Publish Date:Sep 20, 2019
రాజకీయ వేధింపులకు, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు దేశంలోనే కోడెల సూసైడ్ ఒక కేస్ స్టడీ అన్నారు చంద్రబాబు. చేయని తప్పుకు ఒక నాయకుడిపై ఎలా రాజకీయ వేధింపులకు పాల్పడ్డారో... కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారో... కోడెల కేసు ఒక ఉదాహరణ అన్నారు. కోడెల ఆత్మహత్య, రాజకీయ వేధింపులు, టీడీపీ నేతలపై వరుస కేసులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు... జగన్ ప్రభుత్వ తీరుపై మరోసారి నిప్పులు చెరిగారు. కావాలనే కోడెలపై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. ఫర్నిచర్ తీసుకెళ్లమని కోడెల ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోకుండా, దొంగతనం అభియోగం మోపడంతోనే అవమానం భరించలేక కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారని అన్నారు. స్పీకర్, మంత్రుల కార్యాలయాల్లో ప్రభుత్వ ఫర్నిచర్ ఉండటం సహజమని, ప్రభుత్వం మారితే, వాటిని తిరిగి తీసుకుంటుందని, కానీ జగన్ సర్కారు ... కోడెల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. కేవలం మూడే మూడు నెలల్లో కోడెల కుటుంబంపై 18 కేసులు పెట్టారన్న చంద్రబాబు.... పోలీసులను మేనేజ్ చేసి... నాన్ బెయిలబుల్ సెక్షన్లు జతచేశారని ఆరోపించారు. కోడెల కార్యాలయంలో ప్రభుత్వ ఫర్నిచర్ ఉండటం తప్పయితే, మరి వైఎస్ చనిపోయాక, కుటుంబం మొత్తం నెలల తరబడి ఉండటం సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉండటం నేరం కాదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అంటే మీరు చేస్తే ఒప్పు... ఇతరులు చేస్తే తప్పా అంటూ జగన్ ను నిలదీశారు. కేవలం కేసులతోనే కాకుండా, సోషల్ మీడియా ద్వారా కూడా కోడెలపై తప్పుడు ప్రచారంచేసి వేధించారని బాబు మండిపడ్డారు. పోలీసులు కూడా వైసీపీ నేతలు చెప్పినట్లుగా కేసులు పెట్టి అత్యుత్సాహం చూపించారని చంద్రబాబు ఆరోపించారు. కోడెల మాదిరిగా టీడీపీ నేతలందర్నీ మట్టుబెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్న చంద్రబాబు... ప్రభుత్వ వేధింపులపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. అలాగే కేంద్ర హోంమంత్రిని, అట్రాసిటీ కేసులపై ఎస్సీఎస్టీ కమిషన్లను కలుస్తామని బాబు తెలిపారు.
అయితే, చంద్రబాబుపై మంత్రి బొత్స మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట... ప్రతిపక్షంలోకి వచ్చాక మరో మాట... మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుకు కౌంటరిచ్చారు. పనికిమాలిన వ్యవస్థ అంటూ నిందించిన చంద్రబాబు... ఇప్పుడు అదే గవర్నర్ను ఏ ముఖం పెట్టుకుని కలిశారని ప్రశ్నించారు. ఇక సీబీఐని ఏపీ పొలిమేరకు కూడా రావొద్దన్న బాబు... ఇప్పుడు సీబీఐ విచారణకు ఎలా డిమాండ్ చేస్తారని నిలదీశారు. కోడెల మృతిపై రాజకీయంచేసి లబ్దిపొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, మరి కోడెల బతికుండగా ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పట్టించుకోకపోవడంతోనే కోడెల బీజేపీలోకి వెళ్లాలనుకున్నారని, ఇది నిజం కాదా అన్నారు. కోడెల మొబైల్ మిస్సైందంటున్నారని, మరి ఆ మొబైల్ ఏమైందని చంద్రబాబు ఎందుకు అడగడం లేదని బొత్స ప్రశ్నించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-fires-on-ycp-govt-39-89311.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.