ఒకదెబ్బకు రెండు పిట్టలా?

Publish Date:Jun 13, 2014

Advertisement

 

నిన్న వైజాగ్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో క్విడ్-ప్రో క్రింద జరిగిన అక్రమ భూపంపకాలను గుర్తించి, అటువంటి భూములను తిరిగి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలని నిర్ణయించారు. అందుకోసం మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీని వేసేందుకు చంద్రబాబు అంగీకరించారు. క్విడ్ ప్రోకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవినావ సంబంధం గురించి అందరికీ తెలిసిందే. అంటే చంద్రబాబు ప్రభుత్వం తన తొలి సమావేశంలోనే అతని చుట్టూ మరింత గట్టిగా ఉచ్చు బిగించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే చంద్రబాబు మాత్రం తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా ద్వేషం లేదని, అక్రమంగా కేటాయించబడ్డ ప్రభుత్వ భూములను గుర్తించి వెనక్కు తీసుకోవడానికే ఈ ప్రతిపాదనకు అంగీకరించానని చెప్పుకొన్నారు. కానీ అన్ని నదులు చివరికి సముద్రంలోనే కలిసినట్లుగా, అన్నిక్విడ్ ప్రో కేసులూ చివరికి జగన్మోహన్ రెడ్డి కేసులలోనే కలుస్తున్నాయి గనుక ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన మిగిలినవారందరితో పాటు జగన్మోహన్ రెడ్డికీ మళ్ళీ సమస్యలు తప్పవని అర్ధం అవుతోంది.

 

ప్రస్తుతం అతనిపై ఇదే వ్యవహారంలో పది చార్జ్ షీట్లు సీబీఐ కోర్టులో ఉన్నాయి. గనుక ఆ కేసులతో సంబంధం ఉన్న భూముల వ్యవహారంలో మంత్రుల సబ్-కమిటీ వేలు పెట్టలేదు కానీ ఇంకా అటువంటివి మరేమయినా ఉన్నాయేమో తెలుసుకొని వాటిని వెనక్కు తీసుకొనే ప్రయత్నం చేయవచ్చును. ఇదివరకు జగన్ క్విడ్ ప్రో కేసులపై సమగ్ర దర్యాప్తు చేసి, సీబీఐ కోర్టులో జగన్ పై చార్జ్ షీట్లు దాఖలు చేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణను తిరిగి రప్పించి ఆయనకే ఈ భాద్యతలు అప్పగిస్తే బాగుటుందని మంత్రులు దేవినేని ఉమా, బొజ్జల గోపాల కృష్ణ చేసిన సూచనకు చంద్రబాబుకు అంగీకారం తెలిపారు. త్వరలో కేంద్రంతో మాట్లాడి ఆయనను వెనక్కు రప్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు.

 

గత పదేళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూములు క్విడ్ ప్రో పద్దతిలో అక్రమంగా ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు రాజధాని, కొత్తగా స్మార్ట్ సిటీలు, శాటిలైట్ సిటీలు రోడ్లు, భవనాలు నిర్మాణం కోసం వేల ఎకరాల భూములు, డబ్బు చాలా అవసరం. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా పంచబడిన ఆ లక్షల ఎకరాల భూములలో సగమయినా వెనక్కి రాబట్టగలిగినట్లయితే చాలా ఉపయోగపడుతుంది. పైగా ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఈ వ్యవహారామంతా జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకే పరిమితం చేసినట్లయితే విమర్శలు మూటగట్టుకోవడం తధ్యం.

 

అయితే అక్రమంగా పంచబడిన భూములను చంద్రబాబు ప్రభుత్వం తిరిగి స్వాదీనం చేసుకోనగలిగితే, కాగల కార్యం ఆ లక్ష్మి నారాయణుడే చక్కబెట్టగలరు. అప్పుడు చంద్రబాబు ఆశించినట్లు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లవుతుంది.

By
en-us Political News

  
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.