ఆ జిల్లా టీడీపీ కార్యకర్తలకు అసలేమైంది?.. ఆశ్చర్యంలో ఉన్న చంద్రబాబు

Publish Date:Oct 16, 2019

Advertisement

 

రాజకీయ ప్రస్థానంలో పద్నాలుగేళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉండి, నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం సొంతం చేసుకున్న మన చంద్రబాబు ఇటీవల తెల్లవారుజాము వరకు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారట. వివరాళ్లోకి వెళ్తే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు చంద్రబాబు ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా సమీక్షలు అపాయింట్ మెంట్ లతో బిజీగా ఉండేవారు. కొత్త రాష్ట్రం కనుక కష్టపడాలని ధోరణిని చంద్రబాబు తన కార్యాచరణలో చూపించేవారు. అర్ధరాత్రి వరకు కూడా సమీక్షలు నిర్వహించిన సందర్భాలున్నాయి. ఈ హడావుడిలో పడి ఆయన టిడిపిని పూర్తిగా విస్మరించారని పార్టీ నేతలే చెబుతున్నారు. అప్పట్లో ఆయనను కలిసేందుకు కార్యకర్తలు వస్తే అపాయింట్ మెంట్ సులభంగా దొరికేది కాదట, చివరకు మంత్రులు కూడా గంటల తరబడి చంద్రబాబును కలవడం కోసం నిరీక్షించేవారు. ఆయన దర్శనం దొరకని వారు నిరాశతో వెనుదిరిగిన సందర్భాలు కూడా ఉండేవి. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరాజయం తర్వాత చంద్రబాబు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటున్నారు. 

తాజాగా ఆయన జిల్లాల వారీగా పార్టీ సమీక్ష నిర్వహించడం ప్రారంభించారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలో ఆయన సమీక్షలు నిర్వహించారు. విశాఖలో రెండ్రోజుల పాటు సమీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా మొదటి రోజు పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని మధ్యాహ్నం వరకు నిర్వహించారు. సాయంత్రం నాలుగైదు నియోజక వర్గాల సమీక్షలు చేపట్టారు. అవి పూర్తయ్యేసరికి సమయం రాత్రి పది గంటలు అయింది. ఇంకా రెండు మూడు నియోజక వర్గాల సమీక్షలు మిగిలిపోయాయి. దీంతో చంద్రబాబు రేపు ఉదయం సమీక్ష నిర్వహిద్దాం అని చెప్పినప్పటికీ కార్యకర్తలు అంగీకరించలేదు. ఎంత టైమైనా సమీక్షలు పూర్తి చేయాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఆయా నియోజక వర్గాల సమీక్షలు నిర్వహించారు చంద్రబాబు. పార్టీ అధినేత వైఖరి పట్ల కార్యకర్తలో వచ్చిన మార్పుకి ఇదొక నిదర్శనం అని చెప్పాలి. 

విశాఖపట్టణం టిడిపి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. విమానాశ్రయానికి చంద్రబాబు విచ్చేసినప్పుడు ఆయన ప్రయాణించిన దారి పొడవునా కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. ఈ పరిణామం చంద్రబాబుని కూడా ఉత్సహపరిచింది. సాధారణంగా చంద్రబాబే తెల్లవారుజాము వరకు సమీక్ష నిర్వహిస్తూ ఉంటారు. గతంలో అలాంటి పరిస్థితి వస్తే కార్యకర్తలు నేతలు విసుక్కునేవారు. కాని ఈ సారి రివర్స్ లో కార్యకర్తలే ఎంత ఆలస్యమైనా పర్వాలేదు. సమీక్షలు నిర్వహించాలని పట్టుబట్టడం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చ నీయాంశంగా మారింది. ఉదయం మళ్లీ పది గంటలకే సమీక్ష నిర్వహించాల్సి ఉండటంతో రాత్రి ఆలస్యమైతే ఇబ్బందులు ఎదురవుతాయని పార్టీ నేతలు కొందరు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. అయినా కార్యకర్తల మాత్రం వినిపించుకోలేదట. దీనికి తోడు ఒక నియోజక వర్గ సమీక్ష పూర్తయిన వెంటనే కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు చంద్రబాబుతో సెల్ఫీల కోసం ఎగబడటంతో అనూహ్య జాప్యం జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి విశాఖ టూర్ అక్కడి కార్యకర్తల జోష్ తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని స్పష్టమవుతోంది.
 

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.