సెంచరీ చేసిన 63 ఏళ్ళ యువకుడు, చంద్రబాబు!

Publish Date:Jan 8, 2013

Advertisement

 

ఆరోగ్యవంతులయిన యువకులు కూడా చేయ సాహసించని ఒక బృహత్ కార్యక్రమానికి 63 ఏళ్ళ యువకుడు అని చెప్పుకోవలసిన చంద్రబాబు నాయుడు చేసారు. సరిగ్గా వంద రోజుల క్రితం అనంతపురం జిల్లాలో హిందూపూర్ నుండి ‘వస్తున్నా మీ కోసం’ అంటూ పాదయాత్ర మొదలు పెట్టిన చంద్రబాబు ఇంతవరకు 9 జిల్లాలలో ఏకదాటిగా నడుస్తూ మారుమూల గ్రామాలను సైతం పర్యటించారు. అక్కడి ప్రజల కష్టనష్టాలు తెలుసుకొంటూ, వారితో మమేకమవుతూ ముందుకు సాగుతున్న చంద్రబాబు నిన్నటితో తన వరంగల్ జిల్లా పాదయాత్ర ముగించుకొని ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టారు.

 

ఇంతవరకు చంద్రబాబు నాయుడు 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 88 మండలాలు, 13 మునిసిపాలిటీలు, 683 గ్రామాలు సందర్శించారు. అనంతపురం జిల్లాలో 252 కి.మీ, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో 200 కిలోమీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 120 కిలోమీటర్లు నడిచారు.

 

ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ సీనియర్ నేతలు నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కోటేశ్వర రావు తదితరులు మాదిరాపురం గ్రామంలో దాదాపు రూ.50 లక్షలు వెచ్చించి వంద రోజుల పాదయాత్ర ప్రతీకగా వందఅడుగుల ఎత్తుగల ఒక విజయ స్థూపాన్నికూడా నిర్మిస్తున్నారు. చంద్రబాబు దానిని అవిష్కరించిన తరువాత, అక్కడే ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతారు. ఈ సందర్భముగా పార్టీ సీనియర్ నేతలందరూ కూడా సభలో పాల్గోనవచ్చునని సమాచారం. వీరే గాకుండా బాలకృష్ణ, లోకేష్ తదితరులు కూడా పాల్గొనవచ్చును. నిన్నరాత్రి ఖమ్మం జిల్లాలో మాదిరాపురం గ్రామంలో గల మిషనరీస్ కళాశాలలో బసచేసిన చంద్రబాబు, అదే కళాశాల ఆవరణలోనే రాష్ట్ర స్థాయి పార్టీ సమావేశం నిర్వహిస్తారు. సీనియర్ నేతలందరూ పాల్గొనే ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల, సహకార సంస్థలెన్నికలలో పార్టీ అనుసరించవలసిన వ్యూహాల గురించి చర్చిస్తారు. ఆ తరువాత స్థానిక సమస్యలు, విద్యుత్ ధరల పెంపు వంటి ఇతర సమస్యలను కూడా చర్చిస్తారు.

 

 పార్టీ అధ్యక్షుడు స్వయంగా తమ జిల్లాలో ఇన్ని రోజులు పర్యటిస్తునందున, ఈ పర్యటనద్వారా పార్టీకి వీలయినంత ఎక్కువ ప్రయోజనం చేకూరే విదంగా స్థానిక నేతలు అయన పర్యటిస్తున్న మార్గంలో అనేక సభలు, సమావేశాలకు రూపకల్పన చేసారు. అదేవిదంగా పార్టీ అధ్యక్షుడితో కార్యకర్తల ముఖాముఖి కార్యక్రమాలకి కూడా ఏర్పాటు చేసి, పార్టీని మరింత పటిష్టపరిచే విధంగా అనేక పధకాలు తయారు చేసారు.

 

చంద్రబాబు ఖమ్మం జిల్లాలో దాదాపు 102కిమీ. పాద యాత్ర చేసి ఈ నెల 15వ తేదిన జగ్గయపేట నుండి తన కృష్ణజిల్లా పాదయాత్ర ప్రారంబిస్తారు.

 

ఇంతవరకు స్థానిక ప్రజలో తెలుగుదేశం పార్టీ తెలంగాణా వ్యతిరేఖమనే భావనను తన యాత్ర ద్వారా చంద్రబాబు పూర్తిగా తుడిచిపెట్టేయడమే గాకుండా, తెలంగాణా జిల్లలో నిర్వీర్యమయిన తన పార్టీ క్యాడర్ ను కూడా పునరుజీవింపజేసుకొన్నారు. అదే సమయంలో చంద్రబాబు స్వయంగా మారు మూల గ్రామాలను సైతం పర్యటించడం వల్ల స్థానిక సమస్యల పట్ల అవగాహన పెంచుకోవమే గాకుండా గ్రామీణ స్థాయిలో ఉన్న సామాన్య కార్యకర్తలను కూడా అయన స్వయంగా కలుసుకొని వారి సాధక బాధకాలు తెలుసుకోగలిగేరు.

 

 
ఈ యాత్ర వల్ల తెలుగుదేశం మరో విదంగా కూడా చాల లాభపడిందని చెప్పవచ్చును. ఆయన పాదయాత్ర మొదలు పెట్టిన మొదలుగా రాష్ట్రాన్ని, దేశాన్నిపాలిస్తున్నకాంగ్రెస్ పార్టీ వరుసపెట్టి చేస్తున్న తప్పులను, చంద్రబాబు ప్రజల మద్యనే ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు ప్రజలకి వివరిస్తూ, కాంగ్రెస్ పాలనను సమర్ధంగా ఎండగట్టగలిగేరు. నిత్యం సరికొత్త వివాదాలలో ఇర్రుకొంటూ, ఈ మూడు నెలల్లో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రకటిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబుకి ఆయన పాద యాత్ర చేస్తునంత కాలం కూడా చాలానే ఆయుధాలు అందజేస్తూ, అయన పాదయాత్ర విజయవంతం అయ్యేందుకు పరోక్షంగా చాలా సహాయపడినందుకు చంద్రబాబు మరియు అయన పార్టీ కూడా కాంగ్రేసు పార్టీకి కృతజ్ఞతలు చెప్పుకోక తప్పదు.

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.