Publish Date:May 10, 2024
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు మాచర్లలో పర్యటించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి, పల్నాటి పౌరుషాన్ని చూపించడానికి సిద్ధంగా వున్న మాచర్ల నియోజకవర్గ ప్రజలను పలకరించడానికి చంద్రబాబు వెళ్ళాలని అనుకున్నారు. అయితే అనుకోకుండా భారీ వర్షం కురవడం వల్ల చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దు చేసుకోవలసి వచ్చింది. అనంతరం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఒంగోలు బయల్దేరారు. ఈ సందర్భంగా మాచర్ల ప్రజలకు చంద్రబాబు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. వాతావరణం ఇబ్బంది కారణంగా రద్దయిన తన ప్రయాణాన్ని మాచర్ల ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. మాచర్ల వెళ్లేందుకు అన్ని అవకాశాలు పరిశీలించినా సాధ్యపడలేదు కాబట్టే రద్దు చేసుకున్నానని, దీనిని మాచర్ల ప్రజలు సహృదయంతో స్వీకరిస్తారన్న నమ్మకం తనకు వుందని చంద్రబాబు చెప్పారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న బ్రహ్మానంద రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి తీసుకురావాలి ఆయన మాచర్ల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రౌడీ రాజకీయానికి పల్నాడు ప్రజలు తమ ఓటుతో గట్టి గుణపాఠం చెప్పాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandra-babu-sorry-to-machrala-peple-39-175599.html
టీడీపీ ఆధిక్యం 21.. వైసీపీ ఆధిక్యం 00
రాజమండ్రి గ్రామీణం.. గోరంట్ల బుచ్చయ్య ఆధిక్యం
కుప్పంలో చంద్రబాబు ఆధిక్యం
8 గంటల 30 నిమిషాలకు దేశవ్యాప్తంగా ఆధిక్యం
దేశప్రజలందరూ సుదీర్ఘంగా నిరీక్షించిన సమయం రానే వచ్చింది. పార్లమెంటుతోపాటు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. 8.30 గంటల తర్వాత ఈవీఎంలను తెరుస్తారు
కాకినాడ శ్రీపీఠం స్వామి పరిపూర్ణానందకు రాజకీయ పురుగు కుట్టింది. ఆధ్యాత్మిక బోధనలకు ఫుల్ స్టాప్ పెట్టేసి రాజకీయ ఉపన్యాసాలకు తెరలేపారు.
పీలో మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రారంభం. మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు నియోగించుకున్నారు.
4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు ఎవరికి మద్దతు పలికారు? ఎన్డీయే కూటమికే మరోసారి జైకొట్టారా..? ఇండియా కూటమిని గద్దెనెక్కించబోతున్నారా? ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నది. కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న ప్రశ్నలివి.
ఐదేళ్ల కష్టం కళ్లముందే కదలాడుతోంది.. అడుగడుగునా ఇబ్బందులు.. సమస్యలు పరిష్కరించాల్సిన పాలకులు సహజవనరులు దోచుకోవడంపైనే దృష్టిపెట్టారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేశారు. అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించారు . ప్రజలకు అండగా నిలిచిన ప్రతిపక్ష నేతలను చిత్రహింసలకు గురిచేశారు. అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించారు.
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-0
ఇన్ని వేల కోట్లు పంచిపెట్టినా జనం తనను మోసం చేశారని అంటూ ఒక దశలో జగన్ కన్నీరు పెట్టుకున్నారని కూడా సమాచారం.
రేవ్ పార్టీ ఉచ్చు బిగుస్తోంది. బెంగుళూరు నుంచి తప్పించుకుని వచ్చినట్లు చెబుతున్న పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు.