టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట బుధవారం ( జనవరి 3) నుంచి మరో మారు యాత్ర ప్రారంభించనున్నారు. చంద్రబాబాబు అక్రమ అరెస్ట్ తో మనస్తాపం చెంది చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. వారికి ఆర్థిక చేయూత కూడా ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం అక్టోబర్ నెలలో కూడా నారా భువనేశ్వరి ఈ యాత్ర నిర్వహించిన సంగతి విదితమే. నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి చంద్రగిరికి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మనోవేదనతో చనిపోయిన వారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్ పై ఆవేదనతో గత సంవత్సరం అక్టోబర్ నెల 17న చంద్రగిరిలో టీడీపీ కార్యకర్త ప్రవీణ్ రెడ్డి చనిపోయారు. భువనేశ్వరి ప్రవీణ్ కుటుంబ సభ్యులను అప్పట్లో పరామర్శించి ప్రవీణ్ రెడ్డి తల్లి అనురాధకు రూ.3లక్షల చెక్కును అందజేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగుదేశం పార్టీదే అన్నారు. నిజం గెలవాలి యాత్ర ప్రారంభానికి ముందు ఆమె తిరుమల దర్శించున్నారు. రేపు కూడా ఆమె తిరుమల దర్శించుకుంటారని సమాచారం. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అక్రమ అరెస్ట్ తో మనస్థాపం చెందిన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. చంద్రబాబు విడుదల తర్వాత నిజం గెలవాలి యాత్రను మరో మారు పున: ప్రారంభించాలని నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు. చంద్రబాబు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో మనస్థాపం చెందిన టిడిపి కార్యకర్తలు , అభిమానులు చనిపోయారు. భువనేశ్వరి విజయనగరం జిల్లాలో నిజం గెలవాలి యాత్ర కొనసాగుతున్న సమయంలోనే చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఆమె అర్ధంతరంగా ఈ యాత్ర ఆపారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల అయిన తర్వాత పార్టీ అధినేతకు అనారోగ్యసమస్యలు ఉండటం వల్ల ఈ యాత్ర ఆగిపోయింది. ప్రస్తుతం చంద్రబాబు పూర్తిగా కోలుకున్న నేపథ్యంలో ఈ యాత్ర ఆగిపోయిన విజయనగరం జిల్లా నుంచే పున: ప్రారంభం కానుంది. వారానికి మూడు రోజుల పాటు ఈ యాత్ర నిర్వహించాలని యోచిస్తున్నారు. గతంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆగిపోయింది. జైలు నుంచి విడుదలైన తర్వాత యువగళం యాత్ర పున: ప్రారంభించిన మాదిరిగానే భువనేశ్వరి అర్ధంతరంగా ఆగిపోయిన నిజంగెలవాలి యాత్రను ప్రారంభించబోతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-naidus-wife-bhuvaneshwari--re-launches-nijam-gelavali-tour--39-168040.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.