చాణక్యుడు చెప్పిన మాట.. ఇలాంటి వ్యక్తులను ఎప్పుడూ సమస్యలు చుట్టుముడతాయట..!

Publish Date:Nov 27, 2024

Advertisement

చాణక్యుడు చంద్రగుప్త చక్రవర్తికి దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా అందరికీ సుపరిచితుడు. ఈయన రాజనీతిలో మాత్రమే కాకుండా తాత్విక విషయాలను కూడా చాలా స్పష్టంగా, క్షుణ్ణంగా తన చాణక్య నీతి గ్రంథాలలో వివరించాడు.  ముఖ్యంగా మనిషి అలవాట్లను, మనిషి ప్రవర్తనను చాణక్యుడు చెప్పిన విధానం తెలుసుకుంటే మనుషుల జీవితాలు చాలా మారిపోతాయి.  జీవితంలో ఎప్పుడూ  సమస్యలతో చుట్టు ముట్టే వ్యక్తుల గురించి,  వ్యక్తి ప్రవర్తన గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు..

చాణక్యుడు చెప్పిన కొన్ని పద్యాలు, వాటి భావాలు తెలుసుకుంటే ఆయన చెప్పిన విషయాలు బాగా అర్థమవుతాయి.

వ్యవయనర్గతమాకారః శుచయతి|

ఒక వ్యక్తి మనసులో ఏముందో అది ఆ వ్యక్తి ముఖంలో స్పష్టంగా వ్యక్తమవుతుందట. అబద్దాలు చెప్పే వ్యక్తుల ముఖంలో కూడా అలాగే ఆ ఉద్దేశాలు వ్యక్తమవుతాయి.  అలాంటి వ్యక్తులు ఏదైనా దాచి పెట్టాలని చూసినా అందులో అర్థం లేదు.. అందరికీ అవి అలా అర్థమైపోతూ ఉంటాయి.  అబద్దం చెప్పే వ్యక్తులు తమ జీవితంలో ఇతరులను మోసం చేస్తున్నామని, ఇతరుల నుండి లాభపడుతున్నామని, కొన్ని సమస్యల నుండి తప్పించుకుంటున్నామని అనుకుంటారు. కానీ అందులో అర్థం లేదు.. ఇలాంటివి చేయడం వల్ల వారికి సమస్యలు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు.

దాచిన పాపానాం సాక్షిణో మహాభూతాని|

రహస్యంగా చేసిన పాపాలకు ఇతరులు ఎవరూ సాక్షులు లేరని చాలామంది సంతోషపడుతుంటారు.  తమకు ఎలాంటి నష్టం జరగదని తమను ప్రశ్నించేవారు ఎవరూ ఉండరని అనుకుంటూ ఉంటారు.  కానీ అలా రహస్యంగా చేసిన పాపాలకు పంచభూతాలే సాక్ష్యాలు.. పంచభూతాలైన భూమి, నీరు,  కాంతి,  వాయువు,  ఆకాశం ఇవన్నీ ప్రతి వ్యక్తి కదలికకు, చేసే తప్పులకు, చేసే మంచి పనులకు కూడా సాక్ష్యులుగా ఉంటాయి.

ఆత్మః పాపాత్మైవ ప్రకాశయతి

పాపం చేసే వ్యక్తి మనసులో ఎప్పుడూ అశాంతి నెలకొని ఉంటుందట. తను చేసిన తప్పు ఎవరూ చూడకపోయినా, ఎవరికీ తెలియక పోయినా తప్పు చేశాను కదా అనే భావన మనసులో ఉంటుంది.  ఈ భావన అనేది ఎప్పుడూ మనసులో గుర్తుకువస్తూ మనశాంతి లేకుండా చేస్తుంది.  దీని వల్ల మనసు కూడా నిలకడగా ఉండదు.

ఎవరైనా తప్పుగా సాక్ష్యం చెబితే..

తప్పుగా సాక్ష్యం చెప్పేవారు ఉంటారు కొందరు. దానివల్ల వారికి కాస్తో కూస్తో లాభం చేకూరుతుందని అలా చేస్తారు. లేదా కొన్ని సార్లు తప్పు సాక్ష్యం చెప్పడం వల్ల తనకు కావలసిన వారు సమస్యల నుండి బయటపడతారని అనుకుంటారు.  కానీ ఇలా తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు నరకానికి వెళతారని ఆచార్య చాణక్యుడు చెప్పుకొచ్చాడు.  అలాంటి వ్యక్తులు అశాంతితో రగిలి పోవడమే కాకుండా.. వారిని ఎప్పుడూ సమస్యలు చుట్టు ముడతాయట. కాబట్టి అబద్దాలు చెప్పడం, తప్పుడు సాక్ష్యాలు చెప్పడం జీవితంలో వ్యక్తిని పతనానికి తీసుకెళుతుందని.


                                              *రూపశ్రీ.


 

By
en-us Political News

  
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.