మద్దతు బేరీజు వేసుకుంటున్న బాబు?
Publish Date:Oct 2, 2012
Advertisement
తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే వారి సంఖ్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బేరీజు వేసుకుంటున్నారు. దీని కోసం తన కుమారుడు నారా లోకేశ్, బావ బాలకృష్ణ, కోడలు, ఇతర కుటుంబసభ్యులకు బాబు పని కల్పించారట. యాత్రకు ఎంత మంది మద్దతు ఇస్తారు అన్నది లెక్కించటమే కుటుంబం మొత్తం చేయాల్సిన పని. పాదయాత్రలు ముగిసిన తరువాత తమ పార్టీ వాస్తవ పరిస్థితి అంచనా వేసుకోవాలని చంద్రబాబు ఆలోచన. ప్రత్యేకించి ఇలా అంచనాలన్నీ క్రోడీకరించాక నాయకత్వ మార్పు కనుక ప్రజలు కోరుకుంటే నారా లోకేశ్బాబును రంగంలో దింపవచ్చని కూడా బాబు ఆలోచిస్తున్నారట. తన కుమారుడినే రంగంలోకి దింపాల్సి వస్తే కోడలును ప్రచారకార్యదర్శిగా నియమించాలని కూడా యోచిస్తున్నారని బాబు విశ్వాసపాత్రుల భోగట్టా! ఇంతకీ బాబు తన 17వేల కిలోమీటర్ల పాదయాత్రను భారీస్థాయిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సన్నాహాల్లో అన్నిరంగాల వారినీ బాబు సంప్రదించారు. ప్రత్యేకించి పారిశ్రామికవేత్తలు ఇచ్చిన భరోసా పాదయాత్ర నిర్వహణ కొంతవరకూ లాభదాయకమనే భావన కూడా బాబుకు కలిగిందట. గతంలో తమ ప్రభుత్వహయాంలో పారిశ్రామిక మేళ్లు పొందిన వారందరినీ పాదయాత్ర వల్ల ఉపయోగాల గురించి బాబు ప్రశ్నించారని కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. దాంతో పాటు పార్టీపై ఎవరు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో గమనించిన బాబు భవిష్యత్తులో తమకు సహకారం అందించాలని ఓ మాట వేసి ఉంచారట. దీంతో ఎన్నికల ఖర్చుకు కొంత వెసులుబాటు కూడా లభించవచ్చన్న నమ్మకం బాబుకు కుదిరిందని కూడా చెప్పుకుంటున్నారు. దాంతో పాటు సినీరంగంలో తమ మద్దతుదార్లను కనిపెట్టేందుకు నిర్మాతలను, దర్శకులను బాబు ఆహ్వానించారు. దర్శకులు బాబు ఆహ్వానం అందగానే తమ వంతు సలహాలను ఇచ్చేశారు. దీంతో సినీరంగంలో ఇప్పటికే తమ పార్టీ పరిస్థితిపై బాబు ఒక అంచనాకు వచ్చారు. రాజ్యసభ సభ్యుడు మోహన్బాబును బాబు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తారని తాజాసమాచారం. ఈ సమాచారం ప్రకారం చిత్తూరు పర్యటన విజయవంతం చేసేందుకు మోహన్బాబు అభిమానులను తెలుగుదేశం నేతలు సిద్ధం చేశారని తెలిసింది. ఇలా చంద్రబాబు తన పర్యటనలో ఊహించని మలుపులు తిప్పేందుకు జోరుగా కసరత్తులు చేస్తున్నారని తాజాగా తెలిసింది. గాంధీ జయంతి సందర్భంగా జరిగే ఈ పాదయాత్రలకు బావ హరికృష్ణ మద్దతు ప్రకటించటం చంద్రబాబు శుభసూచకంగా భావిస్తున్నారట.
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-24-17814.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





