Publish Date:Oct 17, 2019
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి ఐదు నెలలైంది. ఇప్పుడు పార్టీ ఓటమి పై సమీక్షలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు మొదలుపెట్టారు. కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులు బాధితులకు పరామర్శ పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటన చేపట్టారు. తూర్పు గోదావరితో మొదలైన ఈ పర్యటన విశాఖ, నెల్లూరు జిల్లాలో కొనసాగాయి.
రెండు రోజుల పాటు పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజక వర్గాల వారీగా సమీక్ష కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం ఈ సమావేశాల్లో జరిగింది. ఇదంతా ఒకెత్తయితే నెల్లూరు జిల్లాలో పార్టీ ఓటమికి కారణాలు ఏంటి అని చంద్రబాబు నేతలు అడిగారు. జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుంది.
పార్టీ ఇంతగా నష్టపోవటానికి కారణాలు ఏంటి అని నేతలను సూటిగా చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో కొందరు నేతలు సమాధానం చెప్పలేక బిక్కమొహం వేశారు. అయితే కొంత మంది నేతలు మాత్రం మనసు విప్పి మాట్లాడారు.
పార్టీ అధిష్టానం పరంగానే తప్పులు జరిగాయని తప్పులన్నీ మీరే చేసి మమ్మల్ని అడగటం బాగోలేదని కొందరు వాదనలు వినిపించారు. కొన్ని నియోజకవర్గాలు అభ్యర్ధులను మార్చాలనీ ఎన్నికల ముందు పదేపదే చెప్పినా పట్టించుకోలేదని ఏక పక్షంగా అభ్యర్ధులను నిర్ణయించి తమపై రుద్దారని కొందరు కార్యకర్తలు వాపోయారు.
ఇప్పుడు తాము వద్దన్నా నేతల్లో పోటీలోకి దించి వారు ఓడిపోతే తమనడగటం బాలేదని అన్నారు. సూళ్లూరుపేటలో వైసీపీకి అరవై ఒక్క వేల మెజార్టీ ఎలా వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు వెంటనే జోక్యం చేసుకొని క్యాండిడేట్ ను మార్చమని పదేపదే విజ్ఞప్తలు చేసినా పట్టించుకోలేదని దాని ఫలితమే అరవై ఒక్క వేల మెజార్టీ అని చెప్పారు. ఎన్నికల ముందు రిజల్ట్ ఊహించి చెప్తే అధిష్ఠానం పట్టించుకోలేదని ద్వితీయ శ్రేణి నాయకత్వం సూచనలకు కనీసం విలువ ఇవ్వలేదని వాపోయారు.
అధిష్టానం తప్పులు చేసి ఇప్పుడు సమీక్షల పేరిట తాము తప్పు చేశామని కలరింగ్ ఇవ్వడం బాగోలేదని సమావేశంలో కార్యకర్తలు కుండ బద్దలు కొట్టారని తెలుస్తుంది. జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి పార్టీ పరంగా సపోర్ట్ లేదని, ఇలాంటి పరిస్థితుల్లో మంచి అవకాశాలు వస్తే పక్క పార్టీ చెంత చేరటానికి నేతలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ముందే కొందరు కార్యకర్తలు చెప్పినట్లు సమాచారం. మొత్తానికి నెల్లూరు సమీక్ష సమావేశాలు వాడీవేడిగా జరిగాయని తెలుస్తోంది. ఇవి విన్న చంద్రబాబు ఇక పై ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-25-90185.html
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ గట్టిగా అభ్యంతరం చెప్పింది. ఎన్నికలు పూర్తి కాగానే కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు అనుమతించాలంటూ జగన్ సీబీఐ కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
జగన్ సామ్రాజ్యంగా చెప్పుకునే కడప లోక్ సభ స్థానంలో ఈ సారి ఆయన పార్టీ మూడో స్థానానికే పరిమితం కానుందా? అంటే స్థానికులు ఔననే అంటున్నారు. ఈ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగడంతోటే ఇక్కడ వైసీపీ గ్రాఫ్ దిగజారడం ఆరంభమైంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రచార పర్వం ఈ శనివారం (మే 11) సాయంత్రంతో ముగియనుంది. అంటే నిండా మూడు రోజుల వ్యవధి కూడా లేదు. ఈ దశలో రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా సీని పరిశ్రమ వారు రంగంలోకి దిగి పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార రంగంలోకి దూకడంతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమరావతిపై, పగబట్టినట్టుగానే పోలవరంపై కూడా పగబట్టారు. ఆ పనులను నిలిపివేయించారు. కాంట్రాక్టర్లను బెదిరించి పక్కకు తప్పించారు. రివర్స్ టెండర్లు అంటూ పెద్ద డ్రామా నడిపించి.. తమకు అత్యంత దగ్గరివారైన మేఘా కంపెనీకి కాంట్రాక్టును కట్టబెట్టారు. రివర్స్ టెండరింగ్ వ్యవహారం ద్వారా ఇన్ని కోట్ల రూపాయలు ఆదా చేశామంటూ మాయమాటలు వల్లించారు. అప్పటి నుంచి పోలవరం పనులు పూర్తిగా పడకేశాయి.
చింతమనేని విజయం ఖాయమని స్థానికులు అనుకుంటున్నారు. ఈ సారి, లండన్ బాబును లండన్ పంపించి, తనకు ప్రజలు నలభై వేల మెజార్టీ ఇస్తారని నమ్మకంతో చింతమనేని ఉన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో జగన్ చెబుతున్న అబద్ధాలు విని జనం చీదరించుకుంటున్నారు. వీటికంటే ఎక్కువ ఇరిటేషన్ కలిగిస్తున్న అంశం..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారికూడా మీడియా ముందుకు రాలేదు. తెలుగు మీడియా అంటే ఆయనకు చిరాకు కాబోలు.. ఛీఛీ నేనా.. తెలుగు మీడియాతో మాట్లాడటమా అన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నిత్యం కాకపోయినా తరచుగా మీడియా సమావేశాలు ఏర్పాటుచేసి ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరిస్తుంటారు.
కొట్టు సత్యనారాయణ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు. ప్రస్తుతం ఆయన అదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు
అభివృద్ధి జరగాలంటే ఆయుధం ఓటు.. ప్రజా పాలన సాగాలంటే ఆయుధం ఓటు.. అవినీతి ప్రభుత్వాలను కుప్ప కూల్చాలంటే ఆయుధం ఓటు.. కక్షపూరిత పాలన సాగిస్తున్న ప్రభుత్వం మెడలు వంచాలన్నా ఆయుధం ఓటే.. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఆయుధం ఓటు.. ఆ ఆయుధం మన చేతుల్లోనే ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లయ్యింది. ఈ పదేళ్లలో విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు ప్రభుత్వాలను చూశారు. విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.
తెలుగువన్ రూపొందించిన పొలిటికల్ స్పూఫ్ షార్ట్ ఫిలిమ్ గ్యాంగ్స్ ఆఫ్ గగన్ యూట్యూబ్లో ట్రెండింగ్లో వుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల యుద్ధంలో ఓటమి ఖరారైందన్న నిర్ణయానికి వచ్చి అస్త్ర సన్యాసం చేసేశారా? ఎన్నికలు నాలుగు రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. పోటీలో ఉన్న ప్రతి పార్టీ, ప్రతి నాయకుడూ.. ఈ నాలుగు రోజులూ విశ్రాంతి గురించి ఆలోచించకుండా ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు.