గుంటూరులో చంద్రబాబు లెక్కలు.. వైసీపీకి తప్పవా తిప్పలు

Publish Date:Oct 1, 2018

Advertisement

గుంటూరు జిల్లా మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గుంటూరులో ఆది నుండి టీడీపీకి మద్దతుగా నిలుస్తోన్న బిసీలకు మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయంపై చంద్రబాబు బిసీలకు ఎక్కడ సీట్లు ఇవ్వాలో? ఎవరు అభ్యర్థులైతే బాగుంటుందో? చెప్పాలని ఆయనకు సన్నిహితుడైన ఒక ఎమ్మెల్యేను ఆదేశించారు. విద్యాధికులు,ప్రజల్లో మంచిపేరు ఉన్నవారిని ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో రేపల్లె, మంగళగిరి నియోజకవర్గాలను బీసీలకు కేటాయించారు. తాజాగా మాచెర్లలో బీసీ వర్గానికి చెందిన వారికి సీటు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. యాదవ సామాజికవర్గానికి చెందిన వారిని ఎంపిక చేసి వారిని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోబోతున్నారు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. అదేవిధంగా కేవలం 12 ఓట్లతో ఓడిపోయిన మంగళగిరి ఇన్‌ఛార్జి చిరంజీవిని మళ్లీ బరిలోకి దింపుతారా? లేదా అనేది స్పష్టత రావడం లేదు. ఆయన భార్యకు సీటు ఇస్తారా? చూడాల్సి ఉంది. చిరంజీవి సామాజికవర్గమైన పద్మశాలీలు అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ఇక్కడ యాదవ, పద్మశాలీలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో బీసీలకు అవకాశం దక్కబోతోంది.

 

 

అప్పట్లో ముస్లింలకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు వారికి ఒక చోట నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. గుంటూరు-1 ముస్లిం వర్గాలకు చెందిన వారిని బరిలోకి దించబోతున్నట్లు సమాచారం. అభ్యర్థి లాల్‌జాన్‌భాషా వారసులు లేక వేరేవారా? అనేది తెలియకపోయినా ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దించడం ఖాయమని తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన వైశ్య సామాజికవర్గానికి చెందిన వారిని బుజ్జగించేందుకు వారికి నర్సరావుపేట నుంచి అవకాశం కల్పించబోతున్నారు. తాజాగా బాపట్ల నియోజకవర్గ పరిస్థితిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టిసారించారు. నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారిలో మెజార్టీ ఓటర్లు వైసీపీకి మద్దతు ఇస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు.. రెడ్డి సామాజికవర్గానికి చెందని మాజీమంత్రి గాదె వెంకటరెడ్డికి టిక్కెట్‌ ఇవ్వాలని భావిస్తున్నా.. ఆయన తాను నిలబడలేనని, తన కుమారునికి అవకాశం ఇవ్వాలని కోరడంతో చంద్రబాబు తిరస్కరించారని ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో కాపు సామాజికవర్గానికి చెందిన అన్నం సతీష్‌ప్రభాకర్‌ ఓడిపోయిన విషయం విదితమే. మళ్లీ తనకే పోటీ చేసే అవకాశం వస్తుందనే నమ్మకంతో అన్నం ఉన్నారు. కానీ ఆయన సామాజికవర్గానికి చెందిన మెజార్టీ ఓటర్లు జనసేన వైపు మొగ్గుచూపుతున్నారని చంద్రబాబు దృష్టికి వెళ్లింది.

 

 

యాదవులు, గౌడ్‌ సామాజికవర్గ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారిలో యాదవ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై చంద్రబాబు సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. గౌడ సామాజికవర్గానికి చెందిన వారు రేపల్లె నుంచి పోటీ చేస్తుండడంతో ఆ సామాజికవర్గానికి వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు లేవు. గతంలో బీసీలకు రెండు సీట్లు మాత్రమే ఇవ్వగా ఈసారి నాలుగు సీట్లు ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. దీంతో వైసీపీకి గట్టిపోటీ ఇవ్వవచ్చునని ఎమ్మెల్యేలు, చంద్రబాబు భావిస్తున్నారు. ఏది ఏమైనా గుంటూరు జిల్లాలో వైసీపీకి మద్దతు ఇస్తోన్న క్రైస్తవ ఓటర్లకు ధీటుగా బీసీలకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఇదే విషయంపై చంద్రబాబు ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నారని, కొందరిని రహస్యంగా పర్యటనలు చేయిస్తున్నారని తెలుస్తోంది. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తే 1983 నాటి గాలి మళ్లీ వీస్తుందనేది పార్టీ నాయకుల నమ్మకం. జిల్లాలో దళిత సామాజికవర్గానికి మూడు సీట్లు ఉన్న నేపథ్యంలో బీసీలకు రెట్టింపు ఇవ్వకపోయినా కనీసం ఐదు సీట్లు ఇస్తే పరిస్థితి మెరుగుగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.