Publish Date:Aug 30, 2013
చంద్రబాబు క్రిందటి ఆదివారం విజయనగరం జిల్లా నుండి చేప్పట్టాలనుకొన్నఆత్మగౌరవ యాత్రను తెదేపా నేతల సూచన మేరకు వాయిదా వేసుకొన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేనెల 1న గుంటూరు జిల్లా నుండి యాత్రకు సిద్దమవుతుంటే తెదేపా నేత పయ్యావుల కేశవ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన యాత్ర చెప్పటడం అంత మంచిదికాదని సూచించారు.
ఏపి.ఎన్.జి.ఓ సంఘ అద్యక్షుడు అశోక్ బాబు కూడా ఆయనకు అదేవిధంగా సలహా ఇచ్చారు. రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ ఆయన ఏవిధంగా లేఖ ఇచ్చారో, అదేవిధంగా ఇప్పుడు సమైక్యాంధ్ర కోరుతూ ఒక లేఖ ఇచ్చి యాత్ర మొదలుపెడితే ఆయనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇచ్చారు. విభజనకు అనుమతించిన చంద్రబాబు ఇప్పుడు ఆత్మగౌరవం గురించి మాట్లాడటం అనుచితమని అశోక్ బాబు అన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో ఆయన యాత్ర చేప్పటడం అంత మంచిది కాదని, అందువల్ల యాత్ర విరమించుకోవడం మేలని చంద్రబాబుకి సలహా ఇచ్చారు. ఈ పరిస్థితులు అన్నితెలిసి యాత్రకు బయలుదేరదలిస్తే, అందుకు సిద్దపడే రావడం మేలని సలహా ఇచ్చారు. ఆయన ఇప్పటికీ రాష్ట్ర విభజనకే మొగ్గు చూపుతునట్లయితే, రానున్న ఎన్నికలలో ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని అశోక్ బాబు అన్నారు.
ఈవిధంగా ఒకరి తరువాత మరొకరు చంద్రబాబు యాత్రను వ్యతిరేఖిస్తుండటంతో అసలు ఆయన యాత్ర మొదలుపెడతారా లేదా అనే విషయంపై పార్టీ శ్రేణులలో కూడా సందిగ్ధం నెలకొంది.
దీనిని బట్టి గతంలో ఆయన పాదయాత్ర చేసిప్పటి పరిస్థితులకి నేటికీ చాలా తేడా వచ్చినట్లు అర్ధం అవుతోంది. అప్పుడు ఆయన తెలంగాణకు అనూకలంగా లేఖ ఇచ్చినప్పటికీ, ఈవిధంగా పార్టీలో కానీ, ప్రజల నుండి కానీ వ్యతిరేఖత కానరాలేదు. బహుశః ఆయన లేఖ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేస్తుందని ఎవరూ విశ్వసించక పోవడం వలననే అప్పుడు ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోకపోయి ఉండవచ్చును. కానీ, రాష్ట్ర విభజన అనివార్యంగా కనబడుతున్నఈ తరుణంలో అందుకు అనుకూలంగా లేఖ ఇచ్చారనే కాంగ్రెస్, వైకాపాల ప్రచారం వలన చంద్రబాబు యాత్రకి అభ్యంతరాలు ఎదురవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-39-25464.html
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.