Publish Date:May 24, 2025
ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర ఇచ్చిన ప్రెజంటేషన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సీఎం ప్రజెంటేషన్లో వివిధ అంశాలు వికసిత్ భారత్కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోడీ సైతం అభినందించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఆ సమావేశంలో వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై చంద్రబాబు నాయుడు నివేదిక ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించి, ఆపరేషన్ సిందూర్ను ప్రశంసిస్తూ నీతి ఆయోగ్ ప్రసంగాన్ని ఏపీ సీఎం ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలను తన ప్రజెంటేషన్లో చంద్రబాబు ప్రస్తావించారు. సీఎం ప్రజెంటేషన్లో వివిధ అంశాలు వికసిత్ భారత్కు ఉపయోగపడేలా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని ప్రధాని సూచించారు. చంద్రబాబు ప్రజెంటేషన్కు సమావేశంలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రజెంటేషన్లో ఏపీ సీఎం ప్రస్తావించారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు చంద్రబాబు వివరించారు. వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్టు ప్రజెంటేషన్లో వివరించారు. రాష్ట్రంలో ఉన్న వనరులను తాము ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామనే విషయాన్ని తన ప్రజంటేషన్లో తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దనున్నట్టు వెల్లడించారు. విశాఖకు గ్లోబల్ హంగులు అద్దేలా నాలుగు జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు. విశాఖ మోడల్ను అమరావతి, తిరుపతి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా ఏపీ సీఎం కోరారు.
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఒప్పందం.. కర్నూలులో డ్రోన్ సిటీ ప్రణాళికలను ప్రజెంటేషన్లో ప్రత్యేకంగా వివరించారు. డిజిటల్ గవర్ననెన్స్లో భాగంగా గూగుల్ ఏఐ వంటి టెక్నాలజీలను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు బిడ్డల నిబంధన రద్దు చేసినట్టు సీఎం వివరించారు. మాతృత్వ సెలవులను 180 రోజులకు పెంచినట్టు సీఎం వెల్లడించారు. ప్రతి జిల్లా, నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు, రాష్ట్ర పురోగతిని కొలిచేందుకు 523 కీలక సూచికలు సిద్ధం చేశామన్నారు. ప్రతి కుటుంబానికి ఓ పారిశ్రామికవేత్త వచ్చేలా ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు, వన్ డిస్ట్రిక్ట్ వన్ పార్క్కు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 2029 నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. పీ4 మోడల్ ద్వారా బంగారు కుటుంబాలకు మార్గదర్శుల ద్వారా సహాయం చేస్తున్నామని.. అర్బన్ రూరల్ సినర్జీ మోడల్ లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తన ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-showered-with-praise-at-niti-aayog-meeting-39-198634.html
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరును అనధికారికంగా వాడుకుంటూ, భౌగోళిక సూచిక హక్కులను ఉల్లంఘిస్తున్న పుష్ మై కార్ట్ సంస్థ కు తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు జారీ చేసింది. ఒక్క పుష్ మై కర్డ్ సంస్థకే కాకుండా ఇలా లడ్డూ ప్రసాదం పేరును, పవిత్రతను అనధికారికంగా ఉపయోగించుకుంటున్న పలు ఇతర సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమై లీగల్ నోటీసులు జారీ చేసింది.
ఎప్ స్టీన్ మామూలోడు కాడు. ఇటు బిల్ క్లింటన్ లాంటి ప్రెసిడెన్షియల్ పర్సనాల్టీస్.. అటు హాలీవుడ్ హీరోస్ తో కస్టమైజ్డ్ ప్రైవేట్ జెట్స్ లో ఆఫ్రికా పర్యటన చేసికొచ్చిన రకం. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు.. ఎప్ స్టీన్ ఎలాంటివాడో.
ఎప్ స్టీన్ మామూలోడు కాడు. ఇటు బిల్ క్లింటన్ లాంటి ప్రెసిడెన్షియల్ పర్సనాల్టీస్.. అటు హాలీవుడ్ హీరోస్ తో కస్టమైజ్డ్ ప్రైవేట్ జెట్స్ లో ఆఫ్రికా పర్యటన చేసికొచ్చిన రకం. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు.. ఎప్ స్టీన్ ఎలాంటివాడో.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 ప్రభాకర్రావుకు సోమవారం (జూన్ 9) సిట్ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి. వాస్తవానికి ఆయన గురువారం (జూన్ 5) విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయనకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ జారీ కావడంలో జరిగిన జాప్యంతో ఇండియాకు రాలేకపోయారని చెబుతున్నారు.
చేసిన పాపం ఎప్పటికైనా బయటపడక తప్పదు. అందులోనూ తిరుమల దేవుడి విషయంలో చేసిన అపచారానికి ఎంతటి వాడికైనా శిక్ష తప్పదు. కర్మఫలం అనుభవించకతప్పదు. ఇప్పుడు జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలు, అరాచకాలు ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి.
నిజమే.. హస్తం పార్టీలో కుస్తీ పట్లు కొత్తకాదు. అందులోనూ.. అధికారంలో ఉన్న సమయంలో నాయకులు, కార్యకర్తలు నాకేంటి.. మాకేంటని పార్టీని నిలదీయడం మరీ కామన్. ఇతర పార్టీలలో అలాంటి, గోల ఉండదా అంటే.. అదేమీ లేదు, అన్ని పార్టీలలో ఉన్నదే. ఉండేదే. అందులో అనుమానం లేదు. ప్రస్తుతం తెలంగాణలో మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్ లో, కల్వకుంట్ల కుటుంబంలో జరుగతున్న రచ్చంతా.. నాకేంటి? అన్న దగ్గరే మొదలైంది, దాని చుట్టూనే తిరుగుతోంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతం కావడం, వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరమల భక్త జన సందోహంతో కిటకిటలాడుతోంది.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తామంటూ గుర్తు తెలియని దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్లో చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మరో కీలక నేత మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు.
బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే విమర్శస్తుంటే మాజీ సీఎం కేసీఆర్ నోరు విప్పలేని స్ధితిలో ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు.
వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. ఇవాళ అమరావతిలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయాలు ప్రకటించారు.
గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరామర్శించారు.