్తం మీద ఇవాన్ సన్ సదరన్ లాండ్స్ యు.ఎస్.ఎ నిర్మించిన ఈ పవర్ ఫుల్ డిజిటల్ సిస్టమ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అన్ని వయసుల వారినీ ఆకట్టుకునేలా నలభై ఐదు నిమిషాల షోను ప్రదర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrayaan-2-journey-to-moon-show-at-birla-planetarium-25-90089.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.