Publish Date:May 10, 2024
ఎన్నికలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.రాజకీయ నాయకులంతా ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఇన్ని రోజులు మండుటెండలో ప్రచారం సాగించిన నేతలు ఇప్పుడు అకాల వర్షాలతో సతమతమవుతున్నారు. ఓ వైపు భహిరంగ సభలు, రోడ్ షోలతో కార్యకర్తలు తీరిక లేకుండా ప్రజల మద్ధతు కూడగడుతుంటే వర్షం ప్రారంభమైంది.
విజయవాడ నగరంలో భారీ వర్షం కురిసింది. రోడ్ల పైకి వర్షపు నీరు చేరి చిన్నపాటి చెరువును తలపిస్తుంది. భారీ వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారింది. కారు మబ్బులు కమ్ముకోవడంతో పట్టపగలే చిమ్మ చీకట్లు వచ్చాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా దిగివచ్చాయి. దీంతో ఎక్కడి జనం అక్కడే నిలుచిపోయారు. ఉదయం నుంచి వాతావరణం మామూలుగా ఉండి అకస్మత్తుగా పెద్ద ఎత్తున వాన కురిసింది దీంతో జనాలు కొంత అసౌకర్యానికి గురయ్యారు.
గన్నవరంలోనూ జోరుగా వర్షం కురుస్తున్నా చంద్రబాబు సభలో ప్రజలు అలాగే ఉన్నారు. వాన పడుతున్నా బాబు ప్రసంగించారు. ప్రచారంలో భాగంగా తరువాత తెలుగుదేశం అధినేత మాచర్ల వెళ్లాల్సి ఉంది. ఓ వైపు వాన జోరందుకుంది. వాతావరణం బాగాలేకున్నా మాచర్ల వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.కానీ ఆఖరి నిమిషంలో చంద్రబాబు మాచర్ల పర్యటన ఆగింపోయింది. ప్రతికూల వాతావరణం వల్ల మాచర్ల రూట్ క్లిష్టంగా ఉందని, అటవీప్రాంతం మీదుగా వెళ్లాల్సి ఉన్నందున ప్రయాణం సాగించలేమని పైలట్లు తెలిపారు. ఒంగోలు వెళ్లాలన్నా రూట్ డైవర్షన్ తీసుకుంటేనే సాధ్యమని పైలట్లు పేర్కొన్నారు. దీంతో నేరుగా ఒంగోలు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. గన్నవరం నుంచి హెలికాప్టర్లో ఒంగోలు బయలుదేరిన చంద్రబాబు పరిస్థితిని మాచర్ల ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. అవకాశాలన్నీ పరిశీలించినా సాధ్యపడలేదు, కనుకే మాచర్ల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెపిపారు. బ్రహ్మానందరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని, పల్నాడు ప్రజలు తమ ఓటుతో రౌడీ రాజకీయాలకు గుణపాఠం చెప్పాలని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-macharla---trip-canceled-25-175594.html
ఇన్ని వేల కోట్లు పంచిపెట్టినా జనం తనను మోసం చేశారని అంటూ ఒక దశలో జగన్ కన్నీరు పెట్టుకున్నారని కూడా సమాచారం.
రేవ్ పార్టీ ఉచ్చు బిగుస్తోంది. బెంగుళూరు నుంచి తప్పించుకుని వచ్చినట్లు చెబుతున్న పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తల్లి ఆదివారంరాత్రి మృతి చెందింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ ముఖ్య భూమిక వహించారు.
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు’ ఈ పదాన్ని మళ్ళీ వినడానికి ఇంకా ఎంతో సమయం పట్టదు. ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి హోదా వచ్చేసింది.
చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నియోజకవర్గ పరిధిలో ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్లను మళ్లీ స్కృటినీ చేయాలనీ, అలాగే నియోజకవర్గ పరిధిలోని నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఆన సుప్రీం ను ఆశ్రయించారు.
ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది వైసీపీ నాయకులు జైలుకు వెళ్ళడం ఖాయంలా కనిపిస్తోంది. అలా చిప్పకూడు తినే వైసీపీ నాయకులలో మొట్టమొదటి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి వుండబోతున్నారు.
నాలుగు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గాలలో తెలుగుదేశం వినా మరో జెండా ఎగిరిందే లేదు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ఆ రెండు నియోజకవర్గాలూ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలుగానే ఉన్నాయి.
అబ్ కీ బార్ 400 బాహర్ అనే నినాదంతో సార్వత్రిక ఎన్నికల బరిలో దిగిన బిజెపి తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తుందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. అయితే కౌంటింగ్ కు 24 గంట ముందు రెండు ప్రముఖ ఎగ్జిట్ పోల్ సర్వేల్లో మాత్రం హైదరాబాద్ లోకసభ బిజెపి కైవసం చేసుకుంటుందని వెల్లడైంది.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్న జగన్ పార్టీకి సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది.
కొన్ని శక్తులు పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని తపస్సు చేస్తున్నాయి.
వైసీపీ నుంచి అధికార పగ్గాలు చేజారిపోతున్నాయనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లుగా తన మౌఖిక ఆదేశాలతో పోలీసు శాఖను ఉరుకులు పరుగులు పెట్టించిన సజ్జలపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టింది.
కల్వకుంట్ల కవిత ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న కవిత రిమాండ్ని జులై 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.