చంద్రబాబు.. పవన్ బేటీ.. ఏపీలో రాజకీయ వేడి

Publish Date:Oct 19, 2022

Advertisement

ఒక్క సమావేశం.. ఒకే ఒక్క సమావేశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను వేడెక్కించింది. ఔను రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే దాదాపు అలాంటి చిత్రమే ఆవిష్కృతమైంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు విజయవాడ నోవాటెల్ లో బస చేసిన పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.

ఇద్దరూ కలిసి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ఆ తరువాత దాదాపు గంట సేపు ఇరువురూ ముఖాముఖీ భేటీ అయ్యారు. ఇప్పటికే జనసేన, బీజేపీ మిత్రపక్షాలు.. ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉంది. అయినా ఈ మూడేళ్లలో ఇరు పార్టీలూ కలిసి పని చేసిన సందర్భాలు పెద్దగా లేవు. కలిసి పోరాటాలు చేసిన సందర్భమూ లేదు. చివరాఖరికి విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం జరిగే అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టించిన సందర్భంలోనూ.. పవన్ కు మద్దతుగా బీజేపీ ముందుకు రావడంలో జాప్యం చేసింది. ముందుగా తెలుగుదేశం సంఘీభావం ప్రకటించింది. ఆ తరువాతే బీజేపీ పవన్ కల్యాణ్ కు సంఘీభావం ప్రకటిస్తూ ముందుకు వచ్చింది. సరే ఆ సంగతి పక్కన పెడితే విజయవాడ నోవాటెల్ హోటల్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ బేటీ రాష్ట్ర రాజకీయాలలో పొత్తలపై చర్చను మళ్లీ తెరమీదకు తీసుకు వచ్చింది. వీరి భేటీకి ముందు మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశంలో బీజేపీ విషయంలో తన అసంతృప్తి ఇసుమంతైనా దాచుకోకుండా వ్యక్తం చేశారు.

ఆ తరువాత చంద్రబాబుతో భేటీ కావడంతో ఇరు పార్టీల మధ్య వచ్చే ఎన్నికల నాటికి పొత్తు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పొత్త ఖాయమనీ, బీజేపీ కలుస్తుందా లేదా అన్నది ఆ పార్టీ తేల్చుకోవలసిన అంశమని అంటున్నారు. అన్నిటికీ మించి గంట సేపు ముఖాముఖీ భేటీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చకు వచ్చిన అంశాలేమిటి? పొత్తుల ప్రస్తావన వారి మధ్య వచ్చిందా అన్న విషయంపై రాజకీయ వర్గాలలో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పొత్తు ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా వైసీపీ నుంచి ఒంటరి పోరుకు దమ్ముందా? అంటూ ఆవుకథలాంటి విమర్శలు వెల్లువెత్తాయి. కాగా నోవాటెల్ లో చంద్రబాబు పవన్ బేటీ సమయంలో ఓ పది నిముషాల పాటు మాత్రమే నాగబాబు, నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

ఆ తరువాత దాదాపు గంట సేపు బాబు, పవన్ కల్యాణ్ ముఖాముఖీ ముచ్చటించుకున్నాయి. కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరరు విశాఖలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై పవన్ కల్యాణ్ చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉమ్మడి వేదిక ఏర్పాటు ఆవశ్యకతపై, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావాలని ఒక నిర్ణయానికి వచ్చారు. వామపక్షాలు, బీజేపీలను ఓకే వేదికపైకి తీసుకురావడం ఒకింత కష్టమైనా, రాష్ట్రంలో అరాచక పాలనను ఎదిరించేందుకు అందరినీ కలుపుకుపోవాలని ఇరువురు నాయకులూ అభిప్రాయపడ్డారు.

ఇక వీరి బేటీలో ముందస్తు ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం పోరాటాలు చేస్తూనే మరో వైపు ఎన్నికలకూ సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఇరువురూ కూడా తమ సంభాషణలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 

By
en-us Political News

  
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
Publish Date:May 3, 2026
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు. ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.