త్తరాంధ్రలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు జనం బ్రహ్మరథం పట్టారు. బాదుడే బాదుడు నిరసనలో పాల్లొనేందుకు శ్రీకాకుళం జిల్లా దళ్లవలసకు వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయంలో దిగింది మొదలు చంద్రబాబుకు జనం నీరాజనం పలికారు. సీఎం..సీఎం అంటూ నినాదాలు చేయడం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో సర్కార్ లేదన్న తమ భావనను ఎలుగెత్తారు. గత ఎన్నికలలో ఎక్కడైతే జగన్ దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పని చేసిందో అక్కడే జగన్ కు జనం నీరాజనం పలకడం గమనార్హం. ఈ పర్యటనలో బాబుకు దక్కిన ఘనస్వాగతం చూస్తే..జగన్ కు చుక్కలు కనిపించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
స్వతహాగా తెలుగుదేశంకు గట్టి పట్టున్న ఉత్తరాంధ్రలో గత ఎన్నికలలో జగన్ హవా వీచింది. ఒక్క చాన్స్ అంటూ జనంలోకి వచ్చిన జగన్ ను అప్పుడు జనం విశ్వసించారు. అయితే మూడేళ్ల పాలన అనంతరం సీన్ రివర్స్ అయ్యింది. ఆ విషయం బాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రస్ఫుటంగా కనిపించింది. బాబు రాకతో తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.
ఇక దళ్ల వలసలో బాదుడే బాదుడు నిరసన సభలో చంద్ర బాబు ప్రసంగానికి అడుగడుగునా స్పందన కనిపించింది.
వైసీపీ సర్కారు పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో దళ్లవలసలో బుధవారం రాత్రి జరిగిన నిరసనలో నారా చంద్రబాబునాయుడు ప్రసంగించారు. జగన్ పాలన వల్ల రాష్ట్రం మరో శ్రీలంక అవడం ఖాయమంటూ విమర్శలు గుప్పించారు. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఇప్పుడు జనం పశ్చాత్తాపపడుతున్నారి చంద్రబాబు చెప్పారు. అధికార బలం, అహంకారంతో జగన్ విర్రవీగుతున్నారని చంద్రబాబు తూర్పారపట్టారు. తన ఇంటిపై దాడి చేసిన వైసీపీ నేతలు.. అసెంబ్లీలోనే తనను అవమానపరచారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తన కుటుంబ సభ్యులను కూడా అవమానపరచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కంటే కూడా జగన్ డేంజర్ అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ప్రసంగానికి జనంలో మంచి స్పందన కనిపించింది. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలను భారీగా పెంచారని, విద్యుత్ ఉండదు గానీ బిల్లులు మాత్రం బాదుడే బాదుడు మాదిరిగా ఉన్నాయన్న ఆయన ఆరోపణలకు జనం నుంచి మంచి స్పందన లభించింది.
జగన్ మాదిరిగా తాను దోచుకోనూలేదు, దాచుకోనూ లేదని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తం మీద చంద్రబాబు బాదుడే బాదుడు నిరసన సభ విజయవంతం కావడం పట్ల తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. బాబు సభకు జన స్పందన చూస్తే తెలుగుదేశం దూకుడు జగన్ పార్టీనీ, ప్రభుత్వాన్నీ బెంబేతెత్తించడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-uyyarandhra-tour-successfear-mounts-in-jagan-25-135443.html
Publish Date:Mar 12, 2026
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.