అన్యమతస్తులు సంప్రదాయాన్ని పాటించాల్సిందే.. చంద్రబాబు

Publish Date:Sep 27, 2024

Advertisement

వైసీపీ నాయకుడు జగన్‌ని తిరుమలకు వెళ్ళొద్దద్దని ఎవరూ చెప్పలేదని, ర్యాలీలు, జనసమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్రిస్టల్ క్లియర్‌గా చెప్పారు. తిరుమల అంశంపై జగన్ చేసిన ఆరోపణలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తమకు నోటీసులు ఇచ్చారు, తమ తిరుమల పర్యటనను నిలిపేశారని ఆరోపిస్తున్నారు కదా... జగన్‌కి పోలీసులు నోటీసులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. జగన్‌ని వెళ్లొద్దని నోటీసులు అందినట్టయితే, వాటిని మీడియాకి చూపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తూ  ప్రజలను మభ్యపెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

“ఇటీవలి కాలంలో టీటీడీలో జరిగిన పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో తిరుపతిలో సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంది. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు వుంటాయి. తిరుమలకు వెళ్లాలంటే ఎవరైనా ఆ ఆచారాలు, ఆ నియమాలు పాటించాల్సిందే. ఎవరైనా ఆచారాలు పాటించకపోతే భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. స్వామివారి భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల క్షేత్రాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. సొంత మతాన్ని ఆచరించాలి... ఇతర మతాలను గౌరవించాలి’’ అని చంద్రబాబు అన్నారు.

‘‘గతంలో జగన్ నియమాలు ఉల్లంఘించి తిరుమలకు వెళ్ళారు. చాలా మంది అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చి గౌరవంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. అన్య మతాలను గౌరవించడం అంటే.. ఆయా ఆలయాల సంప్రదాయాలను పాటించడమే. బైబిల్‌ని నాలుగు గోడల మధ్యే ఎందుకు చదవాలి? చర్చికి వెళ్లి కూడా బైబిల్ చదవొచ్చు. జగన్ చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబుతున్నారు. నెయ్యి కల్తీ జరగలేదని అంటున్నారు. ఏఆర్ డెయిరీ ఎనిమిది ట్యాంకర్లు పంపింది.. అందులో నాలుగు ట్యాంకర్లు వాడారు. ఈ నివేదిక ఇచ్చింది ఎన్టీడీబీ.. మేము కాదు. ఈ నివేదిక దాస్తే మా ప్రభుత్వం తప్పు చేసినట్లే అవుతుంది. నెయ్యి కల్తీ జరగలేదని జగన్ ఎలా చెబుతున్నారు. గతంలో అడల్ట్రేషన్ పరీక్షకు తన ప్రభుత్వం ఎందుకు పంపలేదు? టెండర్లు పిలవటానికి నిబంధనలు ఎందుకు మార్చారో జగన్ చెప్పాలి. జగన్ హయాంలో నాసిరకం పదార్థాలతో స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన రామతీర్థం, అంతర్వేది ఘటనల మీద  ఇప్పటి వరకు విచారణ జరపలేదు. జగన్ తాను క్రైస్తవుడిని అని ఒప్పుకున్న తర్వాత డిక్లరేషన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి? జగన్ చెబుతున్న అబద్ధాలను ఖండికపోతే జనం అవే నిజాలు అనుకునే ప్రమాదం వుంది. తప్పు జరిగినప్పుడు బాధపడాలే తప్ప ఎదురుదాడి చేయకూడదు. స్వామి వారి విషయంలో చేసిన అపచారాలను నేను కప్పిపుచ్చాలా?’’ అని చంద్రబాబు అన్నారు.

‘‘జగన్‌ వెళ్ళాలనుకుంటేనే తిరుమలకు వెళ్ళొచ్చు. లేకపోతే లేదు. అన్య మతస్థులు ఎవరు తిరుమలకు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. భక్తుల మనోభావాలు దెబ్బతీసే హక్కు జగన్‌కి ఎవరిచ్చారు? దళితులను ఆలయాల్లోకి రానీయడం లేదని జగన్‌కి ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రిగా వుండగా చట్టాలను ఉల్లంఘించానని జగన్ ఎలా చెబుతారు? ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తే మొదట చట్టాలను, సంప్రదాయాలను గౌరవించాలి. తిరుమల స్వామివారిని రాజకీయాలకు, వ్యాపారాలకు వాడుకోవడం జగన్ చేసిన పెద్ద తప్పు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల నియామకంలో జగన్ చేసింది అధికార దుర్వినియోగం. నెయ్యి కల్తీ విషయంలో బాధ్యులు అందరి మీదా చర్యలు వుంటాయి’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.